Sarkar Live

Earthquake | వికారాబాద్‌లో భూకంపం.. ఓవైపు భారీ వ‌ర్షాలు.. మరోవైపు ప్ర‌కంప‌న‌లు

ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు Earthquake : వికారాబాద్ జిల్లాలో ఈ రోజు తెల్ల‌వారుజామున భూమి కంపించింది. భారీ వ‌ర్షం న‌డుమ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రత న‌మోదైంద‌ని అధికారులు తెలిపారు. కొన్ని సెకన్లపాటు మాత్రమే ఈ ప్ర‌కంప‌న‌లు

Earthquake

ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

Earthquake : వికారాబాద్ జిల్లాలో ఈ రోజు తెల్ల‌వారుజామున భూమి కంపించింది. భారీ వ‌ర్షం న‌డుమ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రత న‌మోదైంద‌ని అధికారులు తెలిపారు. కొన్ని సెకన్లపాటు మాత్రమే ఈ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. ఈ సంఘటన భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో చోటుచేసుకోవడంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

ప్రకంపనలు ఎక్కడెక్క‌డ అంటే..

తెల్లవారుజామున సుమారు 3.45 గంటల సమయంలో బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్, ప‌రిగి పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ప్రత్యేకంగా జిల్లాకు ఆగ్నేయ దిశలో ఉన్న మండలాల్లో ఇవి ఎక్కువగా క‌నిపించాయ‌ని స్థానికులు చెబుతున్నారు. దీని ప‌రిస్థితిపై సహజ విపత్తుల విభాగం అధికారులు సమీక్షిస్తున్నారు.

Earthquake : రెండు విపత్తుల కలయిక

సాధారణంగా ఒక ప్రాంతంలో ఒకే సమయంలో రెండు సహజ విపత్తులు సంభవించడం అరుదు. కానీ వికారాబాద్‌లో ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవైపు భారీ వర్షాలు ముంచెత్తుతుండ‌గా మరోవైపు తెల్లవారుజామున భూకంప ప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. తక్కువ తీవ్రత గల భూకంపాలు పెద్ద నష్టం కలిగించకపోయినా, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే భూగర్భ పరిస్థితులపై మరింత శాస్త్రీయ పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు.

భారీ వర్షాల‌తో పంట‌లకు న‌ష్టం

కొన్ని రోజులుగా వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు వ్యవసాయ భూములను, ముఖ్యంగా పత్తి పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. అనేక పత్తి చేనులు ముంపున‌కు గుర‌య్యాయి. పంటల్లో నిల్వ నీరు ఎక్కువ కాలం ఉంటే రైతులకు ఆర్థికంగా పెద్ద నష్టం కలగొచ్చని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు.

రైతుల్లో ఆందోళన

పత్తి పంటలే కాకుండా మక్కజొన్న, జొన్న, కంది వంటి పంటలూ నిల్వ నీటితో నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎరువులు, విత్తనాల కోసం రుణాలు తీసుకున్నామని, ఇప్పుడు పంట నష్టపోతే ఎలా? అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ముంపు ప్రాంతాల్లో పంటల నష్టం అంచనా వేయడానికి సర్వే ప్రారంభించారు. త్వరలోనే రైతులకు సహాయం అందించేలా నివేదిక సిద్ధం చేస్తామని హామీ ఇస్తున్నారు.

అధికారులు ఏమంటున్నారంటే..

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ కారణంగా ముంపు పరిస్థితులు మరింత తీవ్రం కావచ్చని అధికారులు చెబుతున్నారు. భూకంపం పునరావృతం అవుతుందా? అనే దానిపై మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కానీ జాగ్రత్త చర్యలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?