Sarkar Live

Sunita Williams | భార‌త్‌కు సునీతా విలియమ్స్.. ప‌ర్య‌ట‌న ఎప్పుడంటే..

Sunita Williams : భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడం (coming back to Earth)తో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సాహసాలను చవిచూసిన ఆమె విజయవంతంగా తన

Sunita Williams

Sunita Williams : భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకోవడం (coming back to Earth)తో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అంతరిక్ష ప్రయాణంలో ఎన్నో సాహసాలను చవిచూసిన ఆమె విజయవంతంగా తన మిషన్ (mission)ను పూర్తి చేసి భూమి (Earth)పై అడుగుపెట్టారు. ప్రస్తుతం సునీతా విలియమ్స్ కొంతకాలం నాసా (NASA) వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులను కలుసుకుని మరికొంత సమయం గడపనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత భారత్‌లో పర్యటించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని సునీతా విలియమ్స్ బంధువు ఫల్‌గునీ పాండ్యా వెల్లడించారు. జాతీయ మీడియాతో ఆయ‌న ప‌లు అంశాల‌పై మాట్లాడారు.

కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి టూర్లు

భూమికి సురక్షితంగా సునీతా విలియమ్స్ (Sunita Williams) చేరుకోవడం తనకు అపారమైన ఆనందాన్ని కలిగించిందని ఫల్‌గునీ పాండ్యా తెలిపారు. డ్రాగన్ క్రూ క్యాప్సూల్ ద్వారా పారాషూట్ల సహాయంతో సముద్రంలో ఆమె దిగిన విధానం చూసి ఆశ్చర్యపోయామని అన్నారు. ఇది నిజంగా అద్భుతమైన అనుభవమని, ఇంతవరకు చూడని దృశ్యాలను చూస్తున్నట్టు అనిపించిందని తెలిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాత సునీతా విలియమ్స్ భార‌త్‌లో పర్యటిస్తారని అన్నారు. అయితే.. ఇప్పటి వరకు క‌చ్చితమైన తేదీలు నిర్ణయించలేదని చెప్పారు. ఈ ఏడాదిలోనే ఆమె భారత్‌కు రావడానికి సిద్ధమవుతున్నారని, కుటుంబ సభ్యులందరం కలిసి సెలవుల సందర్భంగా ప్రత్యేక ప్రదేశానికి వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నామని వివరించారు. గత సెప్టెంబరు 19న అంతరిక్షంలోనే ఆమె తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని గుర్తుచేశారు.

ప్ర‌ధాని మోదీ ఆహ్వానించారు..

భారత పర్యటనపై సునీత (Sunita Williams) ఉత్సాహంగా ఉన్నట్టు తెలిపారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Prime Minister of India Narendra Modi) అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు సునీతకు ప్రత్యేకంగా లేఖ రాసి, భారత్‌ పర్యటనకు ఆహ్వానించారని తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆమె భారత్‌లో పర్యటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. అంతేగాక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో భేటీ అయినప్పుడు కూడా ప్రధాని మోదీ సునీత ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా చర్చించారని తెలియజేశారు. ఆమె భూమికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు మరికొంత సమయం పడుతుందని నాసా ((NASA) వైద్యులు పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయాణం తర్వాత శరీరానికి సరైన నడవడిక రావడానికి కొన్ని ప్రత్యేకమైన వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్న తర్వాత, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపి, ఆపై తన భారత పర్యటన కోసం సిద్ధమవుతారని తెలియజేశారు.

భార‌తీయ సంస్కృతిపై ఆస‌క్తి

సునీతకు భారత సంస్కృతీ సంప్రదాయాలపై చాలా ఆసక్తి ఉందని, ఆమె మహాకుంభమేళా గురించి తెలుసుకోవాలని కోరారని తెలిపారు. పాండ్యా మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు తెలియగానే, ఆ సందర్భానికి సంబంధించిన ఫొటోలను తనకు పంపించాలని సునీత కోరారని చెప్పారు. అటువంటి భిన్నమైన అనుభవాలను ఆమె ఎప్పుడూ ఆసక్తిగా తెలుసుకోవాలనే తపన చూపుతారని వెల్లడించారు.

Sunita Williams- భారతీయ మూలాలు

సునీతా విలియమ్స్ ఒహాయో రాష్ట్రంలో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌కు చెందినవారు. వారి స్వస్థలం గుజరాత్‌లోని మెహసానా జిల్లా. అమెరికాలోనే పెరిగి చదువుకున్న సునీత తన కృషితో నాసాలో వ్యోమగామిగా చేరి అంతరిక్ష ప్రయాణాలు చేయగలిగిన గొప్ప ఘనతను సాధించారు. భారత సంతతికి చెందిన వ్యక్తిగా అంతరిక్షంలో ఆమె చేసిన ప్రయాణాలు, సాధించిన విజయాలు భారతీయులకు గర్వకారణంగా మారాయి.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?