ఇంటర్ మూల్యాంకనం.. ఈసారి కొత్త విధానం – Intermediate Results
Intermediate Results : తెలంగాణలో ఇంటర్మీడియట్ (Telangana Intermediate Board) వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ (Valuation Process) తుది దశకు చేరుకుంది. మార్చి 19న ప్రారంభమైన ఈ ప్రక్రియ, ఏప్రిల్ 10తో ముగియనుంది. ఈసారి ఫలితాల్లో (Intermediate Results) తప్పులు రాకుండా ఇంటర్ బోర్డు ఎన్నడూ లేని విధంగా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సరికొత్త నిర్ణయం తీసుకుంది. ‘రీఫెరెన్స్ మూల్యాంకన’ అనే కొత్త విధానాన్ని అమలు చేస్తోంది.
ఏమిటా కొత్త విధానం?
మూల్యాంకనం పూర్తయిన జవాబు పత్రాలను మరోసారి రీచెక్ (Random Slot Rechecking) చేయడం ద్వారా విద్యార్థులకు కచ్చితమైన మార్కులు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే.. మొదట మూల్యాంకన పూర్తయ్యాక ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని జవాబు పత్రాలను మళ్లీ పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో కొన్ని ర్యా...




