Poisonous Conspiracy | స్కూల్ పిల్లలపై విష ప్రయోగం..
Poisonous Conspiracy : ఆదిలాబాద్ జిల్లా (Adilabad district) ఇచ్చోడ మండలం ధరంపూరి (Dharampuri) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (government primary school)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారుల ప్రాణాలు తీసుకొనే కుట్ర (Poisonous Conspiracy) జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థుల (Thirty children) ప్రాణాలు తీసేలా పథకం రచించిన కొందరు దుర్మార్గులు పాఠశాల నీటి ట్యాంకు (drinking water tank)లో పురుగుల మందు (pesticide) కలిపారు. అంతే కాకుండా.. మధ్యాహ్న భోజనం వండే పాత్రలపైనా ఆ విషపదార్థాన్ని చల్లి పెట్టారు. విద్యార్థులకు ఏమీ తెలియకుండా వారి భోజనంలోనే విషం ఇచ్చే ప్రయత్నం చేసిన ఈ కుట్ర పాఠశాల సిబ్బంది అప్రమత్తత వల్ల భగ్నమైంది. వంట పాత్రలను శుభ్రం చేస్తుండగా నీళ్లలో నుంచి వాసన రావడం, నురగలు రావడం గమనించి వెంటనే పైఅధికారులకు సమాచారం అందించారు.
సెలవుల్లో దారుణం
శని, ఆది, సోమవారాల్లో వరుసగా మూడు రో...




