Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Food Poisoning | కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం..
Crime

Food Poisoning | కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Food Poisoning : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఫుడ్ పాయిజనింగ్‌ ఘటన జుక్కల్ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర హాస్టల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. Food Poisoning in Kamareddy District : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్‌ కులాల బాలుర హాస్టల్‌లో శుక్రవారం నలుగురు విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. నివేదికల ప్రకారం, నలుగురు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులయ్యాయి. వీరిని సిబ్బంది చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తీవ్ర కడుపునొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరాడు. అన్నం ఉడకపోవడం వల్ల కడుపునొప్పి వచ్చిందని విద్యార్థులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ...
Formula E Car Case : ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఊరట
State

Formula E Car Case : ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఊరట

Formula E Car Case | మాజీ మంత్రి కె.తార‌క రామారావు (KT Rama rao)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ ‌రేస్ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేయాలని కేటీఆర్ స‌మ‌ర్పించిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై హైకోర్టులో శుక్ర‌వారం విచారణ జరిగింది. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. మ‌రోవైపు కేటీఆర్‌పై ఏసీబీ(ACB) నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవ‌చ్చని పేర్కొంది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు (High Court ) ఈనెల 27కి వాయిదా వేసింది. అయితే ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి కోరారు. కేటీఆర్‌ ‌తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ ‌న్యాయవాది సుందరం ప్రభాకర్‌రావు, గండ్ర మోహ...
Om Prakash Chautala | ఓం ప్ర‌కాశ్ చౌతాలా క‌న్నుమూత‌
National

Om Prakash Chautala | ఓం ప్ర‌కాశ్ చౌతాలా క‌న్నుమూత‌

Om Prakash Chautala | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్‌ద‌ళ్‌ (INLD) నేత ఓంప్రకాశ్ చౌతాలా (89) ఈ రోజు మ‌ధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న తుదిశ్వాస విడిచారు. గురుగ్రాంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో 12 గంట‌ల‌కు చౌతాలా క‌న్నుమూశార‌ని ఆయ‌న కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. మాజీ ఉప ప్ర‌ధాని దేవీలాల్ కుమారుడైన ఓం ప్ర‌కాశ్ హ‌ర్యానా సీఎంగా ఐదుసార్లు ప్రాతిధ్యం వ‌హించారు. ఆరోగ్యం క్షీణించి.. ఓంప్ర‌కాశ్ చౌతాలా (Om Prakash Chautala) మూడు నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఈరోజు ఉదయం చౌతాలా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింద‌ని, దీంతో 11:35 గంటలకు ఆస్ప‌త్రిలో చేర్చామ‌ని, ప‌రీక్షించిన వైద్యులు అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్టు నిర్ధారించార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయ‌న అంత్య‌క్రియ‌లు రేపు (శ‌నివారం) సిర్సా ...
Adani : అదానీకి భారీ ఊర‌ట‌.. ‘ధారావి’పై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌!
Business

Adani : అదానీకి భారీ ఊర‌ట‌.. ‘ధారావి’పై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌!

Adani | ముంబైలోని ధారావి పునరుద్ధరణ ప్రాజెక్టుకు అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెండర్ మంజూరును బాంబే హైకోర్టు (Bombay High Court) స‌మ‌ర్థించింది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ దాఖ‌లైన పిటీష‌న్‌ను ఈ రోజు కొట్టేసింది. అభ్యంత‌రాల‌కు బ‌ల‌మైన కార‌ణాలు చూప‌క‌పోవ‌డంతో దీన్ని తిర‌స్క‌రిస్తున్నామ‌ని చీఫ్ జస్టిస్ డి.కె. ఉపాధ్యాయ, జస్టిస్ అమిత్ బోర్కర్ లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ (Adani Properties Private Ltd)కు టెండర్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ యూఏఈకి చెందిన సెక్లింక్ టెక్నాలజీస్ కార్పొరేషన్ (UAE-based Seclink Technologies Corporation) సంస్థ ఈ పిటీష‌న్‌ను 2022లో దాఖలు చేసింది. దీన్ని ప‌రిశీలించిన హైకోర్టు త‌న తీర్పును వెలువ‌రించింది. టెండ‌ర్ ఖ‌రారుతో వివాదం 2022లో నిర్వహించిన 259 హెక్టార్ల ధారావి పునరుద్ధరణ ప్రాజెక్ట్ (Dhar...
Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం
Crime

Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం

Fatal Accident : రాజ‌స్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలు (Chemical) త‌ర‌లిస్తున్న ఓ ట్రక్కు అదుపు త‌ప్పి అనేక వాహనాలతో ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో 30 వాహ‌నాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. ఐదుగురు సజీవ ద‌హ‌న‌మ‌య్యారు. 37 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. భారీ ప్రమాదం (Fatal Accident) ఎలా జ‌రిగిందంటే.. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... రసాయన పదార్థాలు (కెమిక‌ల్స్‌) ర‌వాణా చేస్తున్న ఓ ట్ర‌క్కు జైపూర్‌- అజ్మీర్ జాతీయ ర‌హ‌దారి (National highway )పై అదుపు త‌ప్పి ఇతర వాహనాలను ఢీకొంది. దీంతో ట్రక్కులో ఉన్న రసాయనాలు అంటుకుని ఒక్క‌సారిగా మంటలు వ్యాపించాయి. చూస్తూ చూస్తుండానే 30కి పైగా వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళాలు కూడా ఆ వాహనాల వ‌ద్ద‌కు చేరుకోలేనంత‌గా మంట‌లు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంతో ...
error: Content is protected !!