Adhar Cards | 1.17 కోట్ల ఆధార్ నంబర్లు బ్లాక్ ! UIDAI ఏం చెప్పింది?
UIDAI | దేశంలో ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని నిరోధించడానికి కేంద్రం కీలక అడుగు వేసింది. UIDAI (భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ) ఇప్పటివరకు 1.17 కోట్ల ఆధార్ నంబర్లను బ్లాక్ చేసింది. ఈ ఆధార్ నంబర్లన్నీ మరణించిన వ్యక్తులకు చెందినవి.
ఈ చర్య ఎందుకు తీసుకున్నారు..?
చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని UIDAI చెబుతోంది. వాటి ద్వారా ఎలాంటి మోసం, స్కామ్ జరగవచ్చు. దీనిని నివారించడానికి, చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు తెలిపింది.
ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు చురుకైన పాత్ర పోషించాలని UIDAI కోరింది. ఇప్పుడు ప్రభుత్వం ఒక వ్యక్తి మరణించిన వెంటనే అతని ఆధార్ నంబర్ను రద్దు చేయాలని కోరుకుంటోంది. దీని కోసం, మరణ ధృవీకరణ పత్రం జారీ చేసేటప్పుడు దానిని ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి చేస్తున్నారు.
దుర్వినియోగాన్ని ఎలా న...




