Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
​పార్టీ మారుతున్నాననేది ‘పిచ్చి’ ప్రచారం: ఈటల రాజేందర్
Hyderabad

​పార్టీ మారుతున్నాననేది ‘పిచ్చి’ ప్రచారం: ఈటల రాజేందర్

తాను భారతీయ జనతా పార్టీని వీడి పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తనపై జరుగుతున్నది కేవలం "పిచ్చి ప్రచారం" అని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ​పార్టీ మారడం బట్టలు మార్చుకున్నంత సులభం కాదు ​నేను, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ పార్టీ మారుతున్నామన్న వార్తలు అవాస్తవమని ఈటల స్పష్టం చేశారు. "పార్టీ మారడం అంటే బట్టలు మార్చుకున్నంత సులభం కాదు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని నేను. పదవుల కోసం పద్దులు మోసే అలవాటు నాకు లేదు" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. సొంత పార్టీలోని కొందరు వ్యక్తులే ఇటువంటి దుష్ప్రచారానికి ఊతమిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ​ఆనాడు వినేవారే లేరు.. ​బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనను పార్టీ నుంచి బయటకు నెట్టి ఐదేళ్లు కా...
Corruption | అవినీతి అడ్డాగా రిజిస్ట్రేషన్ల శాఖ: ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. అగని ‘దందాలు’!
Special Stories

Corruption | అవినీతి అడ్డాగా రిజిస్ట్రేషన్ల శాఖ: ఏసీబీ కొరడా ఝుళిపిస్తున్నా.. అగని ‘దందాలు’!

​Registration Department Corruption | రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందో లేదో కానీ, కొంతమంది సబ్ రిజిస్ట్రార్ల జేబుల విలువ మాత్రం కోట్లలో పెరుగుతోంది. సామాన్యుడి సొంతింటి కలను పెట్టుబడిగా మార్చుకుంటూ, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ అధికారులు.. ఏసీబీ ఎన్నిసార్లు హెచ్చరించినా, అరెస్టులు చేసినా తమ పంథా మార్చుకోవడం లేదు. Corruption : ఏడాది కాలం.. 15 మంది అధికారులు! ​గడిచిన 12 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 మంది సబ్ రిజిస్ట్రార్లు మరికొంత మంది ఉద్యోగులు ఏసీబీ (ACB) వలలో చిక్కడం శాఖా పరంగా పెద్ద సంచలనంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ దాడుల్లో కోట్లాది రూపాయల నగదు, అక్రమ ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి.​"తప్పు చేస్తే శిక్ష తప్పదని ప్రభుత్వం చెప్తున్నా.. 'మా వెనుక పెద్దలున్నారు' అనే ధీమాతో కొందరు అధికారులు బరితెగిస్తున్నారు." గడిచిన 12 నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ జరిపిన ద...
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరిక
Crime

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరిక

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడానికి కారణమవుతున్న ఇటువంటి అమానవీయ చర్యలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. ​చట్ట ఉల్లంఘనలపై నిఘా: గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకోవడం, ఇతరులకు తెలియజేయడం లేదా ఆ సమాచారం ఆధారంగా గర్భస్రావం చేయించడం నేరమని, వీటిని అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ​స్కానింగ్ సెంటర్లు అప్రమత్తం: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని, నిబంధనల ప్రకారం రికార్డులను నిర్వహించాలని ఆదేశించారు. ​ప్రజల భాగస్వామ్యం: ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు తెల...
జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో వరంగల్ పీఆర్వో మోహన కృష్ణ మెరుపులు
Crime

జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో వరంగల్ పీఆర్వో మోహన కృష్ణ మెరుపులు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన 69వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్ (AIPDM) లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రతిభ చాటింది. కమిషనరేట్ పీఆర్వో విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మన్నవ మోహన కృష్ణ తన అద్భుతమైన ఫోటోగ్రఫీ నైపుణ్యంతో జాతీయ స్థాయిలో రాణించారు. ​మార్చి 29న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల పోలీస్ విభాగాలు పాల్గొన్నాయి. ఇందులో "ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ టీం" విభాగంలో మోహన కృష్ణ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి, తెలంగాణ పోలీస్ ఫోటోగ్రాఫర్స్ టీంను ద్వితీయ స్థానంలో నిలబెట్టారు.నాగ్‌పూర్ పోలీస్ శిక్షణ కేంద్రంలో జరిగిన ముగింపు వేడుకలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ​మోహన కృష్ణ తన టీం సభ్యులైన కోచ్ జయరాజ్, కానిస్టేబుల్ రాజశేఖర్‌లతో కలిసి కేంద్ర మంత్రి చేతుల మీదుగా రన్నరప్ ట్రోఫీని అందుకున్నారు.​"పోలీస...
Textile Hub | పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్
State

Textile Hub | పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్

Textile Hub | హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా జరిగిన ఆసియా టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ భవిష్యత్తుపై తన దార్శనికతను చాటారు. రాష్ట్రం కేవలం పారిశ్రామికంగానే కాకుండా, ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడేలా 'తెలంగాణ రైజింగ్ 2047' (Telangana Rising 2047) విజన్‌ను ఆయన ప్రకటించారు. పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తూనే, స్థానిక వస్త్ర రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తామని హామీ ఇచ్చారు. టెక్స్‌టైల్: మన డీఎన్ఏలోనే ఉంది! తెలంగాణకు, వస్త్ర రంగానికి ఉన్న చారిత్రక అనుబంధాన్ని సీఎం గుర్తు చేశారు. నిజాం కాలం నుండే హైదరాబాద్ ముత్యాలు, వస్త్రాలకు ప్రపంచ కేంద్రంగా ఉండేదని పేర్కొన్నారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీలు కేవలం వస్త్రాలు మాత్రమే కాదు, మన సంస్కృతికి ప్రతీకలని ఆయన కొనియాడారు. 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాల...
error: Content is protected !!