Sarkar Live

Crime

TGANB | న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌ట్టుబ‌డిన ప్ర‌ముఖ వ్యాపారులు!
Crime

TGANB | న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌ట్టుబ‌డిన ప్ర‌ముఖ వ్యాపారులు!

TGANB | హైదరాబాద్ నగరంలో డ్రగ్ (Drugs) కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరంలోని హై ఎండ్ పార్టీలు (High-End Party), ప్రైవేట్ ఈవెంట్స్ కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఆదివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 45 వద్ద జరిగిన ఒక హైఎండ్ పార్టీపై హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) సంయుక్త ఆధ్వ‌ర్యంలో దాడులు చేశారు. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖులు ప‌ట్టుబ‌డ్డార‌ని తెలిసింది. 14 మందికి డ్ర‌గ్స్ నిర్ధార‌ణ‌? ఒక విశ్వసనీయ సమాచారం ఆధారంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఓ విల్లాలో జరుగుతున్న హై ఎండ్ పార్టీపై పోలీసులు ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో దాడి చేశారు. మొత్తం 20 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించార‌ని తెలిసింది. వీరిలో ఎక్కువ మంది నగరంలోని ప్రముఖ వ్యాపార‌వేత్త‌లు, విదేశీయులు ఉన్నట్లు పోలీసులు తేల్చార‌ని స‌మాచారం. డ్రగ్ టెస్టింగ్‌లో అధునాతన సాంకేతికత ...
Child | ప‌సిపాప గొంతు కోసి.. చెత్త‌కుండీలో ప‌డేసి.. ఓ త‌ల్లి దారుణం
Crime

Child | ప‌సిపాప గొంతు కోసి.. చెత్త‌కుండీలో ప‌డేసి.. ఓ త‌ల్లి దారుణం

Mother cut her Child's throat : ఆడ బిడ్డ‌ను వ‌ద్ద‌నుకుంది ఆ కిరాత‌క త‌ల్లి. త‌న‌కు పుట్టిన పాప‌నే దారుణంగా చంపాల‌నుకుంది. గొంతు కోసి, చెత్త‌కుండీలో ప‌డేసింది. ఇందుకు ఆమె త‌ల్లి (ప‌సికందు అమ్మ‌మ్మ) స‌హ‌క‌రించింది. మ‌ధ్య‌ప్రదేశ్ (Madhya Pradesh)లో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత దారుణ‌మా? ఆడపిల్లలను ఇంటికి భారమని భావించి పుట్టుకతోనే చంపేసే ఘటనలు మన సమాజంలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ ఇవి పెచ్చుమీరుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో గుండెను పిండేసేద దారుణం ఒక‌టి చోటుచేసుకుంది. ఓ త‌ల్లి త‌న నెల రోజుల‌ బిడ్డ గొంతును కోసి (Mother cut her Child's throat) చెత్త‌కుండీలో ప‌డేసింది. జనవరి 11న రాయ్‌గఢ్‌లోని ఒక ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంత‌పోయారు. వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. ర‌క్తమోడుతుండ‌గా … సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ...
Stampede | ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో విల‌యం.. 18 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటకు కారణం ఏమిటి?
Crime

Stampede | ఢిల్లీ రైల్వేస్టేష‌న్‌లో విల‌యం.. 18 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటకు కారణం ఏమిటి?

New Delhi Railway Station tragedy : మహాకుంభమేళాకు వచ్చిపోయే భక్తుల రద్దీ అకస్మాత్తుగా పెరగడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి ఘోర తొక్కిసలాట (New Delhi Railway Station Stampede ) జరిగిన విష‌యం తెలిసిందే.. రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 18 మంది మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు సహా 18 మంది మరణించారు.  ప్రమాదంపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆర్‌పిఎఫ్‌తో పాటు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం కూడా స్టేషన్‌కు చేరుకుంది. జనసమూహాన్ని నియంత్రించిన తర్వాత, ప్రత్యేక రైలును నడిపారు. Stampede : తొక్కిసలాటకు కారణమేమిటి? ఈ తొక్కిసలాటకు ముందు స్టేషన్‌లోని 14, 15 ప్లాట్‌ఫారమ్‌ల...
Ganja | ఒడిశా టూ సూరత్..  గంజాయి రవాణాలో ఆరితేరిన ఒడిశా దంపతులు
Crime

Ganja | ఒడిశా టూ సూరత్.. గంజాయి రవాణాలో ఆరితేరిన ఒడిశా దంపతులు

నిందితుల ఆటకట్టించిన వరంగల్ పోలీసులు చూడటానికి ఉన్నత కుటుంబాలకు చెందినవారి కనిపిస్తూ గంజాయి (Ganja) రవాణాకు పాల్పడున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కిలాడీ దంపతులను మీల్స్‌కాలనీ, డ్రగ్స్‌ కంట్రోల్‌ టీం పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. ఈ ఘరానా దంపతుల నుంచి సుమారు 6 లక్షల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకేట్లతో పాటు రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి మీల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్‌స్పెక్టర్‌ వెంకటరత్నం వివరాలను వెల్లడించారు. ఒడిశా (Odisha) రాష్ట్రానికి చెందిన గొగి శంకర్‌ దాస్‌ (39), పూర్ణిమ గొగిదాస్‌ (30) వీరూ ఇరువురు భార్యభర్తలు ప్రస్తుతం ఈ దంపతులు గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లో నివాసం ఉంటున్నారు. కిలాడీ దంపతులు సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఈ దంపతులు గంజాయిని ఒడిశా నుంచి తీసుకవచ్చ...
Hanuman temple | హనుమాన్ మందిర్‌లో మాంసపు ముక్కలు.. ఉద్రిక్త‌త‌
Crime

Hanuman temple | హనుమాన్ మందిర్‌లో మాంసపు ముక్కలు.. ఉద్రిక్త‌త‌

హైదరాబాద్ (Hyderabad)లోని ట‌ప్పాచబుత్ర (Tappachabutra) ప్రాంతంలో ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ మందిరం (Hanuman temple) లో మాంసపు ముక్కలు (Meat) క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్రధాన అర్చకుడు (Temple priest) ముందుగా ఈ విషయాన్ని గమనించారు. ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేయ‌డంతో ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో వేగంగా వ్యాపించింది. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో మందిరానికి చేరుకున్నారు. షాకైన ప్ర‌ధాన అర్చ‌కుడు రోజూ లాగే ప్ర‌ధాన అర్చ‌కుడు ఈ రోజు ఉద‌యం పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు వ‌చ్చారు. ఆలయం (Hanuman temple)లో శుభ్రపరిచే సమయంలో మాంసపు ముక్కలు కనిపించాయి. దీంతో ఆయ‌న తీవ్రంగా షాక‌య్యారు. వెంటనే ఆలయ కమిటీకి సమాచారం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించమని కోరారు. ఈ వార్త ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఇతర భక్తులకు చేరింది. కొద్ది నిమిషాల్లోనే స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి...
error: Content is protected !!