Stampede | ఢిల్లీ రైల్వేస్టేషన్లో విలయం.. 18 మంది ప్రాణాలను బలిగొన్న తొక్కిసలాటకు కారణం ఏమిటి?
New Delhi Railway Station tragedy : మహాకుంభమేళాకు వచ్చిపోయే భక్తుల రద్దీ అకస్మాత్తుగా పెరగడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి ఘోర తొక్కిసలాట (New Delhi Railway Station Stampede ) జరిగిన విషయం తెలిసిందే.. రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 18 మంది మరణించగా, 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు సహా 18 మంది మరణించారు. ప్రమాదంపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని లోక్ నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆర్పిఎఫ్తో పాటు, ఎన్డిఆర్ఎఫ్ బృందం కూడా స్టేషన్కు చేరుకుంది. జనసమూహాన్ని నియంత్రించిన తర్వాత, ప్రత్యేక రైలును నడిపారు.
Stampede : తొక్కిసలాటకు కారణమేమిటి?
ఈ తొక్కిసలాటకు ముందు స్టేషన్లోని 14, 15 ప్లాట్ఫారమ్ల...




