మావోయిస్టుల సంచలన ప్రకటన – Maoist Surrender Announcement
ఆయుధాలు వీడి ప్రధాన స్రవంతిలోకి – షరతులు వెల్లడి
Maoist Surrender Announcement : సీపీఐ (మావోయిస్ట్)కు చెందిన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ (MMCSZC) ఒక కీలక ప్రకటన చేసింది. ఈ జోన్ పరిధిలోని మావోయిస్టు కార్యకర్తలు అందరూ జనవరి 1, 2026న ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరనున్నట్లు ఎంఎంసీఎస్జెడ్సీ అధికార ప్రతినిధి అనంత్ వెల్లడించారు.ఈమేరకు ఆయన తాజాగా ఒక లేఖను విడుదల చేయడంతో పాటు, మీడియాకు ఆడియో క్లిప్లను విడుదల చేశారు.ప్రభుత్వాలకు లేఖ, నిర్ణయానికి సమయం గతంలో (నవంబర్ 22న) అనంత్… మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మకు లేఖ రాశారు. ఏకాభిప్రాయానికి రావడానికి ఫిబ్రవరి 15, 2026 వరకు సమయం ఇవ్వాలని ఆ లేఖలో అభ్యర్థించిన విషయం తెలిసిందే.
అయితే, హోంమంత్రి విజయ్ శర్మ ర...




