మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు — 44 ఏళ్ల అజ్ఞాత జీవనానికి ముగింపు – Mallojula Venugopal Rao
Mallojula Venugopal Rao : మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల రావు అలియాస్ సోను అలియాస్ భూపతి అలియాస్ అభయ్ అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. బుధవారం తన 60 మంది మావోయిస్టు సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. మల్లోజుల వేణుగోపాల్, ఆయన బృందాన్ని సీఎం ఫడ్నవీస్ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. దాదాపు మావోయిస్టు పార్టీ రెండో అగ్రస్థానంలో ఉన్న మల్లోజుల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి భారీ నష్టంగా భావిస్తున్నారు.
మరోవైపు మావోయిస్టు పార్టీ వైఖరితో అసంతృప్తి వ్యక్తంచేస్తూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్నారు. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుని విప్లవోద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మల్లోజులపై దాదాపు వందకు పైగా కేసులు కూడా ఉన్నాయి. మల్లోజులపై రూ.6 కోట్ల రివార్డ...




