Sarkar Live

Author: Reported by Virat Avunuri

వివ‌రాట్ ఆవునూరి.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
Mamnoor Airport | మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీల‌క ప‌రిణామం..
State, warangal

Mamnoor Airport | మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కీల‌క ప‌రిణామం..

Warangal Mamnoor Airport | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమానంగా, ఆధునిక సదుపాయాలతో వరంగల్ సమీపంలోని మామునూర్ వద్ద కొత్త‌ విమానాశ్రయ నిర్మాణం (Mamnoor Airport) జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం తాజాగా రూ.90 కోట్ల నిధుల‌ను అదనంగా మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లుచ‌ భవనాల (విమానాశ్రయాలు) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు న‌ష్ట‌పరిహారం గతంలోనే ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి కొత్తగా విడుదలైన నిధులతో కలిపి భూసేకరణ కోసం మొత్తం 295 కోట్లను కేటాయింట్లు అయింది. భూములను కోల్పోతున్న రైతులు, యజమానులకు నష్టపరిహారం చెల్లించడానికి ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి ఈ నిధులు బదిలీ చేయనున్నట్టు తెలుస్...
Diwali Celebration | పర్యావరణహిత దీపావళి కోసం గ్రీన్ క్రాకర్స్‌ — మీ చిన్న నిర్ణయం.. పెద్ద మార్పు!
LifeStyle

Diwali Celebration | పర్యావరణహిత దీపావళి కోసం గ్రీన్ క్రాకర్స్‌ — మీ చిన్న నిర్ణయం.. పెద్ద మార్పు!

Diwali Celebration 2025 -Eco-friendly Fireworks | దీపావళి సందర్భంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా గ్రీన్ క్రాక‌ర్స్‌ (Green Crackers) అమ్మకాలు, వినియోగానికి సంబంధించి గ‌త బుధవారం అనుమతిచ్చిన విష‌యం తెలిసిందే.. దేశ రాజధాని అంతటా ప్రజలు అక్టోబర్ 18 నుండి 21 వరకు ఈ బాణసంచా కాల్చవచ్చు. అంతేకాకుండా, అక్టోబర్ 18 నుండి వాయు నాణ్యత సూచికను పర్యవేక్షించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఎన్‌సిఆర్‌లోని రాష్ట్ర పిసిబిలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ చర్యపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా హ‌ర్షం వ్యక్తం చేశారు మరియు ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. Diwali Celebration : అస‌లు గ్రీన్ క్రాకర్స్ అంటే ఏమిటి? గ్రీన్ క్రాకర్స్ అనేవి సంప్రదాయ బాణసంచాకు పర్యావరణప‌రంగా అనుకూలమైన ప్రత్యామ్నాయాలు. ఇవి వాయు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి ప...
HAM roads | హ్యామ్‌ రోడ్లకు నేడు టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల!
State

HAM roads | హ్యామ్‌ రోడ్లకు నేడు టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల!

Hyderabad : రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌ (హ్యామ్‌) ప్రాజెక్ట్‌ను అమలు చేస్తూ గ్రామీణ రహదారుల అభివృద్ధికి సిద్ద‌మైంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, దాంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంత్రి సీత‌క్క ప్ర‌కారం.. హ్యామ్‌ ప్రాజెక్టుల (HAM roads) కోసం టెండర్‌ నోటిఫికేషన్ శుక్ర‌వారం విడుదల చేయ‌నున్నారు. మొదటి దశలో 7,449.50 కిలోమీటర్ల పొడవుతో 2,162 రహదారులు నిర్మించనున్నట్లు మంత్రి సీత‌క్క‌ వెల్లడించారు. ఇవి మొత్తం 96 నియోజకవర్గాల పరిధిలో 17 ప్యాకేజీల కింద చేపట్టనున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ – “హ్యామ్‌ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ గ్రామీణ రహదారులు కొత్త దశలోకి ప్రవేశిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ రహదారి సంస్థలు ఈ టెండర్లలో పాల్గొనాలని కోరుతున్నాం” అని తెలిప...
Suicide | ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
Crime, State

Suicide | ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

హైదరాబాద్‌ ‌బాలానగర్‌ ‌(Balanagar) ప్రాంతంలో విషాదక‌ర‌ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, ఆ తర్వాత భవనంపై నుంచి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మృతురాలిని చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు. ఆమె భర్త అనిల్‌ ‌కుమార్‌ ‌తో కలిసి పద్మారావు నగర్‌ ‌ఫేజ్‌-1, ‌బాలానగర్‌ ‌లో నివాసముంటోంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు చేతన్‌ ‌కార్తికేయ, లాస్యతవల్లి ఉన్నారు. అయితే స్థానికుల క‌థ‌నం మేర‌కు కొంతకాలంగా భర్తతో విభేదాలు, వ్యక్తిగత సమస్యల కార‌ణంగా తీవ్ర మనస్థాపానికి గురైన సాయిలక్ష్మీ, క్ష‌ణికావేశంతో తన ఇద్దరు పిల్లలను చంపి అనంతరం భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మ‌రో ఘ‌ట‌న‌లోకొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణీ మండలంలోని గంభీరావుపేట గ్రామానికి చెందిన సైదం కల్పన(...
Jharkhand : బెంగాల్‌ తరహాలో జార్ఖండ్‌లో ఘోర ఘటన – 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌
Crime

Jharkhand : బెంగాల్‌ తరహాలో జార్ఖండ్‌లో ఘోర ఘటన – 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్‌

ఐదుగురు దుండగులను అరెస్ట్ ‌చేసిన పోలీసులు Jharkhand : అమ్మాయిలపై నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ ‌లో ఓ వైద్య విద్యార్థినిపై గ్యాంగ్‌ ‌రేప్‌ ‌జరిగింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా జార్ఖండ్‌ ‌లో అదే తరహా ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జార్ఘండ్‌ ‌రాజధాని రాంచీలోని రతు ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక తన కుటుంబంతో నివాసముంటోంది. ఉంటుంది. అయితే ఆదివారం ఆ బాలికపై కామాంధులు కాటేశారు. రాత్రి సమయంలో 9 మంది వ్యక్తులు ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. సోమవారం పలు ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించామని పోలీస్‌ ‌సూపరింటెండెంట్‌ ‌ప్రవీణ్‌ ‌పుష్కర్‌ ‌తెలిపారు. మిగిలిన నలుగురు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్...
error: Content is protected !!