Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్షాల నినాదాల (Opposition Protests) మధ్య పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఈ రోజు మధ్యాహ్నం ప్రవేశపెట్టారు. దీనిపై ఎనిమిది గంటల చర్చ (Parliament Debate) జరుగుతుందని, అవసరమైతే సమయం పెంచే అవకాశం కూడా ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం “బుల్డోజ్” చేస్తోందని ఆరోపించాయి. బిల్లును సభ దృష్టికి తెచ్చినప్పటి నుంచి సవరణలకు సమయం ఇవ్వలేదని వాదించాయి.
Waqf Amendment Bill ప్రయోజనకరమే : కిరణ్ రిజిజు
బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ను లోక్సభలో ప్రవేశపెడుతున్నందున ఇది చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు. 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు జాతీయ ప్రయోజనాల కోసమేనన్నారు. యావత్ భారతదేశం మొత్తానికి, ముఖ్యంగా ముస్లింలు (Muslim Welfare), మహిళలు, పిల్లలకు ప్రయోజనం చేకూరుస్తుందని నొక్కి చెప్పారు.
మద్దతు ఇస్తారని నమ్ముతున్నా..
పార్లమెంటరీ సమావేశాలకు ముందు మీడియాతో రిజిజు (Kiren Rijiju) మాట్లాడుతూ “ఈరోజు చారిత్రాత్మకమైన రోజు, ఎందుకంటే 2025 వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెడతారు. జాతీయ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన ఈ బిల్లును లక్షలాది మంది ముస్లింలు మాత్రమే కాకుండా దేశం మొత్తం మద్దతు ఇస్తుందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. దేశానికి, ముఖ్యంగా పేద ముస్లింలు, మహిళలు, పిల్లల సంక్షేమానికి ప్రయోజనం చేకూర్చే ఏ చర్యకైనా మేము కట్టుబడి ఉన్నాం. బిల్లును వ్యతిరేకించేవారు రాజకీయ కారణాలతో అలా చేస్తున్నారు. నా వాదనలను నేను సభలో వివరిస్తాను అన్నారు.
కేంద్రం ఏమంటోందంటే…
భారతదేశంలోని వక్ఫ్ (Waqf ) ఆస్తుల నిర్వహణలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి, మెరుగుపరచడానికి 1995 వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి వక్ఫ్ సవరణ బిల్లు రూపొందించబడిందని కేంద్రం అంటోంది. ఈ ఆస్తుల సమర్థవంతమైన పరిపాలనను నిర్ధారిస్తూ వక్ఫ్ బోర్డు విధులు క్రమబద్ధీకరించడం ఈ బిల్లు లక్ష్యమని చెబుతోంది.
Waqf Bill : వ్యతిరేకత?
వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Bill)పై ముస్లింలలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వక్ఫ్ ఆస్తులపై కేంద్ర ఆజమాయిషి చెల్లదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లుపై చర్చించడానికి ప్రభుత్వం 8 గంటల సమయం మాత్రమే కేటాయించిందని, 12 గంటలు కేటాయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం తమ గొంతులను అణచివేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం “బుల్డోజ్” చేస్తోందని, చర్చకు సరైన సమయం ఇవ్వకుండా బలవంతంగా ఆమోదించాలని చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








