Skip to main content

Sarkar Live

Crime

ACB Raids | లంచావతారులకు ఏసీబీ షాక్… ఆరు నెల‌ల్లో 125 మంది అరెస్టు..
Crime

ACB Raids | లంచావతారులకు ఏసీబీ షాక్… ఆరు నెల‌ల్లో 125 మంది అరెస్టు..

ACB Raids in Telangana | తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) జూన్ - 2025లో 31 కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టింది. వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కేసులు, మూడు నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, నాలుగు సాధారణ విచారణలు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయని ఏసీబీ వెల్ల‌డించింది. ఈమేర‌కు జనవరి నుంచి జూన్ వరకు తన అర్ధ వార్షిక రౌండ్ అప్‌లో ప్ర‌క‌టించింది. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఒక ప్రైవేట్ వ్యక్తితో సహా 25 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేశారు. తర్వాత వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వివిధ విభాగాల ట్రాప్ కేసుల్లో రూ.3.43 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. రెండు డిఎ కేసులలో, రూ.13.50 లక్షలు, రూ.5.22 కోట్ల విలువైన ఆదాయానికి మించి ఆస్తులు బయటపడ్డాయి. ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో, లెక్కల్లో చూపని రూ.2.72 ల...
Pasmailaram Blast | పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 45కి చేరిన మృతుల సంఖ్య
Crime

Pasmailaram Blast | పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 45కి చేరిన మృతుల సంఖ్య

గుర్తించలేని స్థితిలో మృతులు.. డీఎన్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న ప్ర‌భుత్వం Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం (Pasmailaram ) పారిశ్రామికవాడలోని సిగాచి క్లోరో కెమికల్స్ భారీ పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కి చేరింది. ఇది తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా కొందరు భావిస్తున్నారు.NDRF, HYDRAA, తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు రేయింబవళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వివిధ ఆసుపత్రులలో 35 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. బహుశా, ఇది తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా ప‌లువురు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడి నుండి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి ప్రభుత్వ...
Odisha Stampede : పూరీ జ‌గ‌న్నాథ‌యాత్ర‌లో తొక్కిసలాట, ముగ్గురు మృతి
Crime, National

Odisha Stampede : పూరీ జ‌గ‌న్నాథ‌యాత్ర‌లో తొక్కిసలాట, ముగ్గురు మృతి

Odisha Stampede : ఒడిశాలోని చారిత్రాత్మక నగరం పూరీలో జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుండిచా ఆలయం వద్ద భక్తులు పెద్దఎత్తున గుమిగూడడంతో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఒడిశాలోని పూరిలో రథయాత్ర సందర్భంగా గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట (Puri Stampede ) కారణంగా పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఒడిశాలోని పూరిలో జరిగిన రథయాత్రలో ఈ ప్రమాదం ఆదివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వందలాది మంది భక్తులు ఆలయం సమీపంలో గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉం...
Hanumakonda | హనుమకొండలో అమానవీయ ఘటన: వివస్త్ర చేసి మహిళపై చిత్రహింసలు
Crime

Hanumakonda | హనుమకొండలో అమానవీయ ఘటన: వివస్త్ర చేసి మహిళపై చిత్రహింసలు

మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు హనుమకొండ జిల్లా తాటికాయ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన Hanumakonda | హనుమకొండ జిల్లాలో అత్యంత ఘోరమైన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ధర్మసాగర్‌ ‌మండలం తాటికాయల(Thatikayala) గ్రామంలో ఈ ఘ‌ట‌న జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ మహిళను ఇనుప గ్రిల్స్ ‌కట్టి, వివస్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి చిత్రహింస‌ల‌కు గురిచేశారు. తప్పు చేశాన‌ని క్షమించమ‌ని వేడుకున్నా వినకుండా దాడికి పాల్ప‌డ్డారు. కాగా ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఇటీవల కాలంలో రాజు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 10 రోజుల క్రితం ఇద్దరూ కలిసి గ్...
ACB Raids | ఏసీబీ ఆకస్మిక దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో హడల్..
Crime

ACB Raids | ఏసీబీ ఆకస్మిక దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో హడల్..

ఏసీబీ దాడుల్లో ఒకే రోజు ముగ్గురు లంచావతారుల అరెస్టు.. పెద్దపల్లిలో రూ.5వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డిన ముసిసిప‌ల్ ఉద్యోగులు ACB Raids in Telangana | అవినీతి నిరోధ‌క శాఖ‌ లంచగొండి అధికారుల భ‌ర‌తం ప‌డుతోంది.. ప్ర‌తీరోజు బాధితుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుల‌తో ఆక‌స్మిక దాడులు చేస్తూ అవినీతి అధికారులకు ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. తాజాగాఇంటి నంబర్‌ కోసం రూ. 5000 లంచం డిమాండ్‌ చేసి బాధితుడిని నుండి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు మున్సిపల్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివ‌రాల ప్రకారం.. పెద్ద‌ప‌ల్లిలోని ద్వారకా నగర్ కు చెందిన ఎ.ప్రసాద్ అనే వ్యక్తి కొత్త‌గా నిర్మించుకున్న ఇంటి నెంబర్ కోసం మున్సిపల్ సిబ్బందిని ఆశ్రయించాడు. కాగా బాధితుడిని ఏడాది పాటు ఆర్‌ఐ వినోద్‌, బిల్‌ కలెక్టర్‌ నాంపల్లి విజయ్‌కుమార్‌ రూ.10వేల డబ్బులు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేస...
error: Content is protected !!