Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు!
State

Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు!

VIP Break Darshan : తిరులమ వేంకటేశ్వరస్వామి భక్తులకు (TTD Devotees) టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల (Tirumala)లో 15వ తేదీ గురువారం నుంచి వీఐపీ సిఫార్సు లేఖలపై (VIP recommendation letters) బ్రేక్ దర్శనాలు పునఃప్రారంభమవుతాయని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాగా ఇటీవల తిరుమలలో భక్తుల కోలాహలం తగ్గడంతో టీటీడీ మళ్లీ సిఫార్సు లేఖలను స్వీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవుల్లో రద్దీ కారణంగా సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డ...
Operation Keller | సింధూర్ తర్వాత ఆపరేషన్ కెల్లర్ ను ప్రారంభించిన భారత ఆర్మీ
National

Operation Keller | సింధూర్ తర్వాత ఆపరేషన్ కెల్లర్ ను ప్రారంభించిన భారత ఆర్మీ

Operation Keller | కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని కెల్లర్ దట్టమైన అటవీ ప్రాంతంలో మంగళవారం, మే 13, 2025న భారత సైన్యం (Indian Armed Forces) ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించింది. షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులకు సంబంధించిన పక్కా సమాచారం రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కు అందింది. దీంతో వెంటనే 'ఆపరేషన్ కెల్లర్'గా కోడ్ నేమ్ తో సైనిక చర్యను ప్రారంభించిది. సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో పోస్ట్ చేయబడిన అధికారిక ఆర్మీ ప్రకటన ప్రకారం, “ఆపరేషన్ కెల్లర్ (Operation Keller) . మే 13, 2025న, #షోపియన్‌లోని షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు రాష్ట్రీయ రైఫిల్స్ (Rashtriya Rifles) యూనిట్ ఇచ్చిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, #ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు భారీ కాల్పులు జరిపారు. దీని ఫలితంగా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కొనసా...
IMD Report | ఈసారి సాధార‌ణం కంటే అధిక‌ వ‌ర్ష‌పాతం
Districts

IMD Report | ఈసారి సాధార‌ణం కంటే అధిక‌ వ‌ర్ష‌పాతం

IMD Report | తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త తెలిపింది. ఈసారి కాస్త ముందస్తుగానే వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు అండ‌మాన్‌లోకి ప్రవేశించినట్లు మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్‌ ‌సముద్రం, నికోబార్‌ ‌దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్‌ ‌దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా, రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు రుతుప‌వ‌నాలు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ (IMD ) వెల్లడించింది. మే 27వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవ‌కాశం ఉం‌దని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. IMD Report : జూన్ 12 నాటికి తెలంగాణకు రుతుపవనాలు కాగా, సాధారణంగా జూన్‌ 1‌వ తేదీ నాటికి ...
LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరోసారి పొడిగింపు
State, Hyderabad

LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరోసారి పొడిగింపు

LRS Concession | లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ సీమ్‌ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును రాష్ట్ర స‌ర్కారు మ‌రోసారి పొడిగించింది. ఈనెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్‌ఆర్‌ఎస్‌పై రాయితీ గడువును తొలుత మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత దీనిని ఏప్రిల్‌ 30 వరకు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు మరోసారి మే 31వర‌కు రాయితీ అవ‌కాశం క‌ల్పించింది. కాగా ఎల్ఆర్ ఎస్ రాయితీ (LRS concession) పొడిగింపునకు ప‌లు కార‌ణాలు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో రాయితీ గడువును ప‌లుమార్లు పొడిగిస్తున్నట్టు ప‌లువురు పేర్కొంటున్నారు. 2020లో ప్రారంభమైన లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం కింద 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించ...
PM Modi | పిచ్చి వేషాలు వేస్తే నామరూపాల్లేకుండా చేస్తాం..
National

PM Modi | పిచ్చి వేషాలు వేస్తే నామరూపాల్లేకుండా చేస్తాం..

పాకిస్తాన్‌తో చ‌ర్చ‌లు అంటే పీవోకే, ఉగ్ర‌వాదంపైనే PM Modi | పాకిస్తాన్‌ ‌కాచుకో.. ఇకపై ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నామరూపాల్లేకుండా చేస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆపరేషన్‌ ‌సింధూర్‌ను తాత్కాలికంగానే పక్కన పెట్టామని, ఇంకా పూర్తిగా ఆపేయలేదని, ఎలాంటి టెర్రర్‌ అటాక్‌ ‌జరిగినా ఇక దానిని యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌ద్వారా పాక్‌ ‌భూభాగంలో టెర్రరిస్ట్ ‌క్యాంపులను ధ్వంసం చేశామని ప్రకటించారు. అలాగే మన సత్తా ఏమిటో ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్థాన్‌కు చాటాని తెలిపారు. ఈ క్రమంలో భారత సైనిక దళాలకు పీఎం మోదీ సెల్యూట్‌ ‌చేశారు. పాక్‌తో చర్చలంటూ జరిగితే… టెర్రరిజం, ఆక్రమిత కాశ్మీర్‌పైనే ఉంటుందని మరోమారు స్పష్టం చేశారు. ఇందులో మూడో వ్యక్తి జోక్యాన్ని కూడా సహించబోమని తేల్చి చెప్పారు. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌తర్వాత ప్రధాని మోదీ (PM Modi ) సో...
error: Content is protected !!