Kaleshwaram Case: హైకోర్టులో కేసీఆర్, హరీశ్రావు పిటిషన్లపై విచారణ
Kaleshwaram Case : హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు మధ్యంతర పిటిషన్లపై మంగళవారం విచారణ జరుగనుంది. కాళేశ్వరం విచారణను సీబీఐకి ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కేసీఆర్, హరీశ్ రావు కోరుతూ మధ్యంతర పిటిషన్ వేశారు.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తూ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ (BRS party) రాష్ట్రవ్యాప్తంగా నేడు , రేపు ధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నేతలు వివిధ రూపాల్లో నిరసన తెలపనున్నారు. ధర్నాలు, రాస్తారోకాలు, బైక్ ర్యాలీలు నిర్వహించడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమయ్యారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను స...




