Sarkar Live

Crime

GHMC | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ
Crime

GHMC | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

ACB Raids in GHMC | రాష్ట్రంలో ఏసీబీ అధికారుల దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అంద‌గానే త‌క్ష‌ణ‌మే అధికారులు రంగంలోకి దిగి ప‌క్కా ప్లాన్ తో అవినీతి అధికారుల‌ను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకుంటున్నారు. తాజాగా అంబర్ పేట జీహెచ్ఎంసీ (GHMC ) లో ఏఈ మనీషా.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వ‌ల‌కు చిక్కింది. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేయడంతో ఇప్పటికే 5 వేల రూపాయలు ఇచ్చిన స‌ద‌రు కాంట్రాక్టర్. ఒప్పందం ప్రకారం మరో రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయటంతో విసిగిపోయాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించ‌డంతో అధికారులు రంగంలోకి దిగారు. బాధితుని ఫిర్యాదుతో నిఘా ఉంచి జీహెచ్ఎంసీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు సరిగ్గా లంచం తీసుకుంటున్న సమయంలో ఏఈ మనీషాను పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌డుతున్నారు. ఇలా ఫిర్యాదు చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంద...
ACB | తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆపరేటర్
Crime

ACB | తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆపరేటర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ కార్యాలయంలో(టైపిస్ట్ )కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సిహెచ్.నవక్రాంత్ బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టబడ్డాడు. నవక్రాంత్ రేషన్ కార్డ్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి ప్రాసెస్ చేయడానికి రూ.4 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రూ.2500 బాధితుల వద్ద నుంచి నవక్రాంత్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telan...
ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎస్ఈ
Crime

ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఎస్ఈ

Warangal News : మహబూబాబాద్ జిల్లా (Mahaboobabad District) కేంద్రంలో విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేష్‌ను ఏసీబీ అధికారులు (ACB offiicals) అరెస్టు చేశారు. కురవి, మరిపెడ మండలాల్లో విద్యుత్ నిర్మాణ పనులను కొనసాగించేందుకు అనుమతి కోసం కాంట్రాక్ట‌ర్ నుంచి రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా ఆయన‌ను అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నరేష్‌ను ఆయ‌న‌ ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ చేపట్టారు.స్థానిక హస్తినాపురం కాలనీలో విద్యుత్ అధికారి నరేష్ ఏసీబీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. 80 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు నరేష్. దీంతో నరేష్ ఇంట్లో ఎసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. నరేష్ పట్టుబడటంతో అతడి ఇంట్లో కూడా ముమ్మ‌రంగా సో...
Maoists Encounter | మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ‌
Crime

Maoists Encounter | మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ‌

పార్టీ అగ్ర‌నేత గాజర్ల రవి హ‌తం రవి పై 25 లక్షల రివార్డు Alluri District : మావోయిస్టు పార్టీకి మ‌రో ఎదురు దెబ్బ త‌గిలింది. అగ్ర‌నేత‌లు ఒక్కొక్క‌రుగా ఎన్‌కౌంట‌ర్ (Maoists Encounter) లో హ‌త‌మ‌వుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయంలో పీపుల్స్ వార్ పార్టీతో జరిపిన చర్చ కమిటీ ప్ర‌తినిధి, మావోయిస్టు పార్టీ ఏఓబి ప్రత్యేక కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ ఆలియాస్ ఉదయ్ బుధ‌వారం ఉద‌యం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మృతి చెందారు. దీంతో అత‌డి ఉద్య‌మంలో 33 ఏళ్ల అజ్ఞాతప్రస్థానం ముగిసిన‌ట్ల‌యింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో బుధవారం తెల్లవారుజామున ఎన్‌కౌంట‌ర్‌లో భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి మృతి చెందాడు. ఆయనతోపాటు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల...
ACB | ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ ..
Crime

ACB | ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఏఈ ..

రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు లంచం తీసుకుంటూ ఏఈ అవినీతి నిరోధక శాఖ (ACB )కి చిక్కారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) కాప్రా సర్కిల్‌ చర్లపల్లి డివిజన్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్ విభాగం AE ) స్వరూపను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాను చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని నగరానికి చెందిన కాంట్రాక్టర్‌ ఏఈ స్వరూపను కోరారు. అయితే బిల్లులు చెల్లించేందుకు ఏకంగా రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్ ను డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక స‌ద‌రు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా (Rangareddy District) ఏసీబీ యూనిట్‌ ఆధ్వర్యంలో ప‌క్కా ప్లాన్ ప్రకారం బాధితుడి నుంచి ఏఈ స్వరూప లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఈ స్వరూపను ...
error: Content is protected !!