GHMC | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ
ACB Raids in GHMC | రాష్ట్రంలో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితుల నుంచి ఫిర్యాదు అందగానే తక్షణమే అధికారులు రంగంలోకి దిగి పక్కా ప్లాన్ తో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. తాజాగా అంబర్ పేట జీహెచ్ఎంసీ (GHMC ) లో ఏఈ మనీషా.. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కింది. బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేయడంతో ఇప్పటికే 5 వేల రూపాయలు ఇచ్చిన సదరు కాంట్రాక్టర్. ఒప్పందం ప్రకారం మరో రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయటంతో విసిగిపోయాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు.
బాధితుని ఫిర్యాదుతో నిఘా ఉంచి జీహెచ్ఎంసీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు సరిగ్గా లంచం తీసుకుంటున్న సమయంలో ఏఈ మనీషాను పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
ఇలా ఫిర్యాదు చేయండి
ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంద...