BSNL 5G | బిఎస్ఎన్ఎల్ 5G వస్తోంది, ఈ రెండు మహా నగరాల నుంచే ప్రారంభం
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL నుంచి బిగ్ న్యూస్ వస్తోంది. డిసెంబర్ నాటికి దేశంలోని రెండు ప్రధాన నగరాలైన దిల్లీ. ముంబైలలో BSNL 5G సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. BSNL 4G, 5G సేవల కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కొంతకాలం క్రితం దిల్లీలో BSNL 4G సేవలను కూడా ప్రారంభించిన తర్వాత ఈ అప్డేట్ వచ్చింది. గత సంవత్సరం జూలైలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచినపుడు, దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు BSNL కు మారిపోయారు. దీని తరువాత, BSNL వరుసగా రెండు త్రైమాసికాలకు లాభాలను నమోదు చేసింది. అయితే, BSNL 5G, 4G సేవల కోసం చాలా కాలంగా నెమ్మదిగా విస్తరించడం వల్ల, BSNL గత కొన్ని నెలలుగా వినియోగదారులను కోల్పోతోంది. అటువంటి పరిస్థితిలో, డిసెంబర్ నుండి 5G సేవ ప్రారంభమవుతుందనే వార్తలు ప్రజలకు ఊరట కలిగిస్తోంది.
BSNL 5G ప్రయోగాత్మక పరీక్షలు సక్సెస్...




