Train robbery | రాయలసీమ ఎక్స్ప్రెస్లో దొంగల హల్చల్
Train robbery : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి (Gutti in Anantapur district) దగ్గర నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ (Rayalaseema Express)లో సోమవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆగి ఉన్న రైలులోకి వచ్చి ప్రయాణికుల దగ్గర ఉన్న బంగారం, డబ్బులు, విలువైన వస్తువులు (Train robbery) ఎత్తుకెళ్లారు. అమరావతి ఎక్స్ప్రెస్ (Amaravati Express) వెళ్లడానికి దారి ఇవ్వడానికి గుత్తి దగ్గర రాయలసీమ ఎక్స్ప్రెస్ ఆగి ఉండగా దొంగలు ఆ రైలులోని 10 బోగీల్లోకి ఎక్కారు. ప్రయాణికులను బెదిరించి వరుసగా ఒక్కొక్కరి నుంచి ఆభరణాలు, డబ్బులు, విలువైన వస్తువులు దోచుకున్నారు. దీంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. 20 మంది బాధిత ప్రయాణికులు (affected passengers) ఈ ఘటనపై తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Tr...




