Sharon Raj murder case : ప్రియుడి హత్య కేసులో ప్రియురాలికి ఉరి శిక్ష.. కోర్టు సంచలన తీర్పు
Kerala Sharon Raj murder case : కేరళలో మూడేళ్ల క్రితం చోటు చేసుకున్న హత్య కేసులో తీర్పు వెలువడింది. ప్రియుడిని అంతం చేసిన ప్రియురాలికి ఉరి శిక్ష ఖరారైంది. తిరువనంతపురం నెయ్యట్టికార అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.బషీర్ ఈరోజు తీర్పును వెలువరించారు. ప్రియుడు షరోన్రాజ్ను హత్య చేసిన గ్రీష్మకు ఉరిశిక్ష విధించారు. మరో ప్రధాన నిందితుడైన ఆమె మేనమామ నిర్మల్ కుమారన్కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది.
ముందు ప్రేమ.. ఆ తర్వాత పగ
షరోన్ రాజ్ బీఎస్సీ రేడియాలజీ చదువుకుంటున్నప్పుడు గ్రీష్మతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య ఏడాది పాటు రిలేషన్షిప్ కొనసాగింది. అయితే.. గ్రీష్మ కుటుంబం వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో బ్రేకప్ చేసుకుందామని గ్రీష్మ కోరగా షరోన్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో తన తల్లి, మేనమామ సహకారంతో అతడిని హత్య చేస...




