Winter Season | తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి వేళ 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎకువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.3 డిగ్రీలు నమోదు అయింది. అలాగే న్యాల్కల్లో 9.6 డిగ్రీలు, గుమ్మడిదలలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.. మెదక్ జిల్లా శివ్వంపేటలో 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.2 డిగ్రీలు రికార్డ్ అయింది.
ఇదిలా ఉండగా , సోమవారం రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నమోదైన విషయం తెలిసిందే.. సిర్పూర్(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయినట్లు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 8.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.9 డిగ్రీలు, జోగులాంబ గద్వాలలో 15.1, సూర్యాపేటలో 15.6, వనపర్తిలో 15.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగటానికి కారణమని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. winter season
కాగా, తెలంగాణలో రానున్న మూడు రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సంగారెడ్డి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మిగిలిన 27 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్లో ఉష్ణోగ్రతలు తకువ స్థాయికి పడిపోతుంటాయి. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబర్లోనే చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పదేళ్లతో పోల్చితే ఈ నెల 23న రాత్రి నాలుగు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
4 Comments
[…] […]
[…] […]
[…] ఇటీవల తీవ్ర చలికాలం (winter season) వాతావరణం నెలకొంది. అయితే.. ఇది […]
[…] తెలంగాణ జైళ్ల (Telangana Jails)లో మాజీ ఖైదీలు పనిచేస్తున్న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 29 ఇంధన విక్రయ కేంద్రాల (Petrol Pumps) ను నడుపుతున్నట్లు ఆమె తెలిపారు. ‘స్మార్ట్ జైళ్లు’ (Smart Jails) కార్యక్రమంలో భాగంగా జైళ్ల ఆధునీకరణ కోసం తమ డిపార్ట్మెంట్ పనిచేస్తోందని సౌమ్య మిశ్రా తెలిపారు. జైళ్ల శాఖ అధిక నైపుణ్యం కలిగిన ఖైదీలకు రోజుకు రూ.200, నైపుణ్యం కలిగిన ఖైదీలకు రూ.150, సెమీ స్కిల్డ్-రూ.125, నైపుణ్యం లేని ఖైదీలకు రూ.100 చొప్పున చెల్లిస్తోందని వివరించారు. […]