Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం, వరుడితో సహా ఎనిమిది మంది దుర్మరణం
సంభాల్ : ఉత్తర్ప్రదేశ్లోని సంభాల్లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) జరిగింది. జెవానై గ్రామంలో పెండ్లి బృందంతో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఓ కళాశాల గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు (24) సహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులందరిని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెవానై కమ్యూనిటీ ఆరోగ్యకేంద్రానికి తరలించారు.
ప్రధాని మోదీ సంతాపం
కాగా, సంభాల్ (Sambhal)లో వరుడితో పాటు ఎనిమిది మంది మరణించిన ప్రమాదం (Road Accident)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని ఎక్స్ (x) లో పేర్కొన్నారు. మృతుల కు...