Sarkar Live

Day: May 26, 2026

​ఇంటి స్థలం గొడవ: అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం
Crime

​ఇంటి స్థలం గొడవ: అవమానం భరించలేక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం

ఇంటి స్థలం కొలతల విషయంలో తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానలా మారి, ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నానికి దారితీసిన ఘటన గీసుగొండ మండల పరిధిలోని దస్రు నాయక్ తండా (మంగళ తండా) లో చోటుచేసుకుంది. గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ​అప్పుల బాధతో స్థలం విక్రయం.. ​మంగళ తండాకు చెందిన కేలోతు కవిత, ఆమె భర్త శ్రీధర్ అప్పుల బాధలు తాళలేక తమకు ఉన్న ఇల్లు, ఇంటి స్థలాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కవిత ఆడబిడ్డ అయిన గూగులోతు విజయ (భువనగిరి), మరియు జరుపుల మంగమ్మ (మంగళ తండా) లు ఆ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నెల 24వ తేదీన గ్రామ పెద్దల సమక్షంలో ఒక గుంట స్థలానికి రూ. 2,60,000 చొప్పున ధర నిర్ణయించుకుని, లక్ష రూపాయలను అడ్వాన్స్‌గా కూడా చెల్లించారు. ​కొలతల వేళ వివాదం – చెప్పులతో దాడి.. ​మరుసటి రోజు (మే 25న)...
ఏసీబీ వలలో తహశీల్దార్
State

ఏసీబీ వలలో తహశీల్దార్

​అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. లంచం డబ్బుల కోసం బాధితులను వేధిస్తున్న ప్రభుత్వ అధికారుల గుట్టురట్టు చేస్తున్నారు. తాజాగా సోమవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహశీల్దార్ (MRO) సుచరిత ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ​అసలేం జరిగిందంటే..? ​ఒక బాధితునికి సంబంధించిన రెవెన్యూ పనిని పూర్తి చేయడానికి తహశీల్దార్ సుచరిత రూ. 2 లక్షల నగదును లంచంగా డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చుకోలేక, అవినీతి అధికారికి బుద్ధి చెప్పాలనుకున్న బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం రచించారు. ​డ్రైవర్ ద్వారా లంచం.. పక్కా ప్లాన్‌తో పట్టుకున్న ఏసీబీ ​తహశీల్దార్ ఆదేశాల మేరకు ఆమె ప...
​Private School Fee | బడులు తెరుచుకోకముందే ‘ఫీజుల’ వేట.. ప్రైవేట్ స్కూళ్ల నిలువు దోపిడీ!
Special Stories

​Private School Fee | బడులు తెరుచుకోకముందే ‘ఫీజుల’ వేట.. ప్రైవేట్ స్కూళ్ల నిలువు దోపిడీ!

​Private School Fee | మరికొన్ని రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం (2026-27) ప్రారంభం కానుండటంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు మళ్లీ ఫీజుల వేట మొదలుపెట్టాయి. బడులు ఇంకా తెరుచుకోకముందే అడ్మిషన్లు, పుస్తకాలు, యూనిఫామ్‌ల పేరిట సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులకు భారీ చిల్లు పెడుతున్నాయి. ప్రభుత్వ జీవోలు, కోర్టుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రైవేట్ స్కూళ్ల ‘ఫీజు’ రాజ్యం నిరంకుశంగా సాగుతోంది. ​Private School Fee : 20% నుండి 30% పెరిగిన ఫీజులు.. నో డొనేషన్, నో సీట్! ​గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫీజులను ఏకంగా 20% నుండి 30% వరకు పెంచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ​ప్రాథమిక తరగతులకే రూ. 50 వేల నుండి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. ​హైస్కూల్ విద్యార్థులకు అయితే టెక్నో, ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ స్కూలు స్థాయిని బట్టి రూ. 1.5 లక్షల నుండి రూ. 3 l...
error: Content is protected !!