ACB | బిల్లు కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ
అవినీతి అధికారుల వేటలో తెలంగాణ ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక అధికారి, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. పనులు పూర్తి చేసినా, బిల్లులు ఆపేసి వేధిస్తున్న తీరుపై విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.
ఏం జరిగిందంటే..?
హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక కాంట్రాక్టర్ తుపాను నీటి కాలువ (Storm Water Drain) నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించిన మెజర్మెంట్ బుక్ (M-Book) లో వివరాలు నమోదు చేసి, ఫైనల్ బిల్లును ప్రాసెస్ చేయాల్సి ఉండగా.. అసిస్టెంట్ ఇంజనీర్ (AE) నుసుం సుధాకర్ రెడ్డి చక్రం తిప్పాడు. పని పూర్తి చేసినందుకు 'ఆఫీస్ ఫేవర్' కింద రూ. 50,000 లంచం ఇవ్వాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశా...




