Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
“పార్టీ నీ ఒక్కడిదేనా?”: సీఎం రేవంత్‌పై నిప్పులు చెరుగుతూ కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాంరాం!
Hyderabad

“పార్టీ నీ ఒక్కడిదేనా?”: సీఎం రేవంత్‌పై నిప్పులు చెరుగుతూ కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాంరాం!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఆ పార్టీకి షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:  కాంగ్రెస్ కు 'జీవన్' మరణశాసనం: రేవంత్ రెడ్డిపై నిప్పులు! జగిత్యాల కేంద్రంగా సాగిన ఈ రాజకీయ పరిణామాల్లో జీవన్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అనుచరుల సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు.  ప్రధాన అభ్యంతరాలు & విమర్శలు: పార్టీ నీ ఒక్కడిదే అనుకుంటున్నవా?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జీవన్ రెడ్డి సంచలన వ్యా...
సంక్షోభంలో ‘అన్నపూర్ణ’ వెన్నెముక–రైస్ మిల్లర్ల ఆవేదన!
Fatafat_with_pr

సంక్షోభంలో ‘అన్నపూర్ణ’ వెన్నెముక–రైస్ మిల్లర్ల ఆవేదన!

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే రైస్ మిల్లింగ్ పరిశ్రమ నేడు కుప్పకూలే స్థితికి చేరుకుంది. అన్నదాత పండించిన ప్రతి గింజను బియ్యంగా మార్చి కోట్లాది మంది ఆకలి తీర్చే ఈ పరిశ్రమ, ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అశాస్త్రీయ నిబంధనలకు బలైపోతోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని '25 శాతం పెనాల్టీ' భూతం వెంటాడుతోంది. నిలువునా ముంచుతున్న పెనాల్టీలు: ఇది జరిమానా కాదు.. మరణశాసనం! ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక లోపాలు లేదా ఎఫ్.సి.ఐ (FCI) వద్ద జరిగే జాప్యం వల్ల సీఎంఆర్ (CMR) డెలివరీలో స్వల్ప జాప్యం జరిగితే, ప్రభుత్వం విధిస్తున్న 25 శాతం భారీ పెనాల్టీ మిల్లర్ల పాలిట ఉరితాడుగా మారుతోంది. 2014 నుండి పేరుకుపోయిన కోట్ల రూపాయల బకాయిలు ఒకవైపు, పెరిగిన బ్యాంకు వడ్డీలు మరోవైపు మిల్లర్లను ఆత్మహత్యల దిశగా నెడుతున్నాయి. ప్రభుత్వం నుండి మాకు రావాల్సిన బకాయిలు చె...
పీసీసీ చీఫ్ దౌత్యం విఫలం.. రేపు కీలక నిర్ణయం ప్రకటించనున్న సీనియర్ నేత జీవ‌న్‌రెడ్డి
State

పీసీసీ చీఫ్ దౌత్యం విఫలం.. రేపు కీలక నిర్ణయం ప్రకటించనున్న సీనియర్ నేత జీవ‌న్‌రెడ్డి

Jeevan Reddy Congress Resignation | కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పాటు విధేయుడిగా ఉన్న మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సాకేవత్, విప్ ఆది శ్రీనివాస్ జరిపిన చర్చలు ఫలించలేదు. పార్టీని వీడొద్దని వారు కోరినప్పటికీ, తన ఆవేదనకు పరిష్కారం లభించలేదని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. అధాష్టానాన్ని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూలబాట కాదని, ముళ్ల బాట అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాబట్టి సీఎం అయ్యారు, భట్టి విక్రమార్క సీఎల్పీ నేత కాబట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. నేను మండలిలో పక్ష నేతను కదా? మరి నాకెందుకు అన్యాయం చేశారు?" అని ఆయన సూటిగా ప్రశ...
కేసుల పరిష్కారానికి ‘రాజీ’యే రాజమార్గం: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
Crime

కేసుల పరిష్కారానికి ‘రాజీ’యే రాజమార్గం: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృథా చేసుకోకుండా.. పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కక్షిదారులకు సూచించారు. ఈ నెల 28వ తేదీ (శనివారం) నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాజీ పడదగిన ప్రధాన కేసులు: లోక్ అదాలత్ ద్వారా ఈ క్రింది వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చు: క్రిమినల్ కంపౌండబుల్: చిన్నపాటి నేరాలకు సంబంధించిన కేసులు. సివిల్ & ఆస్తి: సివిల్ తగాదాలు మరియు ఆస్తి పంపకాల వివాదాలు. కుటుంబ వివాదాలు: భార్యాభర్తల మధ్య గొడవలు, వైవాహిక సమస్యలు. ఆర్థిక లావాదేవీలు: చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ రికవరీ అంశాలు. ఇతరాలు: విద్యుత్ చౌర్యం వంటి వినియోగదారుల సమస్యలు. ముఖ్య విశేషాలు: త్వరితగతిన న్యాయం: లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారమైతే తక్షణమే తీర్పు లభిస్తుంది. కౌన్సిలి...
Chicken Price Hike | చికెన్​ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. వెలుగుచూస్తున్న కుళ్లిన మాంసం దందా!
State, Hyderabad

Chicken Price Hike | చికెన్​ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. వెలుగుచూస్తున్న కుళ్లిన మాంసం దందా!

హైదరాబాద్: భాగ్యనగరంలో మాంసాహార ప్రియులకు ఇప్పుడు రెట్టింపు కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకవైపు వేసవి తాపానికి చికెన్, మటన్ ధరలు (Chicken Price Hike) చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ (GHMC) మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. Chicken Price Hike : ఆకాశాన్నంటుతున్న ధరలు: చికెన్ @ 400! వేసవి కాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగడం వల్ల చికెన్ ధరలు ఒక్కసారిగా భారమయ్యాయి. వారం రోజుల క్రితం వరకు కిలో రూ. 300 నుండి రూ. 320 మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ. 400 మార్కును తాకింది. మటన్ ధరలు: నగరంలోని పలు ప్రాంతాల్లో కిలో మటన్ రూ. 940 నుండి రూ. 1000 వరకు విక్రయిస్తున్నారు. నాణ్యత లోపం: ధరలు పెరగడమే కాకుండా, నాణ్యత లేని మాంసం విక్రయ...
error: Content is protected !!