Nagoba Jatara | గిరిజన సంస్కృతికి అద్దం పట్టే నాగోబా జాతర.. దీని విశేషాలు ఎంటో తెలుసా..?
Nagoba Jatara : తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ (Adilabad district) జిల్లా కేస్లాపూర్ గ్రామంలో జరిగే ఒక మహా గిరిజన ఉత్సవం నాగోబా జాతర. ఇది గోండు తెగలకు సంబంధించిన వేడుక ఇది. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య రోజు ఎంతో వైభవంగా దీన్ని నిర్వహిస్తారు. తెలంగాణ (Telangana)లో జరిగే గిరిజన ఉత్సవాల్లో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద ఉత్సవంగా నాగోబా జాతర ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవంలో గోండు తెగలకు చెందిన మేస్రం వంశీయులు ప్రధాన భక్తులుగా ఉంటారు.
అత్యంత వైభవంగా కొనసాగుతున్న నాగోబా జాతర
నాగోబా జాతర మంగళవారం (2025 జనవరి 28) అర్ధరాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 4 వరకు కొనసాగనుంది. ఈ జాతరలో ప్రధాన ఘట్టమైన దర్బార్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క హాజరుకానున్నారు.
Nagoba Jatara విశేషాలు
ప్రతి ఏడాది జనవరిలో నిర్వహించే ఈ మహా ఉత్...




