Sarkar Live

State

Medaram Jatara 2026 : 3 కోట్ల మంది భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..
State, warangal

Medaram Jatara 2026 : 3 కోట్ల మంది భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..

మేడారం: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మ మహాజాతర–2026 (Medaram Jatara 2026) కు ములుగు జిల్లా మేడారం సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరగనున్న ఈ మహా వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మంత్రి సీతక్క మేడారంలోనే బస చేస్తూ, ప్రతి విభాగాన్ని నిశితంగా సమీక్షిస్తున్నారు. జాతరను సమర్థంగా నిర్వహించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించారు. 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులతో పాటు, 2,000 మంది ఆదివాసీ యువ వాలంటీర్లు సేవలందిస్తున్నారు.నెట్‌వర్క్ సమస్యలు తలెత్తకుండా 60 మొబైల్ టవర్లు (27 శాశ్వత, 33 తాత్కాలిక), 450 VHF సెట్లను ఏర్పాటు చేశారు. మేడారం జాతర 2026 - గణంకాలు అంశంవివరాలుభక్తుల అంచనాసుమారు 3 కోట్లువిధుల్లో సిబ్బంది42,027 మందిఆర్టీసీ బస్సులు4,000 (51,000 ట్రిప్పులు)మొబైల్ టవర...
Employees Insurance : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ భరోసా: రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా షురూ!
State, Hyderabad

Employees Insurance : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ భరోసా: రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా షురూ!

Telangana Govt Employees Insurance 2026 : ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని చాటిచెబుతూ, రెగ్యులర్ ఉద్యోగులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో భట్టి విక్రమార్క గారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారి వివరాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు: బీమా మొత్తం: రూ. 1.02 కోట్లు (ప్రమాదవశాత్తు మరణిస్తే).లబ్ధిదారులు: రాష్ట్రంలోని 5.14 లక్షల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు.రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో చర్చలు సఫలమయ్యాయి. జీతాల ఖాతాల (Salary Accounts) ఆధారంగా ఈ బీమా వర్తించనుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం గానీ, ఉద్యోగులు గానీ ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలోనే సింగరేణి మరియు విద్యుత్ సంస్థల్లో ఈ తరహా బీమాను ప్రభుత్వం ప్రారంభించింది. సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు. వి...
సంక్రాంతి 2026: హైదరాబాద్ ఆకాశంలో పతంగులు, బెలూన్లు, డ్రోన్ల విన్యాసాలకు సిద్ధం ‌‌ ‌‌- Kite Festival
Hyderabad

సంక్రాంతి 2026: హైదరాబాద్ ఆకాశంలో పతంగులు, బెలూన్లు, డ్రోన్ల విన్యాసాలకు సిద్ధం ‌‌ ‌‌- Kite Festival

International Kite Festival Hyderabad 2026 | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కేవలం వినోదానికే కాదు, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతికి పర్యాటకాన్ని ఒక ప్రధాన చుక్కానిగా మార్చుకుంటోంది. 2026 సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ షో, డ్రోన్ షోలను అత్యంత ఘ‌నంగా నిర్వహించడానికి సిద్ధ‌మైంది. ప్రధాన ఆకర్షణలు ఇవే.. గగనతల విన్యాసాలు: 19 దేశాల నుండి 40 మంది అంతర్జాతీయ, 15 రాష్ట్రాల నుండి 55 మంది జాతీయ పతంగుల నిపుణులు పాల్గొంటున్నారు. రాత్రి వేళ ఆకాశంలో వెలుగులు చిమ్మే "నైట్ ఫ్లయింగ్" ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హైదరాబాద్‌లో స్థిరపడిన వివిధ దేశాలు, రాష్ట్రాల వారు తమ ఇళ్లలో తయారు చేసిన 1,200 రకాల మిఠాయిలను ఇక్కడ రుచి చూడవచ్చు. అధునాతన డ్రోన్ షో: గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ షోలో డ్రోన్లతో సాకర్ ...
Bhatti Vikramarka | అన్నదాతకు ‘విద్యుత్’ వెలుగులు: 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్లు.. ఇక ‘1912’కు కొడితే విద్యుత్ అంబులెన్స్ హాజరు!
State, Hyderabad

Bhatti Vikramarka | అన్నదాతకు ‘విద్యుత్’ వెలుగులు: 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్లు.. ఇక ‘1912’కు కొడితే విద్యుత్ అంబులెన్స్ హాజరు!

హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ, రైతులకు, సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలను చేరువ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో క్వశ్చన్ అవర్ (ప్రశ్నోత్తరాల సమయం) సందర్భంగా విద్యుత్ శాఖపై జరిగిన చర్చకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. వ్యవసాయ కనెక్షన్ల జాతర: గణాంకాలు ఇవే.. గత ప్రభుత్వాల హయాంలో పేరుకుపోయిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తూ, విద్యుత్ శాఖ రికార్డు స్థాయిలో కనెక్షన్లు మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. 2022 జనవరి నుండి 2025 డిసెంబర్ వరకు మొత్తం 3,44,462 మంది రైతులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు కల్పించారు. పెరిగిన లోడ్‌కు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా 75,686 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. గడిచిన రెండేళ్లలోనే (2024, 2025) సుమారు 2 లక్షల అదనపు క...
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:
State, Hyderabad

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్:

14 మంది మావోయిస్టుల మృతి.. కీలక నేత హతం! రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి తూటాల గర్జన వినిపించింది. శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో మొత్తం 14 మంది మావోయిస్టులు (Maoist Encounter) మరణించారు. వీరిలో ఒక కీలక నేత కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. సుక్మా జిల్లాలో 12 మంది మృతి సుక్మా జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున పామ్లూరు గ్రామం సమీపంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ముఖ్య నేత హతం: ఈ ఎన్‌కౌంటర్‌లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి 'మంగడు' మరణించారు. ఇది మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. మృతులు: మొత్తం 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్...
error: Content is protected !!