Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
Property Tax | హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్
State, Hyderabad

Property Tax | హైదరాబాద్‌వాసులకు జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్

ఆస్తి పన్ను (Property Tax) వడ్డీపై 90 శాతం రాయితీ! హైదరాబాద్, డిసెంబర్ 22: చాలా కాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న భాగ్యనగర వాసులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు జీహెచ్‌ఎంసీ (GHMC) తీపి కబురు అందించాయి. బకాయిలపై పేరుకుపోయిన వడ్డీ భారాన్ని తగ్గించేందుకు 'వన్‌ టైమ్‌ సెటిల్మెంట్' పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ కింద పాత బకాయిలపై ఉన్న వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం ముఖ్యాంశాలు:90% వడ్డీ మాఫీ: పన్ను చెల్లింపుదారులు తమ అసలు పన్ను మొత్తంతో పాటు, దానిపై ఉన్న వడ్డీలో కేవలం 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 90 శాతం వడ్డీని కార్పొరేషన్ పూర్తిగా రద్దు చేస్తుంది. ఎవరికి వర్తిస్తుంది?: ఈ రాయితీ కేవలం ప్రైవేట్ వ్యక్తులకే కాకుండా, ప్రభుత్వ ఆస్తులకు కూడా వర్తిస్తుంది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ పరిధితో పాటు, ఇటీవల గ్రేటర్‌లో విలీనమైన 20 మున్సిపాలిటీలు,...
Lionel Messi  | హైదరాబాద్​లో మెస్సీ మేనియా… సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విజయం, మనవడితో మెస్సీ ఫుట్‌బాల్
Hyderabad, Sports

Lionel Messi | హైదరాబాద్​లో మెస్సీ మేనియా… సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విజయం, మనవడితో మెస్సీ ఫుట్‌బాల్

హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) 'గోట్ ఇండియా టూర్ 2025'లో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన పర్యటన సందర్భంగా ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆద్యంతం ఆనంద క్షణాలతో సాగింది. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మెస్సీ, భారీ బందోబస్తు మధ్య నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లారు .ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మెస్సీకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన 'మీట్-అండ్-గ్రీట్' కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఉప్పల్‌లో రేవంత్ సింగరేణి టీమ్‌ విజయంమీట్-అండ్-గ్రీట్ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధ...
Road Accident | ఘోర బస్సు ప్రమాదం.. చింతూరు ఘాట్‌లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది మృతి
Crime, AndhraPradesh

Road Accident | ఘోర బస్సు ప్రమాదం.. చింతూరు ఘాట్‌లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది మృతి

Alluri Sitarama Raju Road Accident | అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజుగారిమెట్టు వద్ద ప్రమాదం ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తోంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారిమెట్టు మలుపు వద్దకు రాగానే, బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 37 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులుగా గుర్తించారు. బస్సు కూడా చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్టు సమాచారం. ప్రమాద తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలం వద్ద ...
ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం: దేశవ్యాప్తంగా 400+ విమానాలు రద్దు.. – Indigo Flight Cancellation
National

ఇండిగో విమాన సేవలకు తీవ్ర అంతరాయం: దేశవ్యాప్తంగా 400+ విమానాలు రద్దు.. – Indigo Flight Cancellation

హైదరాబాద్‌లోనూ కొనసాగుతున్న గందరగోళం Indigo Flight Cancellation | న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన కార్యకలాపాలు వరుసగా రెండో రోజు తీవ్ర అంతరాయానికి గురయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలలో 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక్క‌సారిగా త‌లెత్తిన ఈ అంతరాయం కారణంగా వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన విమానాశ్రయాలలో రద్దుల సంఖ్య: ఢిల్లీ విమానాశ్రయం: 220కు పైగా విమానాలు రద్దు. బెంగళూరు విమానాశ్రయం: 100కు పైగా విమానాలు రద్దు. హైదరాబాద్ (RGIA): మొత్తం మీద 90కి పైగా విమానాలు హైదరాబాద్‌లో గందరగోళం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో గురు, శుక్ర‌వారాల్లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయ అధిక...
Food Poisoning  | హాస్ట‌ల్‌లో మారోమారు ఫుడ్ పాయిజన్ కలకలం: పురుగుల ఉప్మా తిని 13 మంది విద్యార్థులు అస్వస్థత..
Crime

Food Poisoning | హాస్ట‌ల్‌లో మారోమారు ఫుడ్ పాయిజన్ కలకలం: పురుగుల ఉప్మా తిని 13 మంది విద్యార్థులు అస్వస్థత..

Food Poisoning | గద్వాల: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో వ‌రుస‌గా ఫుడ్‌పాయిజ‌న్ కేసులు తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా గద్వాల జిల్లాలో ఈరోజు ఉద‌యం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గద్వాలలోని ఎస్టీ హాస్టల్‌లో కలుషిత ఆహారం తినడం వల్ల 13 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ద‌వాహాన‌కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వసతి గృహంలో మొత్తం 120 మంది విద్యార్థులు ఉంటున్నారు. పురుగులు ఉన్నాయని చెప్పినా నిర్లక్ష్యం! ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలపై విద్యార్థులు సంచలన విషయాలు మీడియాకు వెల్లడించారు. ఉదయం వండిన ఉప్మాలో పురుగులు ఉన్నట్లు తాము గుర్తించి, వెంటనే హాస్టల్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు పేర్కొన్నారు. అయితే వారు ఆ ఆహారాన్ని పారబోసినప్పటికీ, అంతకుముందు దాన్ని తిన్నవారే అస్వస్థతకు గురయ్యారని తెలిపార...
error: Content is protected !!