Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి
State

కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా Hyderabad :  తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు తమదే అధికారం అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా  (JP Nadda) అన్నారు.  దేశంలోని  విపక్ష పార్టీలన్నీ ఏకమైనా.. మూడోసారి కూడా ప్రజలు మోదీ(PM Modi)నే ప్రధానిగా ఆమోదించారని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని ఆయ‌న పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి మరో ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉందని సూచించారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో శనివారం జ‌రిగిన‌ బీజేపీ భారీ బహిరంగ సభలో జెపి.నడ్డా మాట్లాడుతూ..  ఆరు గ్యారెంటీలు, 66 అబద్ధాలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి అనే సంగతి తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఇతర పార్టీలు బలహీనపడితే కాంగ్రెస్‌ (Con...
ఈ విష‌యంలో Jio, Airtel కంటే వొడ‌ఫోన్ ఐడియానే బెట‌ర్ : తాజా నివేదిక‌
Business

ఈ విష‌యంలో Jio, Airtel కంటే వొడ‌ఫోన్ ఐడియానే బెట‌ర్ : తాజా నివేదిక‌

Vodafone Idea | భారతదేశంలోని మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వొడాఫోన్ ఐడియా ఇటీవలి కాలంలో వినియోగదారులను కోల్పోతూ వ‌స్తోంది. ప్రతి నెలా, వందల వేల మంది కస్టమర్‌లు విడిచివెళ్లిపోతున్నారు. తక్కువ నెట్‌వర్క్ కవరేజ్, కనెక్టివిటీ సమస్యల కారణంగా తరచుగా ఇతర ప్రొవైడర్‌లకు మారుతున్నారు. మ‌రోవైపు టారీఫ్ ప్లాన్ల ధ‌ర‌లు పెంచ‌డంతో వినియోగ‌దారులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, వినియోగదారులకు ఊరట కలిగించేలా వొడఫోన్ ఐడియా ఓ గుడ్ న్యూస్ చెప్పంది. ఈ టెలికాం కంపెనీ ఇటీవల తన నెట్‌వర్క్ కవరేజీని మెరుగుపరిచింది. ఈ విషయంలో Jio Airtel రెండింటినీ అధిగమించింది. Vi 4G కవరేజ్ 4G నెట్‌వర్క్ నాణ్యత పరంగా, వోడాఫోన్ ఐడియా తమ వినియోగదారులకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ప్రతి గంటకు 100 మొబైల్ టవర్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఓపెన్ సిగ్నల్ ఇటీవలి నివేదిక ప్రకారం, 4G కవరేజ్ విషయానికి వస్తే, Vodafone ...
KTR | లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేవ‌ర‌కు పోరాటం
State

KTR | లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేవ‌ర‌కు పోరాటం

Hyderabad | లగచర్ల (Lagacharla) భూసేకరణ బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భ‌రోసా ఇచ్చారు. భూసేక‌ర‌ణ ర‌ద్దు చేసేవ‌ర‌కు పోరాటం ఆప‌బోమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈమేర‌కు శ‌నివారం ల‌గ‌చ‌ర్ల బాధితులు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోరాటంలో బాధితుల‌కు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వేధింపులను ఇప్ప‌టికైనా మానుకొని బాధితుల డిమాండ్లను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యే వ‌ర‌కూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంద‌ని కేటీఆర్ వారితో అన్నారు. గిరిజన భూసేకరణ బాధితులపై రేవంత్ (CM Revanth Reddy) ప్ర‌భుత్వం అన్యాయంగా పెట్టిన కేసులను భేషరతుగా ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. పోలీసుల ద్వారా ల‌గ‌చ‌ర్ల‌ బాధితుల‌ను వేధించడం నిలి...
Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
Business

Gold and Silver Rates Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold and Silver Rates Today : దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధ‌ర‌ల్లో త‌ర‌చూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిన్న వీటి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెర‌గ‌గా, ఈరోజు మాత్రం తగ్గుముఖం ప‌డ్టాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గగా, కిలో వెండి రేటు కూడా రూ.200 త‌గ్గింది. నేటి ధరలు ఇవే.. శ‌నివారం డిసెంబర్ 7న ఉదయం 6.25 గంటల వ‌ర‌కు హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,610 కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్త‌డి ధ‌ర రూ. 71,140 ప‌లికింది. మరోవైపు దిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 760కి ప‌ల‌క‌గా, 22 క్యారెట్ల బంగారం రేట్ 10 గ్రాములకు రూ. 71,290కి చేరింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రా) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్) ఢిల్లీలో ర...
డాక్ట‌ర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ  వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
State

డాక్ట‌ర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

Hyderabad : డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్  ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) వీసీగా ఘంటా చక్రపాణి (Ghanta chakrapani )ని నియమిస్తూ  ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నలబై ఏళ్లలో సామాజిక, తెలంగాణ రాజకీయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన కెరీర్ ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్రం ఆచార్యులుగా చేరారు. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో  ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమిస్తూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కాగా చక్రపాణి ఈ పదవీలో ముడేళ్లపాటు కొనసాగుతారు. కాగా ఘంటా చక్రపాణి స్వస్థలం కరీంనగర్.  ఆయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ (బైపిసి ) పూర్తి చేశ...
error: Content is protected !!