Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!
Hyderabad

Vande Bharat Express | తెలుగు రాష్ట్రాల నుంచి మరో వందేభారత్ – రూట్, షెడ్యూల్ ఇదే..!

Vande Bharat Express | తెలంగాణ, ఏపీలో వందేభారత్ రైళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే సేవ‌లందిస్తున్న వందేభారత్ రైళ్ల‌లో దాదాపు అన్నీ ఫుల్‌ ఆక్యుపెన్సీని న‌మోదు చేశాయి. దీంతో.. కీల‌క‌మైన‌ మార్గాల్లో వందేభారత్ కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ప్రధాన రైళ్లల్లో వెయిటింగ్ లిస్టు ఉండడంతో ఆయా మార్గాల్లో వందేభారత్ ట్రైన్స్‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే భావిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రయాణీకులు సుదీర్ఘ కాలం వేచి చూస్తున్న విధంగా మరో ప్రధాన మార్గం లో కొత్తగా వందేభారత్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను న‌డిపించ‌నున్నారు. కొత్త‌గా ఈ మార్గంలోనే.. కొత్తగా పూణే న‌గ‌రం నుంచి నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. వీటిని బెలగావి, షెగోన్, వడోదర, సికింద్రాబాద్ కు కేటాయించాలని నిర్ణయించారు. సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య ప్రస్తుతం వందేభ...
Indian Railway | ఈ ఏడు రైల్వే స్టేషన్లలో భ‌ద్ర‌త కోసం స‌రికొత్త‌ AI టెక్నాల‌జీ వ్య‌వ‌స్థ..
Technology

Indian Railway | ఈ ఏడు రైల్వే స్టేషన్లలో భ‌ద్ర‌త కోసం స‌రికొత్త‌ AI టెక్నాల‌జీ వ్య‌వ‌స్థ..

Indian Railway | దేశంలోని ప్ర‌ధాన‌మైన ఏడు రైల్వేస్టేష‌న్ల‌లో ఇండియ‌న్ రైల్వే (Indian Railway) అత్యాధునిక ఏఐ ఆధారిత సెక్యూరిటీ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తోంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌తో సహా ఏడు ప్రధాన రైల్వే స్టేషన్‌లు ప్రయాణీకుల భద్రతను పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫేసియ‌ల్ రిక‌గ్నీష‌న్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడు రైల్వే స్టేషన్లు AI-ఆధారిత ముఖ గుర్తింపు నిఘా వ్యవస్థలను ప్రవేశపెడతాయి, ఇది సాంకేతికత సహాయంతో ప్రజల‌ భద్రతను ఆధునీకరించడానికి మెరుగుపరుస్తోంది. టికెట్ తనిఖీ, బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ AI సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చు, ప్రయాణీకుల పొడవైన క్యూలు లేకుండా చేయ‌వ‌చ్చు. రైల్వే స్టేషన్లను స్మార్ట్ స్టేషన్లుగా మార్చే ప్రణాళిక కింద ఈ కొత్త సాంకేతికత అమలు చేస్తోంది. దీనితోపాటు భద్రత, న...
Fire Accident | హైదరాబాద్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
Crime

Fire Accident | హైదరాబాద్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ దుండిగల్ తండాలోని రాంకీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident ) చోటుచేసుకుంది. కెమికల్ రియాక్షన్ కారణంగా ద‌ట్టమైన పొగ‌లు చిమ్ముకుటూ మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలను చూసి సమీప తండాల్లో ఉంటున్న ప్రజలు భయాందోళ‌తో ప్రాణాల‌ను అర‌చేతిలోపెట్టుకొని పరుగులు తీశారు. ప్రమాదం సంభవించిన సమయంలో కంపెనీలో ఎంతమంది కార్మికులు ఉన్నారు? వారి పరిస్థితి ఏమిటన్నది తెలియక కుటుంబసభ్యులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు....
TGSRTC | నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో సంబరాలు..
State

TGSRTC | నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో సంబరాలు..

Hyderabad : టీజీ ఆర్టీసీ (TGSRTC )లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi sheme ) విజయవంతంగా అమలవుతుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు రూ.6700 కోట్ల విలువైన ప్రయాణాలు చేశారని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల  రియంబర్స్మెంట్ చెల్లించిందని చెప్పారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మహాలక్ష్మి పథకం విజయవంతంలో భాగస్వాములైన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు,అధికారులు, ఇతర సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. TGSRTC సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి ఆర్టీసీ (TS RTC)లో 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపోలు, 341 బస్ స్టేషన్ నేడు జరిగే కార్యక్రమాలు బస్ స్టేషన్...
Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు..
State, Hyderabad

Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు..

South Central Railway | వచ్చే ఆగస్టు నెలలో ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని కీలక మార్గాల్లో 38 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్–తిరుపతి, రిటర్న్ సర్వీసులు రైలు నంబర్ 07009 జూలై 31 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07010 ఆగస్టు 1 నుంచి 29 వరకు శుక్రవారం తిరుపతి నుండి సికింద్రాబాద్‌కు నడుస్తుంది. కాచిగూడ–నాగర్​సోల్​ స్పెషల్ ట్రైన్​ నంబర్ 07055 ఆగస్టు 7, 28 మధ్య గురువారం కాచిగూడ నుంచి నాగర్సోల్‌కు బయలుదేరుతుంది. రైలు నంబర్ 07056 ఆగస్టు 8 నుండి 29 వరకు శుక్రవారం నాగర్సోల్ నుండి కాచిగూడకు తిరిగి వస్తుంది. నాందేడ్-తిరుపతి వారాంతపు రైళ్లు రైలు నంబర్ 07015 ఆగస్టు 2 నుండి ఆగస్టు 30 వరకు నాందేడ్ నుండి తిరుపతికి ప్రతి శనివ...
error: Content is protected !!