Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
Visakhapatnam | తాటిచెట్ల‌పాలెం బాలిక మృతి కేసులో ఇంకా వీడని మిస్ట‌రీ
Crime

Visakhapatnam | తాటిచెట్ల‌పాలెం బాలిక మృతి కేసులో ఇంకా వీడని మిస్ట‌రీ

Visakhapatnam | విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెంలో ఇటీవ‌ల జరిగిన ఘటన స్థానికులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఒక మైనర్ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి కాలువలో పడేసిన విష‌యం తెలిసిందే.. కాలువలో అనుమానాస్పదంగా శరీర భాగాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని భాగాలను సేకరించి, విశాఖ కేజీహెచ్ ల్యాబ్‌కు పంపించారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, 24 గంటలు గడిచినా గుర్తించేలా ఏ ఆధారమూ లభించలేదు. ముఖ్యంగా బాలిక తల భాగం ఇప్పటికీ కనబడకపోవడం విచారణను మరింత క్లిష్టంగా మార్చింది. తాటిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ఇటీవల ప్రసవించిన మహిళల వివరాలను ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సేకరిస్తున్నారు.పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు:అక్రమ సంబంధం నేపథ్యంలో పుట్టిన శిశ...
Jadcherla | కెమిక‌ల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు
State

Jadcherla | కెమిక‌ల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు

Mahabubnagar accident : కొన్నాళ్లుగా రోడ్డు ప్ర‌మాదాలు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. తాజాగా జడ్చర్ల (Jadcherla) సమీపంలోని మాచారం ఫ్లైఓవర్‌పై గురువారం ఉదయం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రసాయనంతో వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది, అదృష్ట‌వ‌శాత్తు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో దాదాపు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీని ఫలితంగా హైడ్రోక్లోరైడ్ యాసిడ్ రోడ్డుపై చిందింది. బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులందరినీ దిగమని హెచ్చ‌రించాడు. ఆ రద్దీలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. యాసిడ్ మండేది కాదని, అందువల్ల ఎటువంటి మంటలు లేవని, పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. అగ్నిమాపక దళాలను రంగంలోకి దించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. NH 44 పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అధిక...
Naxal Operation : మరో భారీ ఎన్‌కౌంటర్!
State

Naxal Operation : మరో భారీ ఎన్‌కౌంటర్!

మారేడుమిల్లి (AP) వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి Naxal Operation in Maredumilli | ఆంధ్రప్రదేశ్‌ మారేడుమిల్లి సమీపంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. నక్సల్ అగ్రనేత మద్వి హిద్మా హతమైన 24 గంటల్లోనే ఈ ఆపరేషన్ జరుగడం కలకలం రేపింది. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళవారం జరిగిన ఆపరేషన్‌ కొనసాగింపుగా తాజా ఢీకొనులో ఇప్పటివరకు ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. వీరిలో ముగ్గురు మహిళలని గుర్తించారు. మృతుల్లో ఒకరిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేటూరి జోఖా రావు అలియాస్ శంకర్‌గా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఆయన AOB డివిజన్‌లో ACMగా పనిచేసి, ఆయుధాల తయారీ, కమ్యూనికేషన్, సాంకేతిక కార్యకలాపాల్లో నైపుణ్యం కలిగి ఉన్నట్లు సమాచారం. గత రెండు దశాబ్దాలుగా అనేక దాడులకు ప్రధాన సూత్రధారి అయిన టా...
మారేడుమిల్లి అటవీలో ఎదురుకాల్పులు: అగ్ర మావోయిస్టు హిడ్మా సహా 6 మంది హతం – Maredumilli Encounter
AndhraPradesh

మారేడుమిల్లి అటవీలో ఎదురుకాల్పులు: అగ్ర మావోయిస్టు హిడ్మా సహా 6 మంది హతం – Maredumilli Encounter

Maredumilli Encounter : ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దుల్లో (Chhattisgarh Border) మావోయిస్టుల కదలికలపై భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో స్థానిక పోలీసులతో కలిసి కూబింగ్ నిర్వ‌హించారు. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులు ఎదుర‌ప‌డ‌డంతో పరస్పరం కాల్పులు జరుపుకొన్నారు. భద్రతా దళాల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్‌ కొనసాగుతోంద‌ని అధికారులు వెల్లడించారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మా (Hidma), అతని సతీమణి హేమ ఉన్నారు. మరో అగ్రనేత ఆజాద్‌ కూడా మృతిచెందినట్లు స‌మాచారం. . మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హిడ్మపై రూ.కోటికిపైగా రివార్డు ఉండగా...
Anganwadi Program | ములుగు జిల్లాలో అంగన్వాడీలకు ‘విజయ పాలు’
State, warangal

Anganwadi Program | ములుగు జిల్లాలో అంగన్వాడీలకు ‘విజయ పాలు’

ప్రీస్కూల్ చిన్నారులకు రోజూ 100 మి.లీ పాలు పంపిణీ ప్రారంభం పైలెట్ ప్రాజెక్ట్ గా ములుగు జిల్లా.. దేశంలోనే తొలిసారి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క New Anganwadi Program Started in mulugu | తెలంగాణలో చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారి, పైలెట్ ప్రాజెక్ట్‌గా ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ పిల్లలకు రోజూ 100 మిల్లీలీటర్ల పాలు పంపిణీ చేయడం మొదలైంది. ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రం లోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజ‌రై మాట్లాడారు. రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి మన రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం ముందుకుసాగుతోంద‌ని అన్నారు. వెనుక‌బ‌డిన ములు...
error: Content is protected !!