Corona Virus | భారత్లో కరోనా మళ్లీ కలవరం 24 గంటల్లో 564 కొత్త కేసులు
Corona Virus | భారత్ లో మరోసారి కరోనా వైరస్ (COVID-19) ప్రభావం కనిపిస్తోంది. ఇటీవల రోజువారీ కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. గత 24 గంటల్లో 564 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 2025లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,866కి చేరింది.
రాష్ట్రాల వారీగా కేసుల వివరాలు:
కేరళ – 1,487 కేసులు
ఢిల్లీ – 562 కేసులు
పశ్చిమ బెంగాల్ – 538 కేసులు
మహారాష్ట్ర – 526 కేసులు
గుజరాత్ – 508 కేసులు
కర్ణాటక – 436 కేసులు
తమిళనాడు – 213 కేసులు
Corona Virus : పెరుగుతున్న మరణాలు..
గత 24 గంటల్లో 7 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఇందులో ఢిల్లీలో ఒక చిన్నారి సహా ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ముగ్గురు మరణించారు. దీంతో 2025లో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 51కి పెరిగింది. కాగా, ఇప్పటివరకు 3,955 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రజల...


