తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న I నుంచి VIII తరగతుల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన (Midday meal scheme ) పథకం కోసం ప్రభుత్వం ఎట్టకేలకు నిధులు విడుదల (Funds Releases) చేసింది. కొన్ని నెలలుగా ఈ పథకానికి సంబంధించిన వంట ఖర్చులు (cooking expenses), కుకింగ్ హెల్పర్స్ (community cooking helpers)కు ఇచ్చే చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం రూ. 44.91 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాఠశాలలలో పెండింగ్లో ఉన్న బిల్లులు క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విడుదలైన నిధులు ఇలా..
ప్రభుత్వం విడుదల చేసిన మొత్తంలో వంట ఖర్చు కోసం రూ. 34.91 కోట్లు, కమ్యూనిటీ కుకింగ్ హెల్పర్స్కు రూ.10 కోట్లు విడుదల చేసింది. సహాయకులైన హెల్పర్స్కు, సెప్టెంబరు నెలలకు కలిపి రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంది.
ప్రభుత్వం విడుదల చేసిన మొత్తాలు జిల్లాల వారీ (district-wise)గా విద్యార్థుల నమోదు (ఎన్రోల్మెంట్) ఆధారంగా మారుతూ ఉన్నాయి. పెద్ద జిల్లాలకు ఎక్కువ, చిన్న జిల్లాలకు తక్కువ నిధులు కేటాయించారు.
పెద్ద జిల్లాలకు ఎక్కువ నిధులు
హైదరాబాద్, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి రూ.1.63 కోట్లు నుంచి రూ. 2.24 కోట్లు కేటాయించారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఈ జిల్లాలకు ఎక్కువ మొత్తాలు కేటాయింపు అయ్యాయి.
మధ్యస్థ జిల్లాలు
నిధుల పరంగా రూ.1 కోటి నుంచి రూ.1.6 కోట్లు రేంజ్లో నిధులు అందుకుంటున్న జిల్లాలు మెదక్, మహబూబాబాద్, నాగర్కర్నూల్, సిద్ధిపేట, నల్లగొండ ఉన్నాయి. ఈ జిల్లాల్లో చదువుతున్న పిల్లల సంఖ్య మధ్యస్థంగా ఉండటంతో ఈ మేరకు నిధులు కేటాయించారు.
చిన్న జిల్లాలకు తక్కువ నిధులు
పిల్లల సంఖ్య తక్కువగా ఉండే చిన్న జిల్లాలకు రూ. 40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య నిధులు ఇచ్చారు. ఈ జిల్లాల్లో పాఠశాలలు తక్కువగా ఉండటం, నమోదు అయ్యే విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
అన్ని 33 జిల్లాలకు ఈ మేరకు విడుదల చేసిన మొత్తం కలిపి రూ.44,91,48,486గా ఉంది.
ప్రభుత్వ ఆదేశాలు – నిధుల వినియోగం ఎలా జరగాలి?
ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే వాటిని సరైన విధంగా పాఠశాలలకు చేరవేయాలని విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
- PFMS ద్వారా నిధుల బదిలీ
జిల్లా విద్యా అధికారులు (DEOలు) ఈ మొత్తాన్ని Public Financial Management System (PFMS) ద్వారా మాండల స్థాయికి మార్చాలి. మాండల స్థాయిలో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు.
- SNA ఖాతాలకు నిధుల జమ
అకౌంట్స్ ఆఫీసర్లు ముందుగా మొత్తాన్ని State Nodal Agency (SNA) ఖాతాల్లో జమ చేయాలి. ఆ తరువాత అదే ప్రక్రియలోని నిబంధనల ప్రకారం జిల్లా ఖాతాలకు బదిలీ చేయాలి. ఆలస్యం చేయకూడదని స్పష్టం చేశారు.
- పాఠశాలలకు నిధుల చేరిక
జిల్లా కార్యాలయాలు రిలీజ్ ఆర్డర్ జారీ చేసిన తరువాత పాఠశాలలు తమ వాటా మొత్తాన్ని పొందుతాయి. పాఠశాలల్లో వంట కోసం కావాల్సిన పదార్థాలు కొనుగోలు, హెల్పర్స్ వేతనాల చెల్లింపులు కూడా ఈ మొత్తాలతో నిర్వహించబడతాయి.
పిల్లల భోజనంపై ప్రభావం
గత కొన్ని నెలలుగా నిధులు ఆలస్యం కావడం వల్ల కొన్ని పాఠశాలల్లో వంట సామగ్రి కొనుగోలులో ఇబ్బందులు ఎదురయ్యాయి. వంట మనుషులకి వేతనాలు నిలిచిపోవడంతో అసంతృప్తి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులను విడుదల చేయడం పాఠశాలలకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. అలాగే, విద్యార్థుల ఆరోగ్యం, హాజరు శాతంపై మధ్యాహ్న భోజనం ప్రభావం ఉండటంతో, ఈ నిధుల విడుదలతో పథకం మరింత సజావుగా నడుస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.







