Sarkar Live

Crime

Ibomma Piracy Racket : 65 మిర్ర‌ర్ సైట్లు, 21 వేల సినిమాలు… రూ.20 కోట్ల అక్రమ సంపాదన!
Cinema, Crime

Ibomma Piracy Racket : 65 మిర్ర‌ర్ సైట్లు, 21 వేల సినిమాలు… రూ.20 కోట్ల అక్రమ సంపాదన!

Ibomma Piracy Racket | తెలుగు సినీ పరిశ్రమను ఎన్నో సంవత్సరాలుగా వేదిస్తున్న పైరసీ రాకెట్‌ను ఛేదించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ((CP Sajjanar) ) వెల్లడించారు. ఐబొమ్మ (Ibomma) వెబ్‌సైట్‌ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని అరెస్ట్ చేయడం ద్వారా పరిశ్రమకు ఎంతో ఊర‌ట క‌లిగింద‌ని పేర్కొన్నారు. ఇప్పటికే రవిపై ఐటీ యాక్ట్‌, కాపీరైట్ యాక్ట్‌ కింద నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సినీ పెద్దలు చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, సురేశ్‌ బాబుతో పాటు దర్శకుడు రాజమౌళి సీపీ సజ్జనార్‌తో సోమ‌వారం భేటీ అయ్యారు. అనంతరం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్‌, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశామ‌న్నారు. ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం క‌లిగించాడ‌ని, పైరసీ (Ibomma Piracy Racket) ద్వారా చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమ...
Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర ప్ర‌మాదం- 43 మంది మృతి
Crime, World

Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర ప్ర‌మాదం- 43 మంది మృతి

మృతుల్లో 10 మంది హైద‌రాబాదీలు Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలకు విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌కు చెందిన సుమారు 10 మంది (Hyderabad residents killed) మరణించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఒప్పంద పనుల కోసం, లేదా వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లిన హైదరాబాద్‌ వాసులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవ‌డంతో వారి కుటుంబాలు కన్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నాయి. సౌదీ రోడ్లపై ట్రాఫిక్ తీవ్రంగా ఉండటం, అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణించే బస్సులు ఎక్కువ వేగంతో నడపడం వంటివి ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ ఘటన కూడా అలాంటి వేగం లేదా సాంకేతిక లోపం వల్ల జరిగిందా? అనే విషయంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బస్సు పూర్తిగా ధ్వంసమైపోవడంతో రక్షణ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. Saudi highway...
Delhi Blast | ఢిల్లీ కారు పేలుళ్ల ఘ‌ట‌న‌.. కారులో ఉన్న‌ది ఎవ‌రు?
Crime, National

Delhi Blast | ఢిల్లీ కారు పేలుళ్ల ఘ‌ట‌న‌.. కారులో ఉన్న‌ది ఎవ‌రు?

Delhi Blast News updates : నిన్న రాత్రి దేశ రాజధానికి ఒక పీడకల. ఢిల్లీ న‌గ‌రానికి గుండెగా భావించే చాందినీ చౌక్, జనపథ్, రాజీవ్ చౌక్ వంటి ప్రాంతాలకు సమీపంలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడులో ఉపయోగించిన తెలుపు రంగు గ‌ల‌ హ్యుందాయ్ ఐ20 కారు పుల్వామాకు చెందిన వైద్యుడిదని దర్యాప్తు అధికారులు గుర్తించారు, దీనితో సెంట్రల్ ఢిల్లీలో జరిగిన దాడికి, అదే రోజు ఫరీదాబాద్‌లో జరిగిన దాడికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. కారులో ఉన్న‌ది ఎవ‌రు? కారు ప్రస్తుత యజమాని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌గా గుర్తించారు. సోమవారం ఫరీదాబాద్‌లో జరిగిన దాడికి ముందు అరెస్టు చేసిన ఇద్దరు వైద్యుల మాదిరిగానే ఆయనకు కూడా ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధం ఉందని ఒక సీనియర్ అధికారి జాతీయ మీడియాకు వెల్ల‌డించారు. తాజా నివేదికల ప్రకారం, పుల్వామాలోని అతని కుటుంబ సభ్యులు, అతని తల్లి, సోదరుడిని...
Bus Fire | నల్లగొండలో దగ్ధ‌మైన ప్రైవేట్ బస్సు
Crime, Nalgonda

Bus Fire | నల్లగొండలో దగ్ధ‌మైన ప్రైవేట్ బస్సు

Bus Fire in Nalgonda | ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు రోడ్లపై ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇటీవలే క‌ర్నూలులో వేమురి కావేరి ట్రావెల్స్‌ బస్సు దుర్ఘటనలో 19 మంది సజీవ దహనమైన ఘటన (Kurnool Bus Fire) మరిచిపోకముందే, మళ్లీ ఇలాంటి ఘటనే న‌ల్ల‌గొండ‌లో చోటుచేసుకుంది. ఈసారి విహారి ట్రావెల్స్‌ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ, అందులో ఉన్న ప్రయాణికులు సమయానికి తేరుకొని బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికుల‌ సమాచారం ప్రకారం.. విహారి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి కందుకూరు వైపు వెళ్తోంది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా బస్సు వెనుకభాగంలో మంటలు చెలరేగాయి. బస్సులో పొగలు వ్యాపించడంతో డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తమై అందరు 29 మంది ప్రయాణికులను వెంటనే కిందకు దింపారు. క్షణాల్లో మంటలు వ్...
చీమలకు భయపడి మహిళ ఆత్మహత్య ‌‌ – Sangareddy
Crime, Viral

చీమలకు భయపడి మహిళ ఆత్మహత్య ‌‌ – Sangareddy

Sangareddy | ఓ మహిళ మానసిక సమస్యలతో బాధపడుతూ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అత్యంత అరుదైన ఘటన అందరినీ కలచివేసింది. చీమల ఫోబియాతో (Myrmecophobia) ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy district) అమీన్‌పూర్ లో నివసిస్తున్న గృహిణి మనీషా, ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వదిలిన సూసైడ్ నోట్‌లో “నాకు చీమలంటే చాలా భయం.. ఆ భయం నన్ను చంపేస్తోంది. నా కూతురిని జాగ్రత్తగా చూసుకోండి” అని రాసి ఉంది. ఈ లేఖను చూసిన కుటుంబ సభ్యులు, పోలీసులు, ఇరుగుపొరుగువారు షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చీమల పట్ల భయం అనేది ఓ చిన్న విషయం. అయితే దీనికేగా ఆమె ప్రాణం తీస్తుకుంటుందని ఎవరూ ఊహించలేదు. గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాద సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు సంఘటనా స్థల...
error: Content is protected !!