Sarkar Live

Day: May 1, 2026

పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్
Crime

పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

​ పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందనే బలమైన నమ్మకాన్ని కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. విధుల నిర్వహణలో అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖ గౌరవాన్ని ఇనుమడింపజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ​పదోన్నతి పొందిన అధికారుల మర్యాదపూర్వక భేటీ ​వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల స్థాయి నుండి ఏసీపీ (ACP) లుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బోలగాని శ్రీనివాస్ గౌడ్, సార్ల రాజు లు శుక్రవారం సీపీ క్యాంపు కార్యాలయంలో కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సీపీకి పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.​అధికారులను అభినందించిన అనంతరం కమిషనర్ పలు కీలక సూచనలు చేశారు.పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, వాటిని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.నిరంతరం క్షేత్రస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షిస్తూ, వారికి సరై...
లంచం అడిగితే.. చెప్పులతో కొట్టారు! ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికుడి దాడి – RTC Ticket Inspector Attack
Viral

లంచం అడిగితే.. చెప్పులతో కొట్టారు! ఆర్టీసీ చెకింగ్ అధికారిపై కండక్టర్, ప్రయాణికుడి దాడి – RTC Ticket Inspector Attack

RTC Ticket Inspector Attack | సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ తనిఖీల సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒకవైపు నిబంధనల ఉల్లంఘన, మరోవైపు అధికారి లంచం డిమాండ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి టికెట్ ఇన్‌స్పెక్టర్‌పై కండక్టర్, ప్రయాణికుడు చెప్పులతో దాడి చేసే స్థాయికి చేరుకుంది. అసలేం జరిగింది? హైదరాబాద్‌ నుంచి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును రాయికోడ్ వద్ద టికెట్ చెకింగ్ అధికారి ప్రకాష్ తనిఖీ కోసం ఆపారు. ఈ క్రమంలో బస్సులో ఓ ప్రయాణికుడు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా టికెట్ లేని ప్రయాణికుడికి జరిమానా విధించడం, కండక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం నిబంధన. అయితే, ఈ కేసు నమోదు కాకుండా ఉండాలంటే తనకు రూ. 20 వేల లంచం ఇవ్వాలని అధికారి ప్రకాష్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అంత పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడంతో ఆగ్రహాన...
TRS Party | తెలంగాణ లో ‘కవిత’పార్టీకి స్పేస్ ఉంటుందా?
Special Stories

TRS Party | తెలంగాణ లో ‘కవిత’పార్టీకి స్పేస్ ఉంటుందా?

​తెలంగాణ గడ్డపై మరో రాజకీయ యుద్ధానికి తెరలేచింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రక్షణ సేన' (Kalvakuntla Kavitha TRS Party) పేరుతో కొత్త పార్టీని ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. తండ్రి స్థాపించిన నాటి 'తెలంగాణ రాష్ట్ర సమితి'ని గుర్తుచేసేలా ఈ పేరు ఉండటం, పసుపు-ఆకుపచ్చ-నీలం రంగులతో కూడిన జెండాను ఆవిష్కరించడం ద్వారా ఆమె తన స్పష్టమైన ఉద్దేశాలను చాటారు. అయితే, ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలతో నిండిపోయిన తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఈ 'TRS'కు స్థానం ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ​త్రిముఖ పోరులో నాల్గవ పార్టీ నిలదొక్కుకునేనా? ​ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఇలా ఉన్నాయి.. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికలల్లో గెలిచి జోరు మీదుంది.పలురకాల సంక్షేమ పథకాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ...
error: Content is protected !!