Sarkar Live

State

​కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసిన అయినవోలు బిజెపి నాయకులు
warangal

​కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసిన అయినవోలు బిజెపి నాయకులు

కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ను ఐనవోలు భారతీయ జనతా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బిజెపి సీనియర్ నాయకులు భాస్కర్ తో కలిసి ఆడెపు విక్రమ్ మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఐనవోలు మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని మంత్రికి బహుకరించి, స్వామివారి ఆశీస్సులు అందజేశారు. 1100 ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర, కాకతీయుల కళావైభవం ఉట్టిపడే ఐనవోలు ఆలయాన్ని వారసత్వ సంపద (Heritage Site) గా గుర్తించాలని మంత్రికి విన్నవించారు. దీనిపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించినట్లు విక్రమ్ తెలిపారు.రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని మంత్రి సూచించారు....
ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’.. – Kakatiya Mega Textile Park
State

ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’.. – Kakatiya Mega Textile Park

ఈ నెల 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం Kakatiya Mega Textile Park | తెలంగాణ వస్త్ర పరిశ్రమకు కొత్త ఊపిరిని, వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’ (కేఎంటీపీ) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని శాయంపేట వద్ద 1,327 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టును, ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ప్రపంచస్థాయి సదుపాయాలతో.. 'పీఎం మిత్ర'లో చోటు 2017లో శంకుస్థాపన జరిగి, ప్రారంభ దశలో నెమ్మదిగా సాగిన ఈ పార్కు పనులు, కేంద్ర ప్రభుత్వ ‘పీఎం మిత్ర’ (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్) పథకంలో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజె...
వరంగల్ విమాన ప్రయాణానికి వేళాయె.. – Warangal Mamnoor Airport
State

వరంగల్ విమాన ప్రయాణానికి వేళాయె.. – Warangal Mamnoor Airport

త్వరలోనే మామూనూరు ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన! ​Warangal Mamnoor Airport | ఓ చారిత్రక నగరం.. మరో కీలక మైలురాయికి సిద్ధమవుతోంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, వరంగల్ వాసుల విమాన ప్రయాణ కల సాకారం కాబోతోంది. మామూనూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ​అడ్డంకులు తొలగి.. అభివృద్ధి బాటలో.. ​గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో విమానాశ్రయ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రన్‌వే విస్తరణకు అవసరమైన అదనపు భూమిని సేకరించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడం, డీజీసీఏ (DGCA) నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేస్తుండటంతో పనులు వేగవంతం అయ్యాయి. ​ఓరుగల్లుకు కొత్త ఊపు.. ​మామూనూరు ఎయిర్‌పోర్టు (Warangal Mamnoor Airport) అందుబాటులోక...
రేవంత్ రెడ్డికి ‘ఐడెంటిటీ క్రైసిస్’..  కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్!
State

రేవంత్ రెడ్డికి ‘ఐడెంటిటీ క్రైసిస్’.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్!

తెలంగాణ రాష్ట్ర సమితి (BRS Party) 25వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభవేళ, పార్టీ అధినేత కేసీఆర్ (KCR) అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం భవిష్యత్ రాజకీయ పోరాటానికి దిశానిర్దేశం చేసింది. అనంతరం మీడియాలో మాట్లాడిన కేటీఆర్, అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు బీజేపీ ఎంపీల వైఖరిపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు 'ముఖ్యమంత్రి పరిచయ కార్యక్రమం' నిర్వహించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలపై ఆగ్రహం: "తెలంగాణ అంటే పాకిస్థాన్ కాదు" పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోల్చడంపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మౌనం ఎందుకు?: "తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే అక్కడ ఉన్న 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాల్లా కూర్చున్నారు. ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అక్కడికక్కడే ని...
ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం: ‘ఆన్లైన్ ట్రక్ షీట్’ విధానాన్ని ఎత్తివేయాలని రైతుల డిమాండ్ – Agriculture News
State

ధాన్యం కొనుగోళ్లలో గందరగోళం: ‘ఆన్లైన్ ట్రక్ షీట్’ విధానాన్ని ఎత్తివేయాలని రైతుల డిమాండ్ – Agriculture News

​ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘ఆన్లైన్ ట్రక్ షీట్’ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే ఈ విధానాన్ని ఎత్తివేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ​ఏమిటీ సమస్య? ​సాధారణంగా రైతులు ఐకేపీ (IKP) సెంటర్లకు ధాన్యం తెచ్చినప్పుడు, గతంలో మాన్యువల్ పద్ధతిలో తూకం వేసి వెంటనే రశీదులు ఇచ్చేవారు. కానీ, ప్రస్తుతం అమలు చేస్తున్న ఆన్లైన్ ట్రక్ షీట్ విధానంలో సాంకేతిక సమస్యలు ప్రధాన అడ్డంకిగా మారాయి.ప్రధానంగా సర్వర్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.ఆన్లైన్ పోర్టల్ తరచూ మొరాయించడం వల్ల ట్రక్ షీట్లు జనరేట్ కావడానికి గంటల సమయం పట్టే అవకాశం ఉంది.అలాగే రవాణాలో కూడా జాప్యం జరిగే అవకాశం ఉంది.ట్రక్ షీట్ వస్తే తప్ప లారీలకు అనుమతి లభించని పరిస్థితి నెలకొంది.దీనివల్ల ధాన్యం బస్తాలు రో...
error: Content is protected !!