ED notices | మహేశ్ బాబుకు ED నోటీసులు.. టాలీవుడ్లో కలకలం
ED notices : తెలంగాణలో ఓ మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case) కలకలం రేపుతోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (Enforcement Directorate (ED) చేపట్టిన విచారణ అనేక మలుపులు తిరుతోంది. సినీ ప్రముఖుల మెడకు సైతం చుట్టుకుంటోంది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్ (Sai Surya Developers), సురానా గ్రూప్ (Surana Group) సంస్థల కార్యాలయాలపై ఇటీవల సోదాలు చేపట్టిన ఈడీ.. టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు (Tollywood superstar Mahesh Babu)కు నోటీసులు (ED notices) జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది.
ED notices కేసు ఏమిటి?
ఈ రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ పోలీసుల (Telangana Police)కు వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case) నమోదు చేసింది. విచారణను ప్రారంభించి ముమ్మరంగా కొనసాగిస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ అధినేత కె. సతీశ్ చంద్ర గు...




