Sarkar Live

State

KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి
State, Hyderabad

KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై (Revanth Govt) క్షేత్రస్థాయిలో పోరాాటాలకు సిద్ధంకావాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పిలుపునిచ్చారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం (జులై 29) బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ సమావేశమయ్యారు. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గమని అన్నారు. ఇక్కడ చంద్రబాబు..అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం తహతహ లాడుతున్నాడని, దీనిని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు దగ్గరపడుతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కన్నేపల్లి పంప్ హ...
HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు
State, Hyderabad

HYDRAA : మూసీ నది ఆక్రమణలపై కొరడా – షెడ్లు, షాపుల తొలగింపు

మూసపేటలో ఆక్రమణల నుంచి పార్కుకు విముక్తి పార్కు స్థలంలో కబ్జాలు తొలగించిన హైడ్రా హైదరాబాద్ (Hyderabad) లోని మూసీ నది (Musi River)లో ఆక్రమణలను హైడ్రా (HYDRAA) తొలగించింది. మూసీ పరీవాహక ప్రాంతంలోని చాదర్ ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా హాస్పిటల్ వరకు పలు అక్రమ నిర్మాణాలను మంగళవారం హైడ్రా నేలమట్టం చేసింది. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ల నుంచి మూసీని ఆక్రమించి, పలు నిర్మాణాలు చేపట్టారు. వాటిని ప్రయివేట్ బస్సులకు, లారీలకు కిరాయికి ఇస్తున్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్నట్టు స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో మూసీ ప్రాంతంలో విచారణ చేపట్టిన అధికారులు, ఆక్రమణలు నిజమేనని నిర్ధారించారు.మంగళవారం ఉదయం నుంచి పోలీసు భారీ బందోబస్తు మధ్య మూసీలో తిష్టవేసిన షెడ్డులను తొలగించారు. ఇలా ఉండగా న‌గ‌రంలోని మూసాపేట ఆంజ‌నేయ న‌గ‌ర్‌లో అక్...
TGSRTC | ప్రయాణికుల‌కు టీజీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌..
State

TGSRTC | ప్రయాణికుల‌కు టీజీఎస్ ఆర్టీసీ బంప‌ర్ ఆఫ‌ర్‌..

హైదరాబాద్-విజయవాడ మార్గంలో RTC బస్సులకు భారీ డిస్కౌంట్లు! హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో రాకపోకలు సాగించేవారికి తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభ‌వార్త చెప్పింది. ఈ మార్గంలో ప్ర‌యాణించే బస్సుల్లో టికెట్‌ ధరలపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. కనీసం 16 శాతం నుంచి గరిష్ఠంగా 30శాతం వరకు టికెట్‌ ధరల్లో ప్రత్యేక ఆఫర్‌ ఇస్తున్నట్లు ‘ఎక్స్‌’లో ఓ పోస్టులో పేర్కొంది. దీని ప్రకారం.. గరుడ ప్లస్‌ బస్సుల్లో టికెట్‌ ధరపై 30శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది. అలాగే, సూపర్‌ లగ్జరీ, లహరి నాన్‌ ఏసీ బస్సుల్లో 20 శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16శాతం మేర త‌గ్గించిన‌ట్లు తెలిపింది. ఈ రాయితీలు ఆన్‌లైన్ తోపాటు ఆఫ్‌లైన్‌ బుకింగ్‌లకు సైతం వర్తించనున్నాయి. . అలాగే టికెట్లు అధికారిక వెబ్ సైట్ https://www.tgsrtcbus.in/ లో బుక్ చేసుకోవాలని రెండు నగరాల మధ్య ప్రయాణికుల్ని ఆర్టీసీ సూచించింద...
Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!
warangal, State

Warangal Collectorate | 25 నెలలుగా నత్తనడకే!

వరంగల్ కలెక్టరేట్ నిర్మాణం పూర్తయ్యేదెన్నడు? Warangal Collectorate | వరంగల్ నగర ప్రజల అభివృద్ధికి మూలస్తంభంగా నిలవాల్సిన కలెక్టరేట్ భవనం ఇప్పటికీ పూర్తి కావడం లేదు. 2023 జూన్ 17న ఈ సమీకృత జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇప్పటికే 25 నెలలు గడుస్తున్నా, పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించడంలేదు. ప్రతిరోజూ పనులు జరిగినట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఆశించినంత వేగం లేదు. దీంతో స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఈ సమీకృత భవన నిర్మాణ పనులు జాప్యం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ జిల్లాలోని ప్రజల అభివృద్ధి కలలన్నీ కొలువుదీరే కేంద్రంగా ఆశించిన కొత్త కలెక్టరేట్ భవనం ఇప్పటికీ ‘పూర్తి’ రూపం దాల్చకపోవడం స్థానికులను కలవరపెడుతోంది.అధికారికంగా నిర్మాణం ప్రారంభించి 25 నెలలు గడుస్తున్నా పనుల పురో...
Mamnoor Airport | వరంగల్​ విమానాశ్రయ నిర్మాణంలో కీలక అడుగు
State, warangal

Mamnoor Airport | వరంగల్​ విమానాశ్రయ నిర్మాణంలో కీలక అడుగు

భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల గ్రేటర్ వరంగల్ (Warangal)లోని మామునూరు విమానాశ్రయం (Mamnoor Airport) నిర్మాణంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.205 కోట్లు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మామునూరు వద్ద కొత్త బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రాం​మోహన్​ నాయుడు ఈ మార్చిలో అనుమతిచ్చారు. ఈమేరకు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ (ఏఏఐ) నిర్మాణం ప్రారంభించడానికి వీలుగా సంబంధిత ప్రతిపాదనపై సంతకం కూడా చేశారు. మరో 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే కొత్త విమానాశ్రయ (Mamnoor Airport) నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి రాం​మోహన్​ నాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భూసేకరణ కోసం ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేయడంతో వరంగల్​ నగరవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలుగు వా...
error: Content is protected !!