Sarkar Live

Crime

Bhupalpally | సామాజిక కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌.. అస‌లేం జ‌రిగిందంటే..
Crime

Bhupalpally | సామాజిక కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌.. అస‌లేం జ‌రిగిందంటే..

Bhupalpally : భూపాలపల్లి పట్టణంలో నిన్న సాయంత్రం జ‌రిగిన దారుణ హ‌త్య తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అవినీతిపై పోరాడుతున్న ఓ సామాజిక కార్య‌క‌ర్త నాగ‌వెల్లి రాజ‌లింగం మూర్తి (Nagavelli Rajalinga Murthy)ని పేగులు బ‌య‌ట‌పేడేలా పొడిచి చంప‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ హ‌త్య వెనుక కార‌ణాల‌పై పోలీసులు ముమ్మ‌రంగా విచార‌ణ చేప‌డుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మూర్తి హత్య వెనుక రాజకీయ కుట్ర లేదా పెద్ద ఆర్థిక ప్రయోజనాలే ఉన్నాయని తెలిసింది. అవినీతిపై పోరాడుతున్న మూర్తి పోరాడుతుండ‌టం వ‌ల్ల కొంతమందికి భారీగా ఆర్థిక నష్టం జరిగిందని, ఆ కోపంతోనే ఈ హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును CID లేదా SIT ద్వారా విచారణ చేపట్టాలని ఆయ‌న అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఉలిక్కిప‌డిన భూపాల‌ప‌ల్లి మూర్తి తన ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధ‌వారం సాయంత్రం 7:30 గంటల సమయంలో...
Kothagudem | అల్లుడిని నిప్పంటించి చంపిన అత్త‌మామ‌.. కొత్త‌గూడెం జిల్లాలో దారుణం
Crime

Kothagudem | అల్లుడిని నిప్పంటించి చంపిన అత్త‌మామ‌.. కొత్త‌గూడెం జిల్లాలో దారుణం

Bhadradri Kothagudem | తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. అల్లుడిపై అత్తామామలు (in-laws) పెట్రోల్ పోసి నిప్పంటించి హ‌త్య చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా ఇలా కోల్పోవాల్సి వచ్చింది. పెద్ద‌ల‌ను ఎదురించి.. పెళ్లి చేసుకొని.. పాల్వంచ మండలం (Paloncha mandal) దంతలబోరు గ్రామానికి చెందిన ఏళ్ల బాల్లెం గౌతమ్ (24) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండే వాడు. మూడేళ్ల క్రితం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు కావ్యతో అత‌డికి పరిచయం ఏర్పడింది. ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించ‌గా ఇరు కుటుంబాలు అంగీక‌రించ‌లేదు. దీంతో పెద్ద‌ల‌ను ఎదురించి గౌత‌మ్‌, కావ్య వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రు (couple) కొత్త‌గూడెం మండ‌లం సుజాత‌న‌గ‌ర్‌లో కాపురం పెట్టారు. వీరి దాంప‌త్య జీవితంగా సాఫీగానే సాగుతుండ‌గా కొన్ని రోజుల త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ్డాయ...
TGANB | న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌ట్టుబ‌డిన ప్ర‌ముఖ వ్యాపారులు!
Crime

TGANB | న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌ట్టుబ‌డిన ప్ర‌ముఖ వ్యాపారులు!

TGANB | హైదరాబాద్ నగరంలో డ్రగ్ (Drugs) కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరంలోని హై ఎండ్ పార్టీలు (High-End Party), ప్రైవేట్ ఈవెంట్స్ కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఆదివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 45 వద్ద జరిగిన ఒక హైఎండ్ పార్టీపై హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) సంయుక్త ఆధ్వ‌ర్యంలో దాడులు చేశారు. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖులు ప‌ట్టుబ‌డ్డార‌ని తెలిసింది. 14 మందికి డ్ర‌గ్స్ నిర్ధార‌ణ‌? ఒక విశ్వసనీయ సమాచారం ఆధారంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఓ విల్లాలో జరుగుతున్న హై ఎండ్ పార్టీపై పోలీసులు ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో దాడి చేశారు. మొత్తం 20 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించార‌ని తెలిసింది. వీరిలో ఎక్కువ మంది నగరంలోని ప్రముఖ వ్యాపార‌వేత్త‌లు, విదేశీయులు ఉన్నట్లు పోలీసులు తేల్చార‌ని స‌మాచారం. డ్రగ్ టెస్టింగ్‌లో అధునాతన సాంకేతికత ...
Child | ప‌సిపాప గొంతు కోసి.. చెత్త‌కుండీలో ప‌డేసి.. ఓ త‌ల్లి దారుణం
Crime

Child | ప‌సిపాప గొంతు కోసి.. చెత్త‌కుండీలో ప‌డేసి.. ఓ త‌ల్లి దారుణం

Mother cut her Child's throat : ఆడ బిడ్డ‌ను వ‌ద్ద‌నుకుంది ఆ కిరాత‌క త‌ల్లి. త‌న‌కు పుట్టిన పాప‌నే దారుణంగా చంపాల‌నుకుంది. గొంతు కోసి, చెత్త‌కుండీలో ప‌డేసింది. ఇందుకు ఆమె త‌ల్లి (ప‌సికందు అమ్మ‌మ్మ) స‌హ‌క‌రించింది. మ‌ధ్య‌ప్రదేశ్ (Madhya Pradesh)లో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత దారుణ‌మా? ఆడపిల్లలను ఇంటికి భారమని భావించి పుట్టుకతోనే చంపేసే ఘటనలు మన సమాజంలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ ఇవి పెచ్చుమీరుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో గుండెను పిండేసేద దారుణం ఒక‌టి చోటుచేసుకుంది. ఓ త‌ల్లి త‌న నెల రోజుల‌ బిడ్డ గొంతును కోసి (Mother cut her Child's throat) చెత్త‌కుండీలో ప‌డేసింది. జనవరి 11న రాయ్‌గఢ్‌లోని ఒక ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంత‌పోయారు. వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. ర‌క్తమోడుతుండ‌గా … సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ...
Stampede | ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో విల‌యం.. 18 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటకు కారణం ఏమిటి?
Crime

Stampede | ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో విల‌యం.. 18 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటకు కారణం ఏమిటి?

New Delhi Railway Station tragedy : మహాకుంభమేళాకు వచ్చిపోయే భక్తుల రద్దీ అకస్మాత్తుగా పెరగడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి ఘోర తొక్కిసలాట (New Delhi Railway Station Stampede ) జరిగిన విష‌యం తెలిసిందే.. రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 18 మంది మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు సహా 18 మంది మరణించారు.  ప్రమాదంపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆర్‌పిఎఫ్‌తో పాటు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం కూడా స్టేషన్‌కు చేరుకుంది. జనసమూహాన్ని నియంత్రించిన తర్వాత, ప్రత్యేక రైలును నడిపారు. Stampede : తొక్కిసలాటకు కారణమేమిటి? ఈ తొక్కిసలాటకు ముందు స్టేషన్‌లోని 14, 15 ప్లాట్‌ఫారమ్‌ల...
error: Content is protected !!