Mahabubabad : ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మహిళలకు గాయాలు ఐదుగురి పరిస్థితి విషమం
Accident in Mahabubabad : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట గ్రామంలోని పెద్దనగరం గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మహిళలు గాయపడగా, వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇతరులకు స్వల్పంగానే కానీ రక్తస్రావంతో కూడిన గాయాలు అయ్యాయి. బాధితులందరూ రోజువారీ కూలీ కార్మికులు, చెర్లపాలెం మరియు ఫతేపురం గ్రామాలకు చెందినవారు.. మిర్చి కోత పనికి ఆటోరిక్షాలో ప్రయాణిస్తున్నారు.
పదిహేడు మంది కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం (Tragic incident) చోటుచేసుకుంది. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వార...




