Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
KTR : కేటీఆర్‌కు మ‌ళ్లీ నిరాశే.. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు
State

KTR : కేటీఆర్‌కు మ‌ళ్లీ నిరాశే.. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు

Hyderabad : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (BRS working president KTR)కు మ‌ళ్లీ నిరశే ఎదురైంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ఈ రోజు తిరస్కరించింది. త‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల‌ను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ ఆశ్ర‌యించగా ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీం కొట్టివేసింది. హైకోర్టు ఉత్త‌ర్వుల్లో జోక్యం చేసుకోలేమ‌ని.. కేటీఆర్ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన న్యాయమూర్తులు బేలా ఎం.త్రివేది (Justices Bela M Trivedi), పి.బి.వరాలే (PB Varale)తో కూడిన ధర్మాసనం దానిని తిర‌స్క‌రించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ముందుగానే తిరస్కరించన విష‌యం విదిత‌మే. హైకోర్టు (Telangana High Court) జారీ చేసిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమ‌ని పేర్కొంటూ కేటీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేస...
Justice Sujoy Paul | తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుజోయ్ పాల్‌
State

Justice Sujoy Paul | తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుజోయ్ పాల్‌

Justice Sujoy Paul : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్ (Justice Sujoy Paul) నియమితుల‌య్యారు. బాంబే హైకోర్టుకు ఇటీవ‌ల బ‌దిలీ అయిన జ‌స్టిస్ అలోక్ అర‌ధ్ (Justice Alok Aradh) స్థానంలో పాల్ బాధ్య‌త‌లు చేప‌డ‌తారు. నియామ‌క ఉత్త‌ర్వులు జారీ జస్టిస్ పాల్ సీనియర్ న్యాయమూర్తి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జ‌డ్జిగా ఉన్నారు. గ‌తంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనేతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of Telangana High Court) జస్టిస్ సుజోయ్ పాల్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నియమించిన‌ట్టు కేంద్ర న్యాయ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. జ‌స్టిస్ సుజోయ్ పాల్ నేప‌థ్యం ఇదీ… మ‌ధ్యప్ర‌దేశ్‌కు చెందిన జ‌స్టిస్ సుజోయ్ పాల్ 1964న జూన్ 21...
Game Changer box office : భారత్ లో రూ.100 కోట్లు వసూలు  చేసిన రామ్ చరణ్ సినిమా
Cinema

Game Changer box office : భారత్ లో రూ.100 కోట్లు వసూలు చేసిన రామ్ చరణ్ సినిమా

Game Changer box office Collections : మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్‌ చరణ్, లెజండ‌రీ దర్శకుడు శంకర్ నుంచి వ‌చ్చిన‌ గేమ్ ఛేంజర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరుగా రాణిస్తోంది. మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ, పొలిటికల్ థ్రిల్లర్ దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల నికర వసూలు చేసింది. సంక్రాంతికి ఈ సినిమా తన పర్సులో మరో 10 కోట్ల రూపాయలను జోడించింది. గేమ్ ఛేంజర్ జనవరి 10న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ తెలుగు, తమిళం, హిందీ మూడు భాషల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. . తొలిరోజు నుంచి ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం, సాక్‌నిల్క్, గేమ్ ఛేంజర్ దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్ల నికర రాబట్టింది. 5వ రోజు కలెక్షన్ 4వ రోజు సంఖ్యల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఐదు రోజుల్లో, పొలిటికల్ థ్రిల్లర్ భారతదేశంలో రూ. 106.15 కోట్లు వసూలు చేసింది. Game...
Mahakumbh Mela :  జ‌న‌సంద్రంగా త్రివేణి సంగ‌మం.. మ‌హాకుంభమేళాలో అమృత స్నానం
National

Mahakumbh Mela : జ‌న‌సంద్రంగా త్రివేణి సంగ‌మం.. మ‌హాకుంభమేళాలో అమృత స్నానం

Mahakumbh Mela 2025 : త్రివేణి సంగ‌మం భ‌క్త‌జ‌న సంద్రంగా మారింది. మ‌హా కుంభామేళా (Mahakumbh Mela) లో పాల్లొన్న కోట్లాది మంది భక్తులు అమృత స్నానం (Amrit Snan) చేయ‌డంలో ఆ ప్ర‌దేశ‌మంతా మ‌హా సందడిగా మారింది. ఈ పుణ్య‌స్నానాల ఘ‌ట్టం మూడు రోజులుగా సాగుతుండ‌గా ఈ రోజు కూడా కోట్లాది మంది ఇందులో పాల్లొన్నారు. పూల వ‌ర్షం కురిపించిన సీఎం యోగి ఉత్త‌రప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్ (Prayagraj) జ‌రుగుతున్న మ‌హాకుంభమేళా జ‌న‌సంద్రంగా మారింది. దేశ‌విదేశాల నుంచి కోట్లాది మంది భ‌క్తులు ఈ జాత‌ర‌కు త‌ర‌లివ‌స్తున్నారు. కుంభామేళాలో భాగంగా గంగా, య‌మున‌, స‌ర‌స్వ‌తి త్రివేణి సంగ‌మం వ‌ద్ద ఇప్ప‌టికే 3.5 కోట్ల మంది అమృత స్నానం ఆచ‌రించార‌ని అధికార యంత్రాంగం వెల్ల‌డించింది. ఈ అమృత స్నానం మూడు రోజులుగా కొన‌సాగుతుండ‌గా బుధవారం కూడా అశేష భ‌క్త‌జ‌నం దీనిని ఆచ‌రించార‌ని తెలిపింది. మంగ‌ళ‌వారం అమృత్ స్నానం త‌ర్వాత భ‌క్తుల‌పై ఆ...
Indian Army Day 2025 : భారతదేశ సైనిక దళం ఆసక్తికరమైన విషయాలు
National

Indian Army Day 2025 : భారతదేశ సైనిక దళం ఆసక్తికరమైన విషయాలు

Indian Army Day 2025 : దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ తమ జీవితాలను అంకితం చేసిన భారత సైన్యంలోని వీర సైనికులను గౌరవించేందుకు భారతదేశం ఆర్మీ డేని ఏటా జ‌న‌వ‌రి 15న‌ ఘ‌నంగా జ‌ర‌పుకుంటుంది.ఈ రోజు 1949లో భారత సైనికుల గౌర‌వార్థం గ్రాండ్ కవాతులు, సైనిక ప్రదర్శనలు, జెండా ఆవిష్క‌ర‌ణ‌లు దేశమంతటా జరుగుతాయి, ప్రధాన కార్యక్రమం ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌ ( Cariappa Parade Ground)లో జరుగుతుంది. ఇక్కడ సైనికులు, అమరవీరుల ధైర్యం, భక్తికి గుర్తింపుగా శౌర్య ప‌త‌కాల‌ను ప్రదానం చేస్తారు. ఇండియన్ ఆర్మీ డే 2025 సందర్భంగా, దేశ సైనిక శక్తి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ గురించి ఆసక్తికరమైన విషయాలు భారత సైన్యం 1776లో కోల్‌కతాలో ఈస్టిండియా కంపెనీ (బ్రిటిష్ ప్రభుత్వం) ప్రభుత్వం కింద ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1.3 మిలియన్ల భారతీయ సైనికులు బ్రిటిష్ సైన్యం కో...
error: Content is protected !!