ACB Raids | బిల్లింగ్ అనుమతికి రూ.8 లక్షల డిమాండ్.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ అధికారి
అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విఠల్ రావును విచారిస్తున్న అధికారులు
Hyderabad : జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు (ACB Raids) నిర్వహించారు. బిల్లింగ్ అనుమతి కోసం ఏకంగా రూ.8లక్షలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. విఠల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విఠల్ రావుకు సంబంధించిన మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. రెండు బిల్డింగ్లకు ఎన్వోసీ ఇవ్వడానికి రూ.8 లక్షల డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.. రూ.4 లక్షలు తీసుకుని మరో రూ.4 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విఠల్ రావు.. రెండు బిల్డింగ్ల నిర్మాణానికి ఎన్ఓసీ ఇవ్వడానికి రూ. 8 లక్షలు డిమాండ్ చేశారు. మొదటి విడతలో 4ల...




