ATM loot | రూ. 30 లక్షల అపహరణ.. కలకలం రేపిన ఏటీఎం చోరీ
ATM loot : హైదరాబాద్ (Hyderabad) శివారు రావిరాల (Ravirala village)లో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఏటీఎం (ATM)ను ధ్వంసం చేసిన దుండగులు రూ. 30 లక్షల నగదును అపహరించారు. పటిష్ట రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పటికీ సాంకేతికతను ఉపయోగించి దొంగతనం చేశారు. ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.
ఎలాంటి హడావిడి లేకుండా.. ఎంతో జాగ్రత్తగా..
రావిరాలలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం దగ్గర రాత్రివేళ దుండగులు చోరీకి పాల్పడ్డారు. మొత్తం నలుగురు కారులో వచ్చి ముందుగా పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఎవరైనా గస్తీ తిరుగుతున్నారా? ఎవరైనా చూస్తున్నారా? అనే విషయాన్ని పరిశీలించారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ముందుగా సీసీ కెమెరాలను పని చేయకుండా చేయడానికి కెమికల్ స్ప్రే ఉపయోగించారు. ఇది కెమెరా లెన్స్ను మసకబార్చి, ఏ విధంగా కూడా దృశ్యాలను రికార్డ్ కాకుండా చేస్తుంది. ఈ పని అయిపోయిన తర్వాత వారు ఏటీఎం...




