Sarkar Live

Crime

Food Poisoning | కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం..
Crime

Food Poisoning | కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Food Poisoning : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఫుడ్ పాయిజనింగ్‌ ఘటన జుక్కల్ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలుర హాస్టల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. Food Poisoning in Kamareddy District : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండల కేంద్రంలోని షెడ్యూల్డ్‌ కులాల బాలుర హాస్టల్‌లో శుక్రవారం నలుగురు విద్యార్థులు ఫుడ్‌ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. నివేదికల ప్రకారం, నలుగురు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తర్వాత కడుపు నొప్పి, వాంతులయ్యాయి. వీరిని సిబ్బంది చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి తీవ్ర కడుపునొప్పి వచ్చి ఆస్పత్రిలో చేరాడు. అన్నం ఉడకపోవడం వల్ల కడుపునొప్పి వచ్చిందని విద్యార్థులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ...
Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం
Crime

Fatal Accident | హైవేపై ఘోర ప్రమాదం.. ఐదుగురు స‌జీవ ద‌హ‌నం

Fatal Accident : రాజ‌స్థాన్‌లోని జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రసాయనాలు (Chemical) త‌ర‌లిస్తున్న ఓ ట్రక్కు అదుపు త‌ప్పి అనేక వాహనాలతో ఢీకొనడంతో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఈ ఘటనలో 30 వాహ‌నాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. ఐదుగురు సజీవ ద‌హ‌న‌మ‌య్యారు. 37 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. భారీ ప్రమాదం (Fatal Accident) ఎలా జ‌రిగిందంటే.. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... రసాయన పదార్థాలు (కెమిక‌ల్స్‌) ర‌వాణా చేస్తున్న ఓ ట్ర‌క్కు జైపూర్‌- అజ్మీర్ జాతీయ ర‌హ‌దారి (National highway )పై అదుపు త‌ప్పి ఇతర వాహనాలను ఢీకొంది. దీంతో ట్రక్కులో ఉన్న రసాయనాలు అంటుకుని ఒక్క‌సారిగా మంటలు వ్యాపించాయి. చూస్తూ చూస్తుండానే 30కి పైగా వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిమాపక దళాలు కూడా ఆ వాహనాల వ‌ద్ద‌కు చేరుకోలేనంత‌గా మంట‌లు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్ర‌మాదంతో ...
Ganja | హైద‌రాబాద్‌లో గంజాయి చాక్లెట్స్‌ కలకలం
Crime

Ganja | హైద‌రాబాద్‌లో గంజాయి చాక్లెట్స్‌ కలకలం

Ganja chocolates seized : గంజాయి స్మ‌గ్ల‌ర్లు కొత్త మార్గాల‌ను ఎంచుకున్నారు. నేరుగా స‌ర‌ఫ‌రా చేస్తే ప‌ట్టుబ‌డుతామ‌నే భ‌యంతో కొత్త ప‌ద్ధ‌తుల‌ను ఎంచుకున్నారు. చాకెట్ల మాదిరి ప్యాకింగ్‌తో స‌ప్ల‌య్ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లోని ఈ త‌ర‌హా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ షాపులో నిన్న రాత్రి దాడులు చేసిన సైబ‌రాబాద్ స్పెష‌న్ ఆప‌రేష‌న్ టీమ్ (SOT) పోలీసులు జ‌గ‌ద్గిగిరిగుట్ట‌లోని ఓ షాపులో వీటిని ప‌ట్టుకున్నారు. 2,400 చాక్లెట్లు స్వాధీనం సైబ‌రాబాద్ స్పెష‌న్ ఆప‌రేష‌న్ టీమ్ పోలీసులు 2,400 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి మొత్తం 13 కిలోలల బ‌రువు క‌లిగి ఉన్నాయి. అనంత‌రం బీహార్‌కు చెందిన సునీల్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతడు బీహార్ నుంచి ఈ చాక్లెట్లను తెచ్చి హైదరాబాద్‌లోని స్థానిక కూలీలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్య‌వ‌హారంలో ఇంకెవ‌రెవ‌రు ఉన్నారు.. ఎవ‌రి అండ‌దండ‌ల‌తో వీరు ఈ దందా చేస్తున్నా...
Hush Money Case | చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్.. హష్ మనీ కేసులో కొత్త మ‌లుపు
Crime

Hush Money Case | చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్.. హష్ మనీ కేసులో కొత్త మ‌లుపు

Donald Trump : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్‌షాక్ త‌గిలింది. హ‌ష్ మ‌నీ కేసు (Hush Money Case) లో గ‌తంలో త‌న‌ను దోషిగా ఖ‌రారు చేస్తూ గ‌తంలో వెలువ‌డిన‌ తీర్పును ర‌ద్దు చేయాల‌ని తాజాగా ఆయన చేసిన అభ్య‌ర్థ‌న‌ను జ‌డ్జి తిర‌స్క‌రించారు. అధ్య‌క్షుడిగా ట్రంప్‌కు క‌ల్పించే అధికారిక మినహాయింపును ఈ కేసులో ఇవ్వాల‌ని ఆయ‌న‌ త‌ర‌ఫున న్యాయ‌వాదులు చేసిన వాద‌న‌లను కోర్టు అంగీక‌రించ‌లేదు. కేసు ఏమిటంటే.. డోనాల్డ్ ట్రంప్ 2016 అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో అక్ర‌మంగా 1,30,000 డాల‌ర్లు చెల్లింపులు చేశార‌ని, దీనికి సంబంధించిన రికార్డుల‌ను ఆయ‌న తారుమారు చేశార‌ని ఆయ‌న‌పై అభియోగం ఉంది. దీనిపై అప్ప‌ట్లో కేసు న‌మోదు కాగా 34 ర‌కాల ఆరోప‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న యూఎస్ సుప్రీం కోర్టు ట్రంప్‌ను దోషిగా ఖ‌రారు చేస్తూ 2023 మే నెల‌లో తీర్పు ఇచ్చింది. ఈ క్ర‌మంలో ట్రంప్ న్యాయ‌వాదులు ఆయ‌న త‌ర‌ఫున‌ కోర్టు...
Telangana News | ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్య
Crime

Telangana News | ఏడవ తరగతి విద్యార్థి ఆత్మహత్య

Telangana News | తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చక్కగా చదువుకొని నేర్చుకొని గొప్పవాడు కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోతున్నాయి. స్కూళ్లు, హాస్టళ్లలోని ఉపాధ్యాయుల తీవ్రమైన ఒత్తిడితోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రోజు ఉదయం కూడా ఓ విద్యార్థి ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.వివరాల్లోకెళితే.. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉన్న నారాయణ స్కూల్లో 7 వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వనపర్తి జిల్లాకు చెందిన లోహిత్ ను చదువు కోసం తల్లిదండ్రులు ఆ స్కూల్ లో చేర్పిస్తే సదరు విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు షాక్ గురయ్యారు. పాఠశాలలోని టీచర్ వల్లే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లోహిత్ మృతి చెందిన విషయం తె...
error: Content is protected !!