Landslide | ఆర్మీ క్యాంప్పై కొండచరియలు విరిగిపడి ముగ్గురు సైనికులు మృతి, ఆరుగురు గల్లంతు
Landslide | సిక్కిం (Sikkim) లోని మంగన్ జిల్లాలోని లాచెన్ పట్టణానికి సమీపంలోని ఛాటెన్లోని సైనిక శిబిరం (Military Camp) పై ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు సైనిక సిబ్బంది మరణించగా, మరో ఆరుగురు గల్లంతయ్యారని అధికారులు సోమవారం తెలిపారు. ఈ ప్రాంతంలో నిరంతర భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు.
మరణించిన వారిని హవల్దార్ లఖ్విందర్ సింగ్, లాన్స్ నాయక్ మునీష్ ఠాకూర్, పోర్టర్ అభిషేక్ లఖాడగా సైన్యం ఒక ప్రకటనలో గుర్తించింది. వారి మృతదేహాలను వెలికితీశారు. స్వల్ప గాయాలతో మరో నలుగురు సైనికులను రక్షించారు. "తప్పిపోయిన ఆరుగురు సిబ్బందిని గుర్తించడానికి రెస్క్యూ బృందాలు 24 గంటలూ పనిచేస్తున్నాయి" అని ప్రకటన పేర్కొన్నారు. . మృతుల కుటుంబాలకు సైన్యం సంతాపం వ్యక్తం చేసింది. వారికి అవసరమైన అన్ని సహాయాలను అందిస్తామని హామీ ఇచ్చింది.
సిక్కింలో గత కొన్ని రోజు...




