Sarkar Live

Crime

హైదరాబాద్‌లో ఘోరం : పిల్లల ముందే భార్యను తగలబెట్టిన భర్త.. అడ్డువచ్చిన కూతురిని కూడా మంటల్లోకి తోసి దారుణం!
Crime

హైదరాబాద్‌లో ఘోరం : పిల్లల ముందే భార్యను తగలబెట్టిన భర్త.. అడ్డువచ్చిన కూతురిని కూడా మంటల్లోకి తోసి దారుణం!

Hyderabad Nallakunta Murder Case : నగరంలోని నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గుండె తరుక్కుపోయే విషాద ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. క్రిస్మస్ పండుగకు ముందు రోజు (డిసెంబర్ 24) తెల్లవారుజామున ఒక వ్యక్తి తన భార్యను అతి కిరాతకంగా పిల్లల ముందే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ దారుణ ఘటనలో భార్య మరణించగా, తల్లిని కాపాడుకోవడానికి ప్రయత్నించిన చిన్నారికి గాయాలయ్యాయి. ప్రేమ వివాహం.. అనుమానంతో వేధింపులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు త్రివేణి (26), నిందితుడు వెంకటేష్ నల్గొండ జిల్లా హుజురాబాద్ నివాసితులు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి నరేష్, సాత్విక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా వెంకటేష్ తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను తరచుగా శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేసేవాడు. దీంతో త్రివేణి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయినప్పటికీ, వెంకటేష్ తన ప్రవర్తన మార్చుకుం...
Bus Accident | బస్సు – లారీ ఢీకొని చెలరేగిన మంటలు.. 13 మంది సజీవ దహనం!
Crime

Bus Accident | బస్సు – లారీ ఢీకొని చెలరేగిన మంటలు.. 13 మంది సజీవ దహనం!

చిత్రదుర్గ : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో గురువారం తెల్లవారుజామున అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి 48 (NH-48)పై ప్రైవేట్ బస్సు - లారీ పరస్పరం (Bus Accident) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో 13 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరు నుంచి శివమొగ్గకు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న 'సీ బర్డ్' (Sea Bird) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. హిరియూర్ సమీపంలోని గోర్లాతు గ్రామం వద్ద తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి వైపు వస్తున్న బస్సును ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంటల్లో చిక్కుకున్న వాహనాలు ఢీకొన్న వెంటనే రెండు వాహనాల్లో భారీగా మంటలు చెలరేగాయి. బస్సులో గాఢనిద్రలో ఉన్న ప్రయాణ...
Road Accident | ఘోర బస్సు ప్రమాదం.. చింతూరు ఘాట్‌లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది మృతి
Crime, AndhraPradesh

Road Accident | ఘోర బస్సు ప్రమాదం.. చింతూరు ఘాట్‌లో బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. 15 మంది మృతి

Alluri Sitarama Raju Road Accident | అల్లూరి జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాజుగారిమెట్టు వద్ద ప్రమాదం ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తోంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని రాజుగారిమెట్టు మలుపు వద్దకు రాగానే, బస్సు అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ సహా 37 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులుగా గుర్తించారు. బస్సు కూడా చిత్తూరు జిల్లా రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్టు సమాచారం. ప్రమాద తీవ్రత దృష్ట్యా, ఘటనా స్థలం వద్ద ...
ఇంటిని చూసుకోమంటే ‘ఊడ్చేశారు’.. హైద‌రాబాద్‌లో Nepali Gang హ‌ల్‌చ‌ల్
Crime

ఇంటిని చూసుకోమంటే ‘ఊడ్చేశారు’.. హైద‌రాబాద్‌లో Nepali Gang హ‌ల్‌చ‌ల్

Hyderabad Nepali Gang Theft | హైద‌రాబాద్ న‌గ‌రంలోని మ‌ల‌క్‌పేట‌లో ఓ నేపాలి గ్యాంగ్ హ‌ల్‌చ‌ల్ చేసింది. వ్యాపారి (Businessman) ఇంట్లోంచి పెద్ద‌ మొత్తంలో బంగారు ఆభ‌ర‌ణాలు, న‌గదు, విలువైన వ‌స్తువులు అప‌హ‌రించి ఉడాయించింది. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి ప‌నులు చూసుకోవ‌డంతోపాటు సెక్యూరిటీగా ఉన్న దంప‌తులే (Couple of Nepalis) మ‌రికొంద‌రితో క‌లిసి ఆ చోరీకి పాల్ప‌డ్డారు. ఇంటి మ‌నుషుల్లా చూసుకున్నా.. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. మ‌ల‌క్‌పేటలో నివ‌సించే వ్య‌పారి ఇంటి ప‌నుల (Domestic work) నిమిత్తం కొంత‌కాలం క్రితం నేపాలి దంప‌తుల‌ (Couple of Nepalis)ను ఉద్యోగంలో పెట్టుకున్నాడు. సెక్యూరిటీగా ఉంటూ ఇంటి ప‌నులు చూసుకొనే ఈ భార్యాభ‌ర్త‌లు కొన్ని రోజుల్లోనే య‌జ‌మానిని ప్ర‌స‌న్నం చేసుకున్నారు. ఎంతో న‌మ్మ‌కంగా ఉంటూ వ‌చ్చిన ఆ నేపాలి దంపతులను య‌జ‌మాని కుటుంబం త‌న ఇంటి మ‌నుషుల్లా చూసుకొన...
కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌- ఒక‌రి మృతి – Gram panchayat elections
State, Crime

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌- ఒక‌రి మృతి – Gram panchayat elections

Gram panchayat elections - Violent clash : పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ సూర్య‌పేట (Suryapet) జిల్లా నూత‌న్‌క‌ల్ మండ‌లంలోని లింగంప‌ల్లి (Lingampalli village)లో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ ( BRS) శ్రేణుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో బీఆర్ఎస్ కార్య‌క‌ర్త ఒక‌రు ప్రాణాలు కోల్పోగా ప‌లువురు గాయ‌ప‌డ్డారు. పోలింగ్‌కు ముందు రోజు ఈ హింసాత్మ‌క సంఘ‌ట‌న (violent clash) జ‌ర‌గ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. చిన్న‌పాటి గొడ‌వ మొద‌లై.. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంప‌ల్లిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు (Gram panchayat elections) తొలి విడ‌త (డిసెంబ‌రు 11) జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో గ్రామంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చిన్న‌పాటి గొడ‌వ‌గా మొద‌లై మాటామాట పెరిగి ఒక్క‌సారిగా ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. సుమారు 70 మంది కాంగ్రెస్, బీఆర్ఎ...
error: Content is protected !!