Sarkar Live

Crime

Ocean County : అమెరికాలో భార‌తీయుడి హ‌త్య కేసు బిగ్ అప్‌డేట్‌.. ఐదుగురు అరెస్టు
Crime

Ocean County : అమెరికాలో భార‌తీయుడి హ‌త్య కేసు బిగ్ అప్‌డేట్‌.. ఐదుగురు అరెస్టు

Ocean County : అమెరికాలో ఓ భార‌తీయుడు హ‌త్యకు గురైన ఘ‌ట‌న‌లో ఐదుగురు భార‌త సంత‌తికి చెందిన వ్య‌క్తుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. 2024 అక్టోబ‌రు 22న లాస్ వెగాస్‌లోని మాంచెస్ట‌ర్ టౌన్‌షిప్ వ‌ద్ద ఈ హ‌త్య జరిగింది. కుల్దీప్ కుమార్ (35) అనే భార‌తీయుడు హ‌త‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో విచార‌ణ చేప‌ట్ట‌గా సౌత్ ఓజోన్ పార్క్, న్యూయార్క్‌కు చెందిన 34 ఏళ్ల సందీప్ కుమార్ దీనికి సూత్రధారుడ‌ని వెల్ల‌డైంది. మ‌రో న‌లుగురితో క‌లిసి అత‌డు ఈ హ‌త్యకు పాల్ప‌డ్డాడని త‌మ విచార‌ణ‌లో వెల్ల‌డైంది. ఈ మేర‌కు ఓసియ‌న్ కంట్రీ ప్రాసిక్యూటర్ బ్రాడ్లీ బిల్హైమర్, న్యూజెర్సీ రాష్ట్ర పోలీసు కల్నల్ ప్యాట్రిక్ కాలహాన్ తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కుల్దీప్ కుమార్ హ‌త్య‌కు సందీప్ కుమార్ సూత్ర‌ధారుడు కాగా మిగ‌తా నిందితులు సౌరవ్ కుమార్ (23), గౌరవ్ సింగ్ (27), నిర్మల్ సింగ్ (30), గురుదీప్ సింగ్ (22)గా కేసు న‌మోదైంద‌ని వివ‌రించారు.వీర...
Bengaluru : రాంగ్ రూట్ లో వెళ్లిన ఆటో డ్రైవ‌ర్‌.. భ‌యంతో దూకేసిన మ‌హిళ‌
Crime

Bengaluru : రాంగ్ రూట్ లో వెళ్లిన ఆటో డ్రైవ‌ర్‌.. భ‌యంతో దూకేసిన మ‌హిళ‌

Bengaluru Auto-rickshaw : బెంగళూరులో గురువారం రాత్రి కదులుతున్న ఆటో రిక్షా (Auto-rickshaw) నుంచి 30 ఏళ్ల మహిళ దూకేసింది. ఆమె త‌ను వెళ్లాల్సిన దారి గురించి స్ప‌ష్టంగా ఆటో డ్రైవ‌ర్ కు చెప్పినా కూడా అత‌డు ప‌ట్టించుకోకుండా మ‌రో మార్గంలో వెళ్లాడు. డ్రైవర్ తెలియని మార్గం వైపు వెళుతున్నాడని గ‌మ‌నించి వెంట‌నే స‌ద‌రు మ‌హిళ ఆటోలో నుంచి దూకేసింది. బెంగ‌ళూరులోని తన ఇంటికి వెళ్లేందుకు ఆ మహిళ ‘నమ్మ యాత్రి’ యాప్ (Namma Yatri app) ద్వారా ఆటోను బుక్ చేసుకుంది. అయితే, డ్రైవర్ సాధారణ మార్గాన్ని అనుసరించకుండా హెబ్బాల్ వైపు వెళ్లడం ప్రారంభించడంతో ఆమె ఆందోళ‌న‌కు గురైంది. పదేపదే ప్రశ్నించిన తర్వాత, డ్రైవర్ స్పందించకపోవడంతో మహిళ వెంట‌నే ఆటో నుంచి దూకి త‌ప్పించుకుంది. ఆమె భర్త, అజహర్ ఖాన్, సోషల్ మీడియాలో ఈ భయంకరమైన అనుభవాన్ని షేర్ చేశారు. తన భద్రత గురించి ఆందోళన చెందిన మహిళ, డ్రైవర్ కళ్ళు ఎర్రబడటం, మత్తులో ఉ...
Chinese Manja : చైనా మాంజా వ్యాపారుల‌పై ఫోక‌స్‌.. 22 మందిపై 18 కేసులు
Crime

