Accident | గుర్తుతెలియని వాహనం ఢీకొని ఎస్సై, కానిస్టేబుల్ మృతి
Kodada | కోదాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident) లో ఒక ఎస్సై, కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ మృతి చెందారు (Crime News). ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై దుర్గాపురం వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా (Konaseema District) ఆలమూరు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై అశోక్, కానిస్టేబుల్ వీరస్వామి ఓ పని నిమిత్తం హైదరాబాద్ బయలుదేరారు. మార్గంమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు కోదాడ పరిధిలో గుర్తుతెలియని వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు కోదాడ ప్రభుత్వ హాస్పిటల్కు తర...




