అమాత్యా .. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయండి | Grain procurement
ఆన్లైన్ ట్రక్ షీట్ విధానంపై రైతుల ఆందోళన
పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల వేడుకోలు
Grain procurement old method | రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 'ఆన్లైన్ ట్రక్ షీట్' విధానం రైతుల పాలిట శాపంగా మారింది. ఈ కొత్త నిబంధనల వల్ల ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని, తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
రైతుల ఆందోళనలకు ప్రధాన కారణాలు..
సాంకేతిక సమస్యలు: ఆన్లైన్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.సర్వర్ సమస్యల వల్ల ట్రక్ షీట్ల జనరేషన్ గంటల తరబడి నిలిచిపోతోంది.
క్షేత్రస్థాయిలో ఇబ్బందులు: మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా ఉండటంతో రైతులు ఐకేపీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
కొనుగోళ్లలో జాప్యం: ఒకవైప...
