Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Toll charges | ప్రయాణికులకు శుభవార్త:  వంతెనలు, సొరంగాలు, ఎలివేటెడ్ రోడ్లపై కేంద్రం సంచలన నిర్ణయం
National

Toll charges | ప్రయాణికులకు శుభవార్త: వంతెనలు, సొరంగాలు, ఎలివేటెడ్ రోడ్లపై కేంద్రం సంచలన నిర్ణయం

టోల్ ఛార్జీలు (Toll charges) 50% తగ్గింపు New Delhi : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొరంగాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలు ఉన్న రహదారి సెక్షన్‌లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ చర్యతో వాహదారుల ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిపోనున్నాయి. ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ రోడ్లు, సొరంగాలు, వంతెనలు వంటి నిర్మాణాలు కలిగిన జాతీయ రహదారుల్లో ప్రభుత్వం టోల్ రేట్లను 50 శాతం వరకు తగ్గించింది. జాతీయ రహదారి రుసుము నియమాలు, 2008 ప్రకారం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వినియోగదారు రుసుములు వసూలు చేస్తున్నవిషయం తెలిసిందే.. 2008లో అమలులోకి వచ్చిన నేషనల్ హైవే టోల్ నియమాలను సవరించిన మంత్రిత్వ శాఖ, కొత్త లెక్కింపు పద్ధతిని తాజా నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇందులో పేర్...
Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు
Hyderabad, State

Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు

Hyderabad | ప్రజాభవన్‌లో శ‌నివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 151 మండల మహిళా సంఘాల బస్సు యజమానులకు రూ.1.05 కోట్ల చెక్కులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హాల‌క్ష్మి ఉచిత బ‌స్సు ( Free Bus scheme) ప‌థ‌కంపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లే దిశగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన "మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం" విజయవంతమవుతోంద‌న్నారు. అంతకుముందు మహిళా రచయితలు, కవులు రచించిన "మహా లక్ష్మి – మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు" అనే పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళల ప్రయాణ అనుభవాలను కవిత్వం రూపంలో చదివి వినిపించారు. ఈసంద‌ర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ “ఒక్క చేతి గుర్తు చూపితే చాలు.. బస్సు ముంగిట నిలుస్తుంది.ఇది మహిళలకు సమానత్వం మీద ముందడుగు.” అని అన్నారు. ఇప్పటివరకు ప్రభ...
Road Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం, వ‌రుడితో స‌హా ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం
Crime

Road Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం, వ‌రుడితో స‌హా ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం

సంభాల్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) జరిగింది. జెవానై గ్రామంలో పెండ్లి బృందంతో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఓ కళాశాల గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు (24) సహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన స‌మీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులందరిని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెవానై కమ్యూనిటీ ఆరోగ్య‌కేంద్రానికి తరలించారు. ప్రధాని మోదీ సంతాపం కాగా, సంభాల్‌ (Sambhal)లో వరుడితో పాటు ఎనిమిది మంది మరణించిన ప్రమాదం (Road Accident)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని ఎక్స్ (x) లో పేర్కొన్నారు. మృతుల కు...
ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
Crime, Adilabad

ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు శుక్ర‌వారం ఆకస్మిక దాడులు నిర్వహించారు కోటిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు దాడులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ రైతు వ‌ద్ద నుంచి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ ఆకిరెడ్డి నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవల ఏసీబీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. .. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2025 జూన్ లో 31 కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టింది. వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కేసులు, మూడు నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, నాలుగు సాధారణ విచారణలు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయని ఏసీబీ వెల్ల‌డించింది. ఈమేర‌కు జనవరి నుంచి జూన్ వరకు తన అర్ధ వార్షిక రౌండ్ అప్‌లో ప్ర‌క‌టించింది. ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్...
Illegal colleges | డీఐఈవో చేతులెత్తేసినట్లేనా?
Special Stories

Illegal colleges | డీఐఈవో చేతులెత్తేసినట్లేనా?

రెజోనెన్సు పలుకుబడి కి తలొగ్గిన అధికారి? అనుమతి లేని వేదాంతుకు సపోర్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఎలా స్పందిస్తారో.. హన్మకొండ నగరం (Hanamkonda) లో ఒకరేమో అకాడమీ పేరుతో అనుమతి లేకుండా జూనియర్ కళాశాల (Illegal colleges) నడిపిస్తుంటే, మరొకరు అనుమతికి మించి అదనంగా మరో 5 బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు కాలేజీల బాగోతంపై వరుస కథనాలు వెలువరించినప్పటికీ సంబంధిత అధికారి మాత్రం ఇంటర్మీడియట్ బోర్డుకు రిపోర్ట్ రాసి పంపిస్తామని చేతులు దులుపుకుని చూస్తున్నారు. ఇక్కడ అసలు రహస్యం ఏమిటంటే రెజోనెన్సు యాజమాన్యంతో పాటు వేదాంతు యాజమాన్యం సదరు అధికారిని ప్రసన్నం చేసుకోవడం వల్లే డీఐఈవో ఈ రెండు కాలేజీలను సీజ్ చేయకుండా ఇంటర్మీడియట్ బోర్డుకు రిపోర్ట్ రాస్తామని మాయమాటలు చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డీఐఈఓ వింత సమాధానం… హన్మకొండ నగరంలో అనుమతి లేకుండా నడుస్తున్న రెజోనెన్సు కాలేజీలు, అకాడ...
error: Content is protected !!