Sarkar Live

Crime

ACB Raids : ఆదాయానికి మించిన ఆస్తులు.. రంగంలోకి ఏసీబీ
Crime

ACB Raids : ఆదాయానికి మించిన ఆస్తులు.. రంగంలోకి ఏసీబీ

ACB Raids | వ‌రంగ‌ల్ : ఆదాయానికి మించిన ఆస్తుల‌ను కూడ‌బెట్టుకున్న మహబూబాబాద్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ గౌస్‌ పాషాకు ఏసీబి షాకిచ్చింది.. ఆయ‌న‌ ఇంట్లో ఈరోజు ఏసీబీ అధికారులు ముమ్మ‌రంగా తనిఖీలు (ACB Raids) నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు. కురవి రోడ్డులో ఉన్న ఆయన నివాసంతోపాటు మహబూబాబాద్‌, జమ్మికుంట, హైదరాబాద్‌లోని ఆయన బంధువుల ఇండ్లలోనూ అధికారులు ఏక‌కాలంలో సోదాలు నిర్వహించారు . అవినీతి ఆరోపణల దృష్యా ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంతో మహబూబాబాద్‌లో డీటీఓగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉంటున్నారు. సస్పెన్షన్ లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ & మహాబుబాబాద్ జిల్లా రవాణా అధికారి (పూర్తి అదనపు భాధ్యతలు) అయిన మొహమ్మద్ గౌస్ పాషాపై ఏసీబి అధికారులు కేసు నమోదు చేశారు...
Terror Attack | ఉగ్ర‌దాడితో తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం..
Crime

Terror Attack | ఉగ్ర‌దాడితో తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం..

జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంతనాగ్‌ జిల్లాలోని పహెల్‌గామ్ (Pahalgam)లోఉగ్రవాదులు చేసిన‌ దాడులు (Terror Attack) భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రత్యేకంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవ‌డం విషాదాన్ని మిగిల్చింది. ఈ మార‌ణ‌కాండ‌లో మ‌న తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు కూడా అసువులు బాసారు. విశాఖపట్నానికి (Visakhapatnam) చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి (Chandramouli) దుర్మరణం చెందారు. ఆయన తన భార్య నాగమణితో కలిసి పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్ (Intelligence Bureau (IB) officer Manish Ranjan) కూడా మృతి చెందారు. కుటుంబంతో కలిసి బైసారన్ పర్యటనలో పాల్గొన్న మనీష్‌, ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. Terror Attack : స్వ‌ర్గ‌సీమ‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు పహెల్‌గామ...
Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి
Crime, National

Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మంగళవారం ఉగ్రవాద దాడిలో కనీసం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది గాయపడినట్లు సమాచారం. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు అడిగి చంపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ టిఆర్‌ఎఫ్ ప్రకటించింది. ఇద్దరు విదేశీయులు కూడా.. ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు కూడా మరణించారని తెలిసింది. నిరాయుధులైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన తర్వాత, ఉగ్రవాదులు దట్టమైన అడవి వైపు పారిపోయారు. కేంద్ర సంస్థల వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడికి ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు పాల్పడ్డారు. అయితే, భద్రతా సిబ్బంది మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు. Pahalgam Terror Attack పై NIA దర్యాప్తు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి...
Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం
Crime

Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం

Terrible Accident : మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం (Kowdipally Mandal of Medak district)లోని వెంకట్రావుపేట గేట్‌ వద్ద ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఏడాది చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు (Three Killed on the Spot) కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు (Six others were seriously injured). ప్రమాదం ఎలా జరిగింది? వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా (opposite directions) వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. ఈ కార్లలో రెండు కుటుంబాలు ప్ర‌యాణిస్తున్నాయి. కార్లు ప‌ర‌స్ప‌రంగా ఢీకొన‌డంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో ఉన్న దంపతులు ఎం.డి.గౌస్‌ (45), అజీం బేగం (40)తో పాటు ఏడాది వయసు గల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రమాదం(Terrible Accident) జరిగిన వెంటన...
Poisonous Conspiracy | స్కూల్ పిల్ల‌లపై విష ప్ర‌యోగం..
Crime

Poisonous Conspiracy | స్కూల్ పిల్ల‌లపై విష ప్ర‌యోగం..

Poisonous Conspiracy : ఆదిలాబాద్ జిల్లా (Adilabad district) ఇచ్చోడ మండలం ధరంపూరి (Dharampuri) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (government primary school)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారుల ప్రాణాలు తీసుకొనే కుట్ర (Poisonous Conspiracy) జ‌రిగింది. దాదాపు 30 మంది విద్యార్థుల (Thirty children) ప్రాణాలు తీసేలా పథకం రచించిన కొందరు దుర్మార్గులు పాఠశాల నీటి ట్యాంకు (drinking water tank)లో పురుగుల మందు (pesticide) కలిపారు. అంతే కాకుండా.. మధ్యాహ్న భోజనం వండే పాత్రలపైనా ఆ విషపదార్థాన్ని చల్లి పెట్టారు. విద్యార్థులకు ఏమీ తెలియకుండా వారి భోజనంలోనే విషం ఇచ్చే ప్రయత్నం చేసిన ఈ కుట్ర పాఠశాల సిబ్బంది అప్రమత్తత వల్ల భ‌గ్న‌మైంది. వంట పాత్రలను శుభ్రం చేస్తుండగా నీళ్లలో నుంచి వాసన రావడం, నురగలు రావడం గమనించి వెంటనే పైఅధికారులకు సమాచారం అందించారు. సెల‌వుల్లో దారుణం శని, ఆది, సోమవారాల్లో వరుసగా మూడు రో...
error: Content is protected !!