Sarkar Live

National

Bus Accident : ఎదురెదురుగా ఢీకొన్న ప్రభుత్వ బస్సులు.. చిన్నారితో సహా 11 మంది మృతి
National

Bus Accident : ఎదురెదురుగా ఢీకొన్న ప్రభుత్వ బస్సులు.. చిన్నారితో సహా 11 మంది మృతి

Tamil Nadu Bus Accident | శివగంగ (తమిళనాడు) : తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు సమీపంలో ఆదివారం సాయంత్రం రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా 11 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు ధ్రువీకరించారు. అనేక మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన స్పందించిన స్థానికులు తిరుప్పూర్ నుంచి కరైకుడికి ఒక బస్సు, కరైకుడి నుంచి దిండిగల్‌కు మరొక బస్సు ప్రయాణిస్తుండగా, తిరుపత్తూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంట‌నే స్పందించి క్ష‌త‌గాత్రుల‌కు అవ‌స‌ర‌మైన సాయం అందించారు. గాయపడిన వారిని హుటాహుటిన శివగంగైలోని ప్రభుత్వ హాస్పిట‌ల్‌కు తరలించారు. ఆ తర్వాత స్థానిక యంత్రాంగం, పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాయి. కొంతమంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నందున...
National

Delhi Blast Case : టెర్రర్ మాడ్యూల్‌ దర్యాప్తులో సంచ‌ల‌న‌ విష‌యాలు..

Delhi Blast Case | దిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి బయటపడిన ఫరీదాబాద్‌ వైట్ కాలర్ టెరర్ మాడ్యూల్ కేసులో దర్యాప్తు శ‌ర‌వేగంగా సాగుతోంది. టెర్రర్ మాడ్యూల్ సభ్యులు అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని మౌల్వీ ఇష్తియాక్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇష్తియాక్ మాత్రం అరెస్ట‌యిన ఉగ్రవాదులు తనకు బకాయిగా ఉన్న అద్దె ఇవ్వాలని పదే పదే కోరడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తీవ్రతగల కేసు ఉన్నప్పటికీ, ఆయనకు కేవలం కిరాయి అంశమే ముఖ్యమైందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కీలక నిందితుడు డాక్ట‌ర్‌ ముజమ్మిల్‌ను అరెస్టు చేసి విచారించినప్పుడు మొదటిసారిగా ఇష్తియాక్‌ పేరు బయటపడింది. ముజమ్మిల్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఫరీదాబాద్‌లోని అద్దె ఇంటిపై దాడి చేసి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలకు సంబంధించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటి యజమాని, హర్యాణా మేవాత్‌కు చెంద...
Justice Suryakant | సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. 24న స‌రికొత్త త‌ర‌హాలో ప్ర‌మాణ స్వీకారం..
National

Justice Suryakant | సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌.. 24న స‌రికొత్త త‌ర‌హాలో ప్ర‌మాణ స్వీకారం..

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నూత‌న‌ ప్రధాన న్యాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) సోమ‌వారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత CJI, BR గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. అయితే, మొదటిసారిగా, ఆరు దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు రాష్ట్రపతి భవన్‌లో జరిగే భారత కొత్త ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. కొత్త CJIగా జస్టిస్ సూర్యకాంత్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. CJI జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆరు దేశాల నుంచి డజనుకు పైగా న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు హాజరవుతారని బార్ & బెంచ్ నివేదించింది . భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి న్యాయవ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంత పెద్ద అంతర్జాతీయ ప్రతినిధి బృందం హాజరు కావడం ఇదే మొదటిసారి...
ED Raids | బొగ్గు మాఫియాపై ED భారీ ఆపరేషన్: రెండు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంగణాల్లో దాడులు
National

ED Raids | బొగ్గు మాఫియాపై ED భారీ ఆపరేషన్: రెండు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రాంగణాల్లో దాడులు

ED Raids in Jharkhand and West Bengal | జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో ED దాడులు: అక్రమ బొగ్గు తవ్వకాలు, మనీలాండరింగ్ కేసులపై కఠినంగా వ్యవహరిస్తోంది. శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆక‌స్మిక దాడులు ప్రారంభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ( PMLA ) కింద ఈ ఆప‌రేష‌న్ నిర్వహిస్తున్నారు, రెండు రాష్ట్రాల్లోని 40 కి పైగా ప్రాంగణాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ బొగ్గు దొంగతనం, అక్రమ రవాణాకు సంబంధించిన ప్రధాన కేసులతో ముడిపడి ఉంది. ఇవి ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించాయి. ED Raids : జార్ఖండ్‌లో 18 చోట్ల దాడులు శుక్రవారం తెల్లవారుజామున ధన్‌బాద్‌లో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది. బొగ్గు వ్యాపారి ఎల్.బి. సింగ్ నివాసం అతని అనుబంధ సంస్థలపై ED ఏకకాలంలో దాడులు నిర్వహించింది. దేవ్ బిల్డా ప్రాంతంతో సహా ధన్‌బాద్‌లోని దాదాపు 18 ప్రదేశాలలో ED బృందాలు చురుగ్...
Delhi High Alert |  ఢిల్లీలో హై అలర్ట్ – మ‌రో కారు కోసం పోలీసుల‌ వేట
National

Delhi High Alert | ఢిల్లీలో హై అలర్ట్ – మ‌రో కారు కోసం పోలీసుల‌ వేట

Delhi News High Alert : న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఘోర కారు పేలుడుతో సంబంధం ఉందని భావిస్తున్న మ‌రో ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌ వాహనం కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, చెక్‌పోస్టులు, సరిహద్దు ప్రాంతాలు హై అలర్ట్‌లో వున్నాయి. పేలుడులో ఉపయోగించిన హ్యుందాయ్‌ i20 కారుతో పాటు, నిందితులు ఈ ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ వాహనాన్ని కూడా ఉపయోగించినట్లు పోలీసుల‌ దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఐదు ప్రత్యేక ఢిల్లీ పోలీసు బృందాలు వాహనాన్ని వెతుకుతుండగా, ఉత్తరప్రదేశ్‌, హర్యానా పోలీసులకు కూడా ఈ సమాచారం అందించారు. సోమవారం సాయంత్రం ఎర్ర‌కోట‌ మెట్రో స్టేషన్ గేట్ నంబర్​ 1 సమీపంలో జరిగిన ఈ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. హ్యుందాయ్‌ i20 కారు ఒక్కసారిగా మంటలు అంటుకుని భీరకమైన పేలుడు సంభవించింది. సమీపంలోని అనేక ...
error: Content is protected !!