Chinese Manja : చైనా మాంజా వ్యాపారుల‌పై ఫోక‌స్‌.. 22 మందిపై 18 కేసులు

Chinese Manja హైదరాబాద్‌ : సంక్రాంతి స‌మీపిస్తుండ‌డంతో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఉత్సాహంగా గాలిప‌టాలు ఎగుర‌వేస్తూ కేరింత‌లు కొడుతుంటారు. ప‌ట్టాణాలు, ప‌ల్లెల్లో ఎక్క‌డ చూసినా ఆకాశంలో రంగురంగుల‌ ప‌తంగులు క‌నువిందు చేస్తుంటాయి. అయితే ఇటీవ‌ల కాలంలో గాలిప‌టాల‌కు చైనా మాంజా ఉప‌యోగిస్తుండ‌డంతో అవి మెడకుచుట్టుకొని పిల్లు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగించాయి. చైనా మాంజాపై ప్ర‌భుత్వం ఎప్ప‌టినుంచో నిషేధం విధించిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్యాపారులు అదేమీ పట్టించుకోకుండా యథేచ్చగా విక్రయాలు జరుపుతున్నారు. Chinese Manja seized : అయితే పిల్ల‌ల ప్రాణాలు తీస్తున్న ఈ చైనా మాంజాపై హైద‌రాబాద్ పోలీసులు స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. గత 20 రోజుల్లో మంగళ్‌హాట్‌ పోలీసులు (Hyderabad Mangalhat police) పలు దుకాణాలపై దాడులు చేసి చైనా మాంజా విక్రయిస్తున్న 22 మందిపై 18 కేసులు నమోదు చేశారు. సింథటిక్ మెటీరియ...
Nimisha Priya | కేరళ నర్సుకు మ‌ర‌ణ శిక్ష‌.. అస‌లేం జ‌రిగింది?
Crime

Nimisha Priya | కేరళ నర్సుకు మ‌ర‌ణ శిక్ష‌.. అస‌లేం జ‌రిగింది?

Nimisha Priya: యెమ‌న్‌లో ప‌నిచేస్తున్న కేరళ న‌ర్సు నిమిషా ప్రియాకు మ‌ర‌ణ శిక్ష ప‌డింది. 2017లో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో అక్క‌డి కోర్టు ఇటీవ‌ల‌ దీన్ని విధించ‌గా తాజాగా ఆ దేశ అధ్య‌క్షుడు అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమోదం తెలిపారు. పూర్వప‌రాలు ఏమిటంటే.. నిమిషా ప్రియా 2011లో తన కుటుంబంతో కలిసి యెమెన్ వెళ్లింది. సనా అనే ప్రాంతంలో ఆమె ఒక క్లినిక్ నడిపేది. యెమెన్ చట్టాల ప్రకారం విదేశీయులు వ్యాపారం నిర్వహించాలంటే స్థానిక భాగస్వామిని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆమె తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తిని తన క్లినిక్‌లో బిజినెస్ పార్ట్‌న‌ర్‌గా చేర్చుకుంది. కొన్నాళ్ల తర్వాత నిమిషాను మహదీ వేధించడం ప్రారంభించాడు. వ్యాపారానికి సంబంధించిన డబ్బు బలవంతంగా తీసుకోవడం, ఆమె పాస్‌పోర్టు లాక్కోవ‌డం లాంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డాడు. దీంతో నిమిషా పోలీసులను ఆశ్రయించింది. అయినప్పటికీ సరైన స్పందన లభించలేదు. చివ‌ర‌కు Nim...
Micro Finance loan | ఇంత దారుణ‌మా..?!.. దంప‌తుల‌ను బ‌లిగొన్న మైక్రో అప్పు
Crime

Micro Finance loan | ఇంత దారుణ‌మా..?!.. దంప‌తుల‌ను బ‌లిగొన్న మైక్రో అప్పు

Micro Finance loan : అప్పు ఆ కుటుంబానికి ముప్పు తెచ్చి పెట్టింది. రుణం ఇచ్చిన సంస్థ దారుణానికి ఆ ఫ్యామిలీ తుడిచిపెట్టుకుపోయింది. మైక్రో ఫైనాన్స్ వేధింపుల‌కు భార్యాభ‌ర్త‌లు బ‌లి అయ్యారు. బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చేసుకొని పిల్ల‌ల‌ను అనాథ‌లు చేశారు. పది రోజుల వ్య‌వ‌ధిలోనే దంప‌తులిద్ద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లాలో ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. వారం వారం చెల్లింపులతో క‌ష్టాలు భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌ గ్రామానికి చెందిన బానోత్‌ దేవందర్‌ (37), చందన (32) అదే గ్రామంలో కూలి ప‌ని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. చాలీచాల‌ని దిన‌స‌రి వేత‌నంతో వీరికి కుటుంబ పోష‌ణ భార‌మైంది. దీంతో మైక్రో ఫైనాన్స్‌లో రూ. 3 లక్షల అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పుకు వారం వారం కిస్తీలు క‌ట్టాల్సి ఉండ‌గా, కొన్ని రోజుల త‌ర్వాత చెల్లింపులు వీరికి క‌ష్ట‌త‌ర‌మైంది. ఒక‌రి త...
error: Content is protected !!