Hyderabad | కాల్పులు జరిపి.. కత్తులతో నరికి రియల్టర్ దారుణ హత్య
హైదరాబాద్ (Hyderabad) జవహర్నగర్ పోలీస్స్టేషన్ (Jawaharnagar Police Station) పరిధిలోని సాకేత్ కాలనీలో ఈ రోజు ఉదయం దారుణ హత్య చోటుచేసుకుంది. రత్నం అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి (Real estate businessman)ని గుర్తుతెలియని దుండగులు నడిరోడ్డుపై నరికి చంపారు. బైక్పై ఉన్నఅతడిపై తొలుత కాల్పులు జరిపి, ఆపై కత్తులతో దాడి చేసి హత్య (murder) చేశారని తెలుస్తోంది.
ఆర్థిక వైరం ప్రధాన కారణమా?
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. హత్యకు దుండగులు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని, ఇతర ఆధారాలను సేకరించారు. చుట్టుపక్కల ఉన్న CCTV ఫుటేజ్ను కూడా సేకరించారు. ఆస్తుల వివాదాలు, ఆర్థిక లావాదేవీల్లో చోటుచేసుకున్న విభేదాలే (financial issue) ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలోనే దుండగులు రత్నంను నడిరోడ్డుపై మర్డర్ చేస...




