Sarkar Live

National

SIR : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ?
National

SIR : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ?

New Delhi : ఓటర్ల జాబితా సవరణ (SIR) గురించి బ్రేకింగ్ న్యూస్ వ‌స్తున్నాయి.. కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 10న దిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో, బీహార్ తర్వాత దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో SIR నిర్వహించడం గురించి చర్చ ఉంటుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అధికారికంగా దీని గురించి తన ఉద్దేశాన్ని ప్ర‌క‌టించింది. బీహార్‌లో జరుగుతున్న SIR (Special Intensive Revision) గురించి సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కూడా కమిషన్ దీని గురించి సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ 10న దిల్లీలో కీల‌క‌ సమావేశం టైమ్స్ నౌ నవభారత్ కు అందిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య ఎన్నికల అధికారుల సమావేశం సెప్టెంబర్ 10న ఢిల్లీలోని ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో జరుగుతుంది. ...
Landslide | జమ్మూలో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి
National

Landslide | జమ్మూలో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి

Landslide in Jammu Kashmir | జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రాలో మాతా వైష్ణో దేవి యాత్ర ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడటం (Landslide) తో బుధ‌వారం ఉద‌యం 30 మంది మృతి చెందగా, 23 మంది గాయపడ్డారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళ‌న చెందుతున్నారు. జమ్మూ కాశ్మీర్ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరదలు ఉదృత‌మ‌వ‌డంతో కొండచరియలు విరిగిపడిపోతున్నాయి. జమ్మూలో, కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, వంతెనలు కూలిపోయాయి, విద్యుత్ లైన్లు మొబైల్ టవర్లు కూలిపోయాయి. మంగళవారం ఉదయం 11.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య జమ్మూలో అత్యధిక వర్షపాతం నమోదైంది, అధికారిక సమాచారం ప్రకారం కేవలం ఆరు గంటల్లోనే 22 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అయితే, అర్ధరాత్రి తర్వాత వర్షపాతం తగ్గడంతో కొంత ఉపశమనం కలిగించింది. అంతకుముందు, మంగళవారం మధ్యాహ్నం పుణ్యక్షేత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడ్...
Lok Sabha | తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధం?
National

Lok Sabha | తీవ్రమైన నేరారోపణలపై అరెస్టయిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తొలగించేందుకు రంగం సిద్ధం?

లోక్‌సభ (Lok Sabha) లో బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం న్యూఢిల్లీ: పాలనలో జవాబుదారీతనాన్ని పెంచే దిశగా కేంద్రం కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు అయిన లేదా జైలుకు వెళ్లిన ఏ ప్రధానమంత్రి (PM) అయినా, కేంద్ర మంత్రి లేదా సహాయ మంత్రి (MoS) ను ప‌ద‌వి నుంచి తొలగించేందుకు లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టున్న‌ట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 30 రోజులు పాటు జైలుకెళితే.. వెంటనే తొలగింపు కనీసం ఐదేళ్లు జైలు శిక్ష విధించదగిన నేరాలల‌కు పాల్ప‌డి అరెస్టు అయి వరుసగా 30 రోజులు నిర్బంధించబడిన ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రి అయినా 31వ రోజున తమ పదవులను కోల్పోనున్నారు. దీని ద్వారా ఉన్నత స్థాయి ప్రభుత్వ పాల‌కుల‌ను జవాబుదారీగా ఉంచేలా ఈ బిల్లు రూపొందించబడింది. అయితే, చట్టపరమైన ప్రక్రియకు లోబడి, అటువంటి అధికారులు కస్టడీ నుంచి విడుదలైన తర్వాత వారిని తిరిగి ...
Floods :  వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన ఫ్యామిలీ
National

Floods : వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన ఫ్యామిలీ

మహారాష్ట్రలోని ఉద్గిర్ సమీపంలో వరద (Floods) ల్లో తెలంగాణకు చెందిన ఫ్యామిలీ గల్లంతయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోవడం కలకలం రేపింది. మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం, పిల్లలూ జాగ్రత్త అంటూ చివరి ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత స్విచ్ఛాప్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు ఆచూకీ వెంటనే గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన ఐదుగురితో పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ వాహనాన్ని నడుపుతుండగా ఆగస్ట్ 17న అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరద నీటిలో కొట్టుకుపోయింది. మహారాష్ట్రలోని ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉద్గిర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా, గల్లంతైన వారిలో అఫ్రీనా, హసీనా, సమీనా, ఆఫ్రీన్, సోహెబ్ అనే యువకుడు, మహారాష్ట్ర కు చెందిన కారు డ్రైవ...
ECI |  నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు.. తెలంగాణ నుంచి 9 పార్టీలు
National

ECI | నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు.. తెలంగాణ నుంచి 9 పార్టీలు

- రెండోదశలో 476 పార్టీలను గుర్తించిన ఈసీ న్యూదిల్లీ :  ‌చట్టబద్ధత, నిబంధనలు పాటించని రాజకీయ పార్టీలపై ఈసీ (ECI) కఠిన చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇటీవల 334 పార్టీలను రద్దు చేసిన ఈసీఐ.. తాజాగా రెండో రౌండ్‌లో మరో 476 పార్టీలను గుర్తించి.. వాటిపై వేటు వేసేందుకు ప్రక్రియను మొదలుపెట్టింది. ఈసీ గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉండగా.. తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని రాజకీయ పార్టీలను గుర్తించి, జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడిం...
error: Content is protected !!