కాజీపేటలో ‘రైళ్ల’ తయారీ షురూ: పూర్తి కావచ్చిన మెగా యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లు!
Kazipet Railway Unit | తెలంగాణ రవాణా రంగ ముఖచిత్రాన్ని మార్చబోయే కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (కోచ్ ఫ్యాక్టరీ) పనులు దాదాపు పూర్తి కావచ్చాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. త్వరలోనే ఈ యూనిట్లో అత్యాధునిక 'ఇంటర్ సిటీ రైళ్ల' తయారీ ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో కాజీపేట రైల్వే తయారీ యూనిట్ ప్రగతిపై నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో మంత్రి ఈ కీలక వివరాలను పంచుకున్నారు.
ఐదేళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లు.. స్వల్ప దూర ప్రయాణాలకు వరం!
రానున్న ఐదేళ్ల కాలంలో కాజీపేట యూనిట్ నుండి ఏకంగా 200 అత్యాధునిక ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వల్ప దూర ప్రయాణాల (Short-distance travel) కోసం ఈ రైళ్లను పెద్ద ఎత్తున వినియోగించనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా వ...
