Sarkar Live

Crime

Warangal : పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌ కు లింకు.. నిందితుడి అరెస్టుతో కలకలం
Crime

Warangal : పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌ కు లింకు.. నిందితుడి అరెస్టుతో కలకలం

వరంగల్: ఓరుగల్లులో (Warangal)లో ఉగ్రవాదుల (Terrorists) కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదుల (Pakistan Terrorists)తో సంబంధాలు ఉన్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఉగ్రవాదుల కదలికల ప్రచారంతో వరంగల్ వాసుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ జాన్‌పాకకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు జ‌క్రియాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న శ్రీలంకకు వెళ్తుండగా.. జక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స‌మాచారం. కాగా, నిందితుడు జ‌క్రియా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. అతనికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా అరెస్టు అయిన వ్యక్తి భారత్ ల...
Laddoo Mahotsav | యూపీలో విషాదం.. ఆదినాథ్ ల‌డ్డూ మ‌హోత్స‌వంలో అప‌శ్రుతి
Crime

Laddoo Mahotsav | యూపీలో విషాదం.. ఆదినాథ్ ల‌డ్డూ మ‌హోత్స‌వంలో అప‌శ్రుతి

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ (Uttar Pradesh's Baghpat)లో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. ఆదినాథ్ ఆలయంతో ఏర్పాటు చేసిన నిర్వాణ లడ్డూ మహోత్సవం (Laddoo Mahotsav) సందర్భంగా మాన్ స్తంభ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమారు 60 మందికి పైగా భక్తులు స్టేజ్‌ కింద పడిపోయారు. ఆరుగురి మృతి, 50 మందికి గాయాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలోని ఆదినాథ్ ఆల‌యంలో ఈ రోజు జ‌రిగిన ల‌డ్డూ స‌మ‌ర్ప‌ణ‌ మ‌హోత్స‌వం (Laddoo Mahotsav)లో అప‌శ్రుతి చోటోచేసుకుంది. స్టేజ్ కుప్ప కూలిపోవ‌డంతో ఆరుగురు మృతి చెందారు. మ‌రో సుమారు 50 మంది గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు ఉన్నారు. Laddoo Mahotsav దుర్ఘటన ఎలా జరిగింది ? జైనుల (Jain community) సంప్రదాయంలోని ఎంతో ముఖ్యమైన ఆదినాథుని లడ్డూ సమర్పణ కార్యక్రమంలో దుర్ఘ‌ట‌న‌ చోటు ...
Maharashtra | ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు… మ‌హారాష్ట్ర‌లో విషాదం
Crime

Maharashtra | ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు… మ‌హారాష్ట్ర‌లో విషాదం

మహారాష్ట్ర (Maharashtra)లోని బండారా (Bhandara) జిల్లాలో ఉన్న‌ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (Ordnance Factory)లో పేలుడు ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఇవాళ జ‌రిగిన ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్ తీవ్రంగా దెబ్బతింది. పేలుడు (Explosion) తీవ్రతకు పకప్పు కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 12 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా మిగతా 10 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో యంత్రాంగం ఘటన స్థలానికి భారీ సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు, ఆంబులెన్స్‌లు చేరుకుని క్షతగాత్రులను ఆస్ప‌త్రికి తరలించాయి. జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనను పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం (SDRF) సిబ్బంది సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సాంకేతిక పరికరాలు ఉపయోగించి దెబ్బతిన...
Police Encounter : ఎన్‌కౌంటర్‌ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో సహా నలుగురు హతం..
Crime

Police Encounter : ఎన్‌కౌంటర్‌ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో సహా నలుగురు హతం..

UP Police Encounter News : ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF )తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుడితోపాటు అతని ముగ్గురు స‌హ‌చ‌రులు హ‌త‌మ‌య్యారు. సద‌రు గ్యాంస్ట‌ర్ పై ఇప్ప‌టికే లక్ష రూపాయల రివార్డు ఉంది. ఈ మేరకు మంగళవారం అధికారులు మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. సోమవారం, మంగళవారం మధ్య రాత్రి షామ్లీలోని జింఝానా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక STF ఇన్‌స్పెక్టర్‌కు కూడా అనేక బుల్లెట్‌లు తగిలి గాయాల‌పాల‌య్యారు. STF అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) అమితాబ్ యాష్ ఒక ప్రకటనలో, "సోమవారం అర్ద‌రాత్రి,STF మీరట్ బృందంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో, ముస్తఫా కగ్గా గ్యాంగ్ సభ్యుడు అర్షద్‌తోపాటు అతని ఇతర ముగ్గురు సహచరులు మంజీత్, సతీష్, మ‌రో గుర్తు తెలియ‌ని మృతిచెందారు. అడిష‌న‌ల్ డిజిపి అమితాబ్ యష్ మాట్లాడుతూ, “సహారన్‌పూర్‌లోని బెహత్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ...
Firing | అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి.. ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం వేళ క‌ల‌క‌లం
World, Crime

Firing | అమెరికాలో కాల్పులు.. తెలుగు విద్యార్థి మృతి.. ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం వేళ క‌ల‌క‌లం

Firing in America : అమెరికా (United States)లో మ‌రో ఘోరం జ‌రిగింది. దుండుగుల దాడిలో మరో తెలుగు విద్యార్థి బ‌ల‌య్యాడు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ ఈ ఘ‌ట‌న ఇవాల‌ చోటుచేసుకుంది. షింగ్టన్ డిసి(Washington DC)లో భారీ బందోబస్తు ఉన్న‌ సమయంలోనే హైద‌రాబాద్‌కు చెందిన యువ‌కుడిపై దుండ‌గులు కాల్పులు జ‌రప‌డం క‌ల‌క‌లం రేపింది. స్థిర ప‌డ‌తాడ‌ని అనుకుంటే.. హైదరాబాద్‌ చైతన్యపురి ప్రాంతానికి చెందిన కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవి తేజ 2022 మార్చిలో అమెరికా వెళ్లాడు. తన మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. తమ కొడుకు ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడతాడని తల్లి దండ్రులు ఆశించగా ఈ ఘ‌ట‌న వారిని తీవ్ర శోకాన్ని మిగిల్చింది. వాషింగ్టన్‌లో దుండగుల కాల్పుల్లో రవితేజ మృతి చెందాడ‌ని తెల‌వ‌డంతో ఆ కుటుంబ స‌భ్యుల‌తోపాటు బంధుమిత్రులు దిగ...
error: Content is protected !!