RTC Strike | నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత: డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్..
90 శాతం కాలిన గాయాలతో ఎంజీఎంకు తరలింపు!
RTC Strike | తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉగ్రరూపం దాల్చుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న కార్మికులు, ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ప్రాణత్యాగాలకు సిద్ధపడుతుండటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (Shankar Goud) ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని..
నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న బోలా శంకర్ గౌడ్ () , గత రెండు రోజులుగా సాగుతున్న సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే, ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడం, తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆవేదనతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నిరసన ప్రదర్శన జరుగుతున్న స...

