Karregutta | కర్రెగుట్టల్లో సొరంగం.. విస్తుబోయిన పోలీసులు
Karregutta: తెలంగాణ రాష్ట్రం (Telangana) ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలోని కర్రెగుట్ట (Karregutta) ప్రాంతం ఆరు రోజులుగా దద్దరిల్లిపోతోంది. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉండే ఈ గుట్ట ప్రాంతాన్నంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ భీకరమైన కాల్పుల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. కేంద్ర భద్రతా బలగాలు, మావోయిస్టు (Maoists) దళాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కూంబింగ్ ఆపరేషన్ సమయం (Combing operation)లో ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు దాదాపు 38 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఖ్యపై అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా వెలువడలేదు.
Karregutta : భద్రతా దళాల దూకుడు
Karregutta ప్రాంతంలో భద్రతా బలగాలు తమ కూంబింగ్ (combing operations)ను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. మావోయిస్టుల జాడ కోసం అడవి పొదలు, గుహలు,...




