Sarkar Live

Crime

ACB Raids | తెలంగాణలో ఏసీబీ దూకూడు.. డీఈవో, జూనియర్ అసిస్టెంట్ అరెస్టు..
Crime

ACB Raids | తెలంగాణలో ఏసీబీ దూకూడు.. డీఈవో, జూనియర్ అసిస్టెంట్ అరెస్టు..

ACB Raids in Mulugu | కొన్ని రోజులుగా  ఏసీబీ (Anti-Corruption Bureau) దూసుకుగా ముందుకు దూసుకుపోతోంది.  రాష్ట్ర  వ్యాప్తంగా అవినీతి అధికారుల‌పై ఉక్కు మోపుతోంది. ఏ చిన్న ప‌నికైనా  ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నట్లు సమాచారం వస్తే వెంటనే రంగంలోకి దిగి వారిని రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంటోంది.  తాజాగా ఈరోజు (జూన్ 16న‌) లంచం తీసుకుంటుండగా  ములుగు జిల్లా డీఈవో (District Educational Officer), జూనియర్ అసిస్టెంట్ ను అరెస్టు చేశారు అనిశా అధికారులు. సిక్ లీవ్ నుంచి రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయునికి పోస్టింగ్ ఇచ్చేందుకు డీఈవో, జూనియర్ అసిస్టెంట్.  ఏకంగా రూ.20వేల లంచం డిమాండ్ చేశారు  దీంతో బాధిత ఉపాధ్యాయుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్ర‌మంలో ఉపాధ్యాయుడి నుంచి డీఈవో ఫణిని రూ. 15000, జూనియర్ అసిస్టెంట్  దిలీప్  రూ.5 వేలు  లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దిడీఈవో ఫణిన...
ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..
Crime

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..

ACB Raids | ఇంటి నెంబర్, వాటర్ సర్వీసింగ్ షెడ్ ఏర్పాటు కోసం డ‌బ్బులు డిమాండ్ చేసిన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా గ్రామ పంచాయతీ కార్య‌ద‌ర్శిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బుదేరా జీపీలో గ్రామానికి చెందిన వారు వాటర్ సర్వీసింగ్ షెడ్ నిర్మాణానికి అనుమ‌తి, కొత్త ఇంటికి నంబర్ కేటాయింపు కోసం గ్రామ కార్యదర్శి పి.నాగలక్ష్మి రూ.8వేలు లంచం (Bribe) డిమాండ్ చేశార‌ని ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను సంప్రదించ‌గా వారు రంగంలోకి దిగారు. సోమవారం బుదేరాలోని జీపీ కార్యాలయంలో రూ.8 వేల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు జీపీ కార్యదర్శిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేసిన ఏసీబీ (ACB) అధికారులు నాంపల్లిలోని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి...
Helicopter Crashes | కూలిన హెలీకాప్ట‌ర్‌.. ఐదుగురు మృతి
Crime

Helicopter Crashes | కూలిన హెలీకాప్ట‌ర్‌.. ఐదుగురు మృతి

కేదార్‌నాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లో కూలిపోయింది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తున్న ఈ ప్ర‌మాదం (Helicopter Crashes) లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌.. కేదార్‌నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి బ‌యలుదేరింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపు తప్పిన హెలికాప్టర్‌ గౌరీకుండ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో హెలికాప్ట‌ర్ లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో పైలట్‌తో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు స‌మాచారం. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. కాగా ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బందిని పంపామని, అయితే హెలికాప్టర్‌ దట్టమైన అటవీ ప్రాంతంలో పడిపోవడంతో అక్కడికి చేరుకోవడం కొంత జాప్య‌మ‌వుతోంద‌ని అధికారులు వెల్లడించారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ ...
Plane Crash | విమాన‌ శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డ్‌..?
Crime

Plane Crash | విమాన‌ శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డ్‌..?

Air India Ahmedabad Plane Crash Live Updates : ఇటీవలి సంవత్సరాలలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటి.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం AI171 గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది, విమానంలో 241 మంది మరణించారు. శుక్రవారం ఉదయం విమానయాన సంస్థ ప్రాణనష్టాన్ని నిర్ధారించింది. Plane Crash : ప్రమాద తీవ్రత: 1000 డిగ్రీల సెల్సియస్ మంటలు ప్రమాదానికి (Air India Plane Crash) కారణమేంటంటే దానిపై స్పష్టత ఇప్ప‌టివ‌ర‌కు రానప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి ప‌లు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానం కూలిన తర్వాత ఘటన స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు స‌మాచారం. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు వైద్యకళాశాల హాస్టల్‌లో ఉన్న 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహా...
Adilabad | పిడుగుపాటుకు ఆరుగురు రైతులు మృతి, ఐదుగురికి గాయాలు
Crime

Adilabad | పిడుగుపాటుకు ఆరుగురు రైతులు మృతి, ఐదుగురికి గాయాలు

Lightning strike incident in Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ప్ర‌కృతి క‌న్నెర్ర చేసింది. గురువారం జరిగిన మూడు వేర్వేరు పిడుగుపాటు సంఘటనలలో ఆరుగురు రైతులు (వారిలో నలుగురు మహిళలు) ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి, ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బేలా గ్రామంలో ఉదయం మొదటి పిడుగుపాటు సంభవించింది.. ఈ ఘ‌ట‌న‌లో పొలాల్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. కొద్దిసేపటికే, గాధిగూడ మండల పరిధిలోని పిప్రి గ్రామంలో మరో ఘటన జరిగింది, ఇందులో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. మధ్యాహ్నం తరువాత, కుమ్మరి తండాలో మరో పిడుగుపాటు సంభవించి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అంద‌రూ వ్య‌వ‌సాయ కూలీలే.. ఈ ఘటనలో గాయపడిన ఐదుగుర...
error: Content is protected !!