RTO corruption | మహబూబాబాద్లో లంచాలు మరీ కాస్ట్లీ
ప్రభుత్వ ఫీజు గోరంత.. మామూళ్లు కొండంత..
లంచాల లావాదేవీలకు ఐదుగురే కింగ్ పిన్లు
డీటీవో, ఏఎంవీఐలను "సంతోష" పెడుతున్న ఉద్యోగి
Mahaboobabad RTO corruption : ఆ కార్యాలయంలో లంచాలు చాలా కాస్ట్లీగా ఉంటాయట. కార్యాలయంలో ఏ సేవలైన సాఫీగా సాగాలంటే సదరు కార్యాలయ ఉన్నతాధికారి ఫిక్స్ చేసిన మామూళ్లు(లంచాలు) పరోక్షంగా చెల్లించక తప్పదని జిల్లా వ్యాప్తంగా వాహనదారులు కోడైకూస్తుండడంతో సదరు అధికారుల వ్యవహారం ఇప్పుడు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం.ఆ రవాణా శాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఫీజుల కంటే సంబంధిత అధికారులకు ఇచ్చే మామూళ్లే ఎక్కువ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని తెలుస్తోంది.ప్రభుత్వ ఫీజు గోరంత ఉంటే మామూళ్లు (Bribes) కొండంత ఉంటాయని మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళిన వాహనదారులు బహిరంగంగా నే మాట్లాడుకోవడం గమనార్హం.
RTO corruption : లంచాల లావాదేవీకి ఐదుగురే ‘కింగ్పిన్ల...




