Sarkar Live

Crime

ACB Raids | బిల్లింగ్ అనుమతికి రూ.8 లక్షల డిమాండ్.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ అధికారి
Crime

ACB Raids | బిల్లింగ్ అనుమతికి రూ.8 లక్షల డిమాండ్.. ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్ఎంసీ అధికారి

అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విఠల్ రావును విచారిస్తున్న అధికారులు Hyderabad : జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు (ACB Raids) నిర్వహించారు. బిల్లింగ్ అనుమతి కోసం ఏకంగా రూ.8లక్షలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ విట్టాల్ రావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. విఠల్ రావును ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. విఠల్ రావుకు సంబంధించిన మూడు చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. రెండు బిల్డింగ్లకు ఎన్వోసీ ఇవ్వడానికి రూ.8 లక్షల డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.. రూ.4 లక్షలు తీసుకుని మరో రూ.4 లక్షలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సికింద్రాబాద్​ జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్​ ఆఫీసర్​ విఠల్ రావు.. రెండు బిల్డింగ్​ల నిర్మాణానికి ఎన్ఓసీ ఇవ్వడానికి రూ. 8 లక్షలు డిమాండ్​ చేశారు. మొదటి విడతలో 4ల...
Bribe | ఏసీబీ వలలో కానిస్టేబుల్, అసిస్టెంట్ పీపీ
Crime

Bribe | ఏసీబీ వలలో కానిస్టేబుల్, అసిస్టెంట్ పీపీ

Kamareddy : కామారెడ్డిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుగులోత్ అశోక్ శివ రామ్ నాయక్, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కానిస్టేబుల్ నిమ్మ సంజయ్ శుక్రవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.10,000 లంచం (Bribe) డిమాండ్ చేసి తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో (ACB) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 420 కింద నమోదు చేయబడిన చీటింగ్ కేసుకు సంబంధించిన క్రైమ్ నంబర్ 375/2018 ప్రకారం ఫిర్యాదుదారునిపై కేసు విచారణ త్వరగా పూర్తి చేయడానికి, కేసులో నిర్దోషిగా విడుదల చేయడానికి అనుకూలంగా వ్యవహరించినందుకు సంజయ్ ద్వారా లంచం తీసుకున్నారు. మొదట్లో నాయక్ రూ.15,000 లంచం డిమాండ్ చేయగా, చివరకు రూ.10,000కి వీరి మధ్య ఒప్పందం కుదిరింది. సంజయ్ వద్ద నుంచి ACB అధికారులు రూ.10,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్...
Chhattisgarh : ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి
Crime

Chhattisgarh : ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతం (Bastar district) లోని అబుజ్మద్ అడవుల్లో భారీ కాల్పులు జ‌రిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నారు. నారాయణపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ ప్రకారం, మావోయిస్టుల మాడ్ డివిజన్‌కు చెందిన అగ్రశ్రేణి క్యాడర్లు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బుధవారం తెల్లవారుజామున సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. చత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం బీజాపూర్ – నారాయణపూర్ జిల్లాల మధ్య గల మాడ్ డివిజన్ పరిధిలోని అబూజ్మాడ్ అడవుల్లో భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ కొన‌సాగిస్తున్నాయి. బుధవారం ఉదయం వారికి మావోయిస్టులు ఎదురుప‌డి జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర పోరు జ‌రిగింది. ఇప్పటి వరకు ఈ ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్...
పాకిస్తాన్ కోసం గూఢచర్యం ఆరోపణలు.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు – Uttar Pradesh police
Crime

పాకిస్తాన్ కోసం గూఢచర్యం ఆరోపణలు.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు – Uttar Pradesh police

Uttar Pradesh police UP businessman : పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తోంద‌నే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్, ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు అయిన కొన్ని రోజుల తర్వాత, పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) రాంపూర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్తను అరెస్టు చేసింది. పాకిస్తాన్ తరఫున సరిహద్దు అక్రమ రవాణా, గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు STF కి నిఘా సమాచారం అందడంతో నిందితుడు షాజాద్‌ను మొరాదాబాద్‌లో అరెస్టు చేశారు. అధికారుల ప్రకారం, షాజాద్ జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌లోని తన నిర్వాహకులకు చేరవేస్తున్నాడు ఇటీవలి సంవత్సరాలలో వ్యాపారం నిర్వహించే నెపంతో షాజాద్ అనేకసార్లు పాకిస్తాన్‌ను సందర్శించాడని STF ఒక ప్రకటనలో తెలిపింది. అతను సౌందర్య సాధనాలు, బట్టలు, సుగ...
ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి
Crime

ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి

Fire accident in Hyderabad : హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్‌లోని మొదటి అంతస్తులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఏర్పాటు చేసిన ఏసీ కంప్రెషర్ పేలి మంటలు చెలరేగినట్లు (Fire Accident) అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. ఘటనా స్థలిలోనే నలుగురు చనిపోగా.. మరో 13 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. మరికొంతమంది గాయపడగా.. క్షతగాత్రులను మలక్‌పేటలోని యశోద ఆస్పత్రి, అపోలో, డీఆర్డీవో ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....
error: Content is protected !